Shuru
Apke Nagar Ki App…
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగులకు ఘన వీడ్కోలు కార్యక్రమం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడలోతేది: 01-04-2025 (బుధవారం) రోజున పదవీ విరమణ పొందుతున్న మరియు బదిలీ అయిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
Satheesh gangu
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగులకు ఘన వీడ్కోలు కార్యక్రమం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడలోతేది: 01-04-2025 (బుధవారం) రోజున పదవీ విరమణ పొందుతున్న మరియు బదిలీ అయిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడలోతేది: 01-04-2025 (బుధవారం) రోజున పదవీ విరమణ పొందుతున్న మరియు బదిలీ అయిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.1
- కామారెడ్డి జిల్లా : క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చిన స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విశేష పతకాలు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను *జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* అభినందించారు. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల పాటు నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న స్పోర్ట్స్ హ్యకథాన్ లో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు, క్రీడాకారులు,స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలను రూపొందించారని తెలిపారు. *యువతలో సృజనాత్మకతను వెలికి తీసే ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని* అన్నారు. క్రీడల్లో పనితీరు,మెరుగుదల,శిక్షణ విధానాలు,ఫ్యాన్ ఎంగేజ్ మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులకు ఈ ఆవిష్కరణలు బాట వేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన షటిల్ బ్యాట్మెంటన్ క్రీడాకారులు అవని రెడ్డి మరియు ఆరాధ్య రెడ్డి *గోల్డ్ మెడల్* అండర్ 17 గర్ల్స్ డబుల్స్,2k రన్ మరియు కరాటె లో ధనుష్ కుమార్ అండర్ 14 లో *గోల్డ్ మెడల్*, శ్రీ వెంకట్ *సిల్వర్ మెడల్* అండర్ 9 boys సింగిల్స్,*జై ప్రీత్ మరియు జిశాన్ కాంస్య పతకం* అండర్ 13 boys డబుల్స్,*విష్ణు మరియు నియాన్ కాంస్య పతకం* అండర్ 15 boys డబుల్స్,చేతన *కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ సింగిల్స్,*అక్షర మరియు చేతన కాంస్య పతకం* అండర్ 15 గర్ల్స్ డబుల్స్ లో విజయం సాధించిన వారిని కలెక్టర్ అభినందించారు. అంతే కాకుండా జిల్లాలో క్రీడాకారులను వెలికి తీసి వారిని స్పోర్ట్స్ హ్యకథాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన (TITA) *తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ చెల్లాపురం శ్రీకాంత్* నీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్, కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాసవి గార్డెన్ సమీపంలో కుక్కల దాడితో ముగ్గురు గాయపడ్డారు. కుక్కల బెడద తో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన పరువురిని గాయపరచడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం ఆడుకుంటున్న ఓ బాలుడి పై దాడి చేసిన కుక్కలు.. మధ్యాహ్నం సమయంలో అదే బాధితుడి తాత పై దాడి చేసి గాయపరిచింది. ఆ బాలుడిని నెల రోజుల్లో కుక్కలు కరవడం రెండోసారి. అక్కడితో ఆగకుండా, మరో చిన్నారిని, అతని కుటుంబీకులను కూడా కుక్కలు వేటాడి కరిచాయి. వరుస ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.1
- *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- పేద ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, గ్రోస్ స్వచ్ఛంద సంస్థ సేవలు ఎనలేనివని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. మెదక్ పట్టణంలో గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొని, పేదలకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదలకు సహాయ పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంపత్, స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి జాయ్ ముర్రే పాల్గొన్నారు1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం మండలాల్లో బుధవారం మ.3 గంటలకు 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే లక్షెట్టిపేటలో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. అన్ని మండలాల్లో ఒకవైపు మబ్బు వాతావరణం ఉంటున్న ఎండ తీవ్రత కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.1
- శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దక్షిణ కాశిగా పేరుగాంచిన తెలంగాణ అతిపెద్ద దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన డీఈఓగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.1