logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_Bondhu Suresh
Bondhu Suresh
Atmakur, Spsr Nellore•
2 hrs ago

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    2 hrs ago
  • *భారతీయ జనతా పార్టీ స్టోన్ హౌస్ పేట మండలం (6,7,8,9,10 డివిజన్లు) లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా " మన ఊరు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం.* ఈ రోజు తేదీ సోమవారం 06-04-2026 ఉదయం 10:30 గంటలకు నెల్లూరు నగరం, స్టోన్ హౌస్ పేట మండలం 9వ డివిజన్ నవాబుపేట ఏరియా (opp)HP పెట్రోల్ బంక్ నందు మరియు 7వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు పిండి మిల్లు సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమాలకి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గౌరవనీయులు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు విచ్చేసి పార్టీ జెండాలు ఎగరవేయడం జరిగింది. వారు మాట్లాడుతూ 1980లో పార్టీ ప్రారంభమై ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరిగింది. మరియు మూడుసార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నాము , ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు , కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షులు కోసూరు వెంకట సుధీర్, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా మోర్చా కోస్తాంధ్ర ఇంచార్జ్ లక్ష్మీ ప్రియ, బిజెపి జిల్లా కార్యదర్శి మేడేపల్లి రత్నం నాయుడు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు లాల్ కాజా మస్తాన్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వి. హర్షవర్ధన్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాటక రాని జయచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు నీలి శెట్టి కోటేశ్వరరావు, ఎర్రమల్లి హరికృష్ణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కారుణ్య, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ పొట్టి శివ శంకర్, స్టోన్ హౌస్ పేట మండల ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి వెంకట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు ఉచ్చూరు ముని మోహన్, చీమలదిన్నె లక్ష్మయ్య, జూలుగంటి మణికంఠేశ్వరరావు, కార్యదర్శులు ఓంకారం వెంకటేశ్వర్లు, భీమవరపు చిన్న రాఘవేంద్ర, నారపనేని శివ, మంచి కలపాటి నవీన్, కోశాధికారి మెంటా జ్ఞానేశ్వర్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి భీమవరపు వినయ్, మండల యువ మోర్చా అధ్యక్షుడు లక్కాకుల నరేష్, మండల మహిళా మోర్చా అధ్యక్షులు అశ్విని , మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు మందా రవి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బి రామయ్య, మండల గిరిజన మోర్చా అధ్యక్షులు కుప్పచర్ల మణి, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే ఖాదర్ మస్తాన్ , మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి గుర్రం హర్ష, మండల యువ మోర్చా కార్యదర్శి దినేష్,మండల యువమోర్చా కార్యదర్శి పాదర్తి సాయి,బిజెపి సీనియర్ నాయకులు ఎర్ర శ్రీనివాసులు, నర్సాపురం సుబ్రమణ్యం, తిరుమల శెట్టి రవి,మండల కార్యవర్గ సభ్యులు గుబ్బ శ్రీను, బిజెపి నాయకులు సురేష్ ,రాంబాబు, సాయి, వాడపర్తి ప్రవీణ్, వాసు, అభిమానులు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
    3
    *భారతీయ జనతా పార్టీ స్టోన్ హౌస్ పేట మండలం (6,7,8,9,10 డివిజన్లు) లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా " మన ఊరు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం.*
ఈ రోజు తేదీ సోమవారం 06-04-2026 ఉదయం 10:30 గంటలకు నెల్లూరు నగరం, స్టోన్ హౌస్ పేట మండలం 9వ డివిజన్ నవాబుపేట ఏరియా (opp)HP పెట్రోల్ బంక్ నందు మరియు 7వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు పిండి మిల్లు సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమాలకి  ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గౌరవనీయులు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు విచ్చేసి పార్టీ జెండాలు ఎగరవేయడం జరిగింది. వారు మాట్లాడుతూ 1980లో పార్టీ ప్రారంభమై ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరిగింది. మరియు మూడుసార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నాము , ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు , కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షులు కోసూరు వెంకట సుధీర్, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా మోర్చా కోస్తాంధ్ర ఇంచార్జ్ లక్ష్మీ ప్రియ, బిజెపి జిల్లా కార్యదర్శి మేడేపల్లి రత్నం నాయుడు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు లాల్ కాజా మస్తాన్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వి. హర్షవర్ధన్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాటక రాని జయచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు నీలి శెట్టి కోటేశ్వరరావు, ఎర్రమల్లి హరికృష్ణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కారుణ్య, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ పొట్టి శివ శంకర్, స్టోన్ హౌస్ పేట మండల ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి వెంకట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు ఉచ్చూరు ముని మోహన్, చీమలదిన్నె లక్ష్మయ్య, జూలుగంటి మణికంఠేశ్వరరావు, కార్యదర్శులు ఓంకారం వెంకటేశ్వర్లు, భీమవరపు చిన్న రాఘవేంద్ర, నారపనేని శివ, మంచి కలపాటి నవీన్, కోశాధికారి మెంటా జ్ఞానేశ్వర్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి భీమవరపు వినయ్, మండల యువ మోర్చా అధ్యక్షుడు లక్కాకుల నరేష్, మండల మహిళా మోర్చా అధ్యక్షులు అశ్విని , మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు మందా రవి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బి రామయ్య, మండల గిరిజన మోర్చా అధ్యక్షులు కుప్పచర్ల మణి, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే ఖాదర్ మస్తాన్ , మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి గుర్రం హర్ష, మండల యువ మోర్చా కార్యదర్శి దినేష్,మండల యువమోర్చా కార్యదర్శి పాదర్తి సాయి,బిజెపి సీనియర్ నాయకులు ఎర్ర శ్రీనివాసులు, నర్సాపురం సుబ్రమణ్యం, తిరుమల శెట్టి రవి,మండల కార్యవర్గ సభ్యులు గుబ్బ శ్రీను, బిజెపి నాయకులు సురేష్ ,రాంబాబు, సాయి, వాడపర్తి ప్రవీణ్, వాసు, అభిమానులు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బద్వేలు అర్బన్ ఏప్రిల్ 05 : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మైదుకూరు రోడ్డు అన్న క్యాంటీన్ మంచినీటి చలివేంద్రం వద్ద బద్వేలు పట్టణానికి చెందిన పిండి రిషికేశగుప్త (పెద్దశెట్టి) వారి సతీమణి నళిని భారతి జన్మదినోత్సవం పురస్కరించుకొని సుమారు 400 మందికి పైగా పాదాచారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమళ్ల వెంకట నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, అనంతరం కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటర్ వితరణ చేయడమే కాకుండా ప్రజల దాహర్తి తీర్చుటకు ఉచిత మజ్జిగ సెంటర్ ను గత ఏడు సంవత్సరాలుగా బద్వేల్ ప్రాంతంలో దాతలు సహకారంతో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు, మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి మజ్జిగ వితరణకు సహకరించాలన్నారు, అనంతరం శనివారం మజ్జిగ వితరణ చేసిన రిషికేశ గుప్తాను శాలువాతో సత్కరించి వారిని అభినందించారు,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్, ఆవోప సెక్రటరీ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ (వస్త్రం) వల్లంకొండు అనిత్, పాల్గొన్నారు
    1
    బద్వేలు అర్బన్ ఏప్రిల్ 05 : 
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మైదుకూరు రోడ్డు అన్న క్యాంటీన్ మంచినీటి చలివేంద్రం వద్ద  బద్వేలు పట్టణానికి చెందిన పిండి రిషికేశగుప్త (పెద్దశెట్టి) వారి సతీమణి నళిని భారతి జన్మదినోత్సవం పురస్కరించుకొని సుమారు 400 మందికి పైగా పాదాచారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమళ్ల వెంకట నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, అనంతరం కమిషనర్ నరసింహారెడ్డి  మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటర్ వితరణ చేయడమే కాకుండా ప్రజల దాహర్తి తీర్చుటకు ఉచిత మజ్జిగ సెంటర్ ను గత ఏడు సంవత్సరాలుగా బద్వేల్ ప్రాంతంలో దాతలు సహకారంతో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు, మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి మజ్జిగ వితరణకు సహకరించాలన్నారు, అనంతరం శనివారం మజ్జిగ వితరణ చేసిన రిషికేశ గుప్తాను శాలువాతో సత్కరించి వారిని అభినందించారు,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్, ఆవోప సెక్రటరీ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ (వస్త్రం) వల్లంకొండు అనిత్, పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అలంకానుపల్లి కి చెందిన పెద్ద దస్తగిరి హత్య పై సిట్ దర్యాప్తు చేయాలి శాంతిభద్రతలు కాపాడటంలో, గంజాయి మూకలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన ఎస్పీ నచికేతన్ ను బదిలీ చేయాలి సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ స్టేషన్లు ఆసుపత్రిలో హత్య చేయడం జిల్లా చరిత్రలో మాయని మచ్చ గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి సోమవారం తెల్లవారుజామున కడప రిమ్స్ ప్రాంగణంలో గంజాయి మూకల చేతిలో దారుణ హత్యకు గురైన కడప నగరం అలంకానపల్లెకు చెందిన పెద్ద దస్తగిరి డెడ్ బాడీని రిమ్సు మార్చరీలో పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కడప నగరం అలంకరణపల్లెలో జరిగిన మారమ్మ జాతరలో తలెత్తిన వివాదం ఆదివారం రాత్రి 11 గంటలకు గంజాయి మూకలు కత్తులు పట్టుకొని దస్తగిరి ఇంటిపై దాడికి తెగబడ్డారు, అడ్డువచ్చిన ఇరుగుపొరుగు వారిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి అన్నారు. జరిగిన ఘటనను సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకుండా, రిమ్స్ హాస్పిటల్కు పోయి అడ్మిట్ కావాలని ఉచిత సలహాలు ఇవ్వగా, తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నదని పోలీసులకు చెప్పిన సకాలంలో పోలీసుల స్పందించకపోవడం పర్యావసానమే వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి లపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో రిమ్స్ లో మాటు వేసి పెద్ద దస్తగిరి పై కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. చిన్న దస్తగిరి కి కూడా కత్తిపోట్లు పడ్డాయన్నారు. జిల్లా కేంద్రం కడప నడిబొడ్డులో ఇంత జరుగుతున్న పోలీసు అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ద్రోన్ కెమెరాల పేరుతో, విస్తృత దాడుల పేరుతో ప్రచార ఆర్భాటాలు మాత్రమే పోలీసు అధికారులు చేస్తూ అసలు గంజాయి విక్రయ దారులు, సప్లైదారులు, వాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దమనుషుల జోలికి పోకుండా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుస్తూ శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేసారని వారు ఆరోపించారు. గంజాయి మూకలు గ్యాంగ్స్టర్లుగా మారి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ చుట్టూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన ఎంతటి వారినైనా మట్టు పెట్టడానికి కిరాయి హంతకులుగా మారుతున్నారని వారన్నారు. సమాజంలో గంజాయి మూకల ప్రమాదం ఉన్నదని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం సహించరానిది అన్నారు. నేరాలను ముందస్తుగా నివారించేందుకు 100కు డయల్ చేయమని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో రాత్రి 10 దాటితే నంబర్ పనిచేయదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్షనిజానికి పేరుగాంచిన కడప జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఫ్యాక్షన్లో చంపుకున్న ఘటనలు ఉన్నాయి కానీ ఆసుపత్రిలో ఉన్న వరిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. చంపిన వారిని తక్షణం అరెస్టు చేసి, సిట్ దర్యాప్తు జరిపించాలని, శాంతిభద్రతలు కాపాడడంలో, గంజాయిని అరికట్టడంలో విఫలమైన జిల్లా ఎస్పీ నచ్చకేతన్ను తక్షణం బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి కే.సి.బాదుల్లా ఎన్ వెంకట శివ బ్రహ్మం, మల్లికార్జున, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.
    1
    అలంకానుపల్లి కి చెందిన పెద్ద దస్తగిరి హత్య పై సిట్ దర్యాప్తు చేయాలి 
శాంతిభద్రతలు కాపాడటంలో, గంజాయి మూకలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన ఎస్పీ నచికేతన్ ను బదిలీ చేయాలి 
సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ స్టేషన్లు 
ఆసుపత్రిలో హత్య చేయడం జిల్లా చరిత్రలో మాయని మచ్చ 
గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి 
సోమవారం తెల్లవారుజామున కడప రిమ్స్ ప్రాంగణంలో గంజాయి మూకల చేతిలో దారుణ హత్యకు గురైన కడప నగరం అలంకానపల్లెకు చెందిన పెద్ద దస్తగిరి డెడ్ బాడీని రిమ్సు మార్చరీలో పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కడప నగరం అలంకరణపల్లెలో జరిగిన మారమ్మ జాతరలో తలెత్తిన వివాదం ఆదివారం రాత్రి 11 గంటలకు గంజాయి మూకలు కత్తులు పట్టుకొని దస్తగిరి ఇంటిపై దాడికి తెగబడ్డారు, అడ్డువచ్చిన ఇరుగుపొరుగు వారిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి అన్నారు. జరిగిన ఘటనను సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకుండా, రిమ్స్ హాస్పిటల్కు పోయి అడ్మిట్ కావాలని ఉచిత సలహాలు ఇవ్వగా, తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నదని పోలీసులకు చెప్పిన సకాలంలో పోలీసుల స్పందించకపోవడం పర్యావసానమే వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి లపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో రిమ్స్ లో మాటు వేసి పెద్ద దస్తగిరి పై కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. చిన్న దస్తగిరి కి కూడా కత్తిపోట్లు పడ్డాయన్నారు. జిల్లా కేంద్రం కడప నడిబొడ్డులో ఇంత జరుగుతున్న పోలీసు అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ద్రోన్ కెమెరాల పేరుతో, విస్తృత దాడుల పేరుతో ప్రచార ఆర్భాటాలు మాత్రమే పోలీసు అధికారులు చేస్తూ అసలు గంజాయి విక్రయ దారులు, సప్లైదారులు, వాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దమనుషుల జోలికి పోకుండా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుస్తూ శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేసారని వారు ఆరోపించారు. గంజాయి మూకలు గ్యాంగ్స్టర్లుగా మారి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ చుట్టూ జనాన్ని  భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన ఎంతటి వారినైనా మట్టు పెట్టడానికి కిరాయి హంతకులుగా మారుతున్నారని వారన్నారు. సమాజంలో గంజాయి మూకల ప్రమాదం ఉన్నదని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం సహించరానిది అన్నారు. నేరాలను ముందస్తుగా నివారించేందుకు 100కు డయల్ చేయమని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో రాత్రి 10 దాటితే నంబర్ పనిచేయదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్షనిజానికి పేరుగాంచిన కడప జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఫ్యాక్షన్లో చంపుకున్న ఘటనలు ఉన్నాయి కానీ ఆసుపత్రిలో ఉన్న వరిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. చంపిన వారిని తక్షణం అరెస్టు చేసి, సిట్ దర్యాప్తు జరిపించాలని, శాంతిభద్రతలు కాపాడడంలో, గంజాయిని అరికట్టడంలో విఫలమైన జిల్లా ఎస్పీ నచ్చకేతన్ను తక్షణం బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి కే.సి.బాదుల్లా ఎన్ వెంకట శివ బ్రహ్మం, మల్లికార్జున, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 
గాలి చంద్ర 
సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అల్లూరి జిల్లా,అనంతగిరి మండలంలో గల పినకోట పంచాయతీ పరిది అడవుల్లో అడవి దున్నలు విస్తృతంగా సంచరిస్తున్నాయి. సోమవారం చింతపాక, అరేమాను గురువు మధ్య ఉన్న జీడీతోటల్లో అడవిదున్న కనిపించినట్లు స్థానికులు తెలిపారు.కొండ పోడు,జీడి మామిడి తోటలకు అలాగే పశువులకి వెళ్లాలన్నా చాలా భయంగా ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జీడీ తోటలకు ఒంటరిగా వెళ్లలంటే భయంగా ఉందని ప్రజలు వాపోయారు. సంబందించిన అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు..
    1
    అల్లూరి జిల్లా,అనంతగిరి మండలంలో గల పినకోట పంచాయతీ పరిది అడవుల్లో అడవి దున్నలు విస్తృతంగా సంచరిస్తున్నాయి.
సోమవారం చింతపాక, అరేమాను గురువు మధ్య ఉన్న జీడీతోటల్లో అడవిదున్న కనిపించినట్లు స్థానికులు తెలిపారు.కొండ పోడు,జీడి మామిడి తోటలకు అలాగే 
పశువులకి వెళ్లాలన్నా చాలా భయంగా ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జీడీ తోటలకు ఒంటరిగా వెళ్లలంటే భయంగా ఉందని ప్రజలు వాపోయారు. సంబందించిన అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు..
    user_Laxman Regam
    Laxman Regam
    Citizen information bureau అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 min ago
  • రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత యువత, విద్యార్థులకు రోడ్డు నిబంధనలపట్ల అవగాహన అవసరం మదర్ థెరిసా కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు సిబ్బందికి హెల్మెట్ల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి. రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేర్ శాసన సభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు భద్రత - హెల్మెట్ ప్రాధాన్యత పై తెలియజేశారు.కేవలం హెల్మెట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదని, వాటిని ధరించడం వల్ల కలిగే రక్షణ గురించి అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ISI గుర్తు ఉన్న నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే వాడాలని ఆయన సూచించారు. రోడ్డు పక్కన దొరికే నాసిరకం హెల్మెట్లు వాడటం వల్ల ప్రమాద సమయంలో సరైన రక్షణ లభించదని హెచ్చరించారు.ఇక రాత్రి సమయాల్లో హెల్మెట్ గ్లాస్‌పై పడే లైటింగ్ రిఫ్లెక్షన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండ కలిగి ఉండాలని కోరారు.లైసెన్స్ లేని విద్యార్థుల కోసం కాలేజీలోనే ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి లైసెన్స్‌లు ఇప్పించేందుకు రవాణా శాఖ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. టీనేజ్ వయస్సులో వేగంగా వాహనాలు నడపాలనే ఉత్సాహం ఉంటుందని, కానీ అది ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఒక చిన్న పొరపాటు వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, దానివల్ల మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. ఇక మాదకద్రవ్యాల కు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని.ఆవేదన వ్యక్తం చేశారు.ఏ విధమైన చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని హితవు పలికారు.మీరు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగితే అది మీ కుటుంబానికి మరియు మీరు చదువుకున్న సంస్థలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇక మీదట ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రసాద్ నాయుడు,భరత్, జయసింహా,రహీంభాషా, శ్రీనివాసులు, సురేష్, బాలాజీ, రవి మరియు కళాశాల యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత యువత, విద్యార్థులకు రోడ్డు నిబంధనలపట్ల అవగాహన అవసరం
మదర్ థెరిసా కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు సిబ్బందికి హెల్మెట్ల పంపిణి
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి. 
రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేర్ శాసన సభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన  కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు.
రోడ్డు భద్రత - హెల్మెట్ ప్రాధాన్యత పై తెలియజేశారు.కేవలం హెల్మెట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదని, వాటిని ధరించడం వల్ల కలిగే రక్షణ గురించి అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ముఖ్యంగా ISI గుర్తు ఉన్న నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే వాడాలని ఆయన సూచించారు. రోడ్డు పక్కన దొరికే నాసిరకం హెల్మెట్లు వాడటం వల్ల ప్రమాద సమయంలో సరైన రక్షణ లభించదని హెచ్చరించారు.ఇక రాత్రి సమయాల్లో హెల్మెట్ గ్లాస్‌పై పడే లైటింగ్ రిఫ్లెక్షన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండ కలిగి ఉండాలని కోరారు.లైసెన్స్ లేని విద్యార్థుల కోసం కాలేజీలోనే ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి లైసెన్స్‌లు ఇప్పించేందుకు రవాణా శాఖ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. టీనేజ్ వయస్సులో వేగంగా వాహనాలు నడపాలనే ఉత్సాహం ఉంటుందని, కానీ అది ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఒక చిన్న పొరపాటు వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, దానివల్ల మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. ఇక మాదకద్రవ్యాల కు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు.
డ్రగ్స్  వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని.ఆవేదన వ్యక్తం చేశారు.ఏ విధమైన చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని హితవు పలికారు.మీరు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగితే అది మీ కుటుంబానికి మరియు మీరు చదువుకున్న సంస్థలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇక మీదట 
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రసాద్ నాయుడు,భరత్, జయసింహా,రహీంభాషా, శ్రీనివాసులు, సురేష్, బాలాజీ, రవి మరియు కళాశాల యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    34 min ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    23 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.