logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డిపై పీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ప్రతాప్ రెడ్డి… నీవొక రాజకీయ అజ్ఞానివి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన… అధికార ఆశతో ఎన్ని పార్టీలు మారతావని ప్రశ్నించారు.హరీష్ రావు బండారం బయటపెడతానన్న మాటలేమయ్యాయని నిలదీస్తూ…కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడుపోయావని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలనుమరిచిపోయి… ఇప్పుడు అదే నేతలతో కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు పూర్తిగా విఫలమైందని…ఉదయం 10 గంటలకే ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయని తెలిపారు.కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా సీఎం ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచగా… దానిని తొలగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని ప్రతాప్ రెడ్డిని ప్రశ్నించారు.ప్రజల సమస్యలు వినడానికి కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ…ప్రతాప్ రెడ్డి వంటి నేతల విమర్శలకు కాంగ్రెస్ నేతలు భయపడరని నాయిని యాదగిరి స్పష్టం చేశారు.గజ్వేల్‌లో ఈ రాజకీయ ఆరోపణలు…ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

6 hrs ago
user_GOUSE BEURO REPORTER
GOUSE BEURO REPORTER
రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
6 hrs ago
4e32b79b-d58d-4bf5-b8bd-4d4506c66ef9

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డిపై పీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ప్రతాప్ రెడ్డి… నీవొక రాజకీయ అజ్ఞానివి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన

ఆయన… అధికార ఆశతో ఎన్ని పార్టీలు మారతావని ప్రశ్నించారు.హరీష్ రావు బండారం బయటపెడతానన్న మాటలేమయ్యాయని నిలదీస్తూ…కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడుపోయావని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలనుమరిచిపోయి… ఇప్పుడు అదే నేతలతో కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక

బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు పూర్తిగా విఫలమైందని…ఉదయం 10 గంటలకే ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయని తెలిపారు.కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా సీఎం ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచగా… దానిని తొలగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని

ప్రతాప్ రెడ్డిని ప్రశ్నించారు.ప్రజల సమస్యలు వినడానికి కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ…ప్రతాప్ రెడ్డి వంటి నేతల విమర్శలకు కాంగ్రెస్ నేతలు భయపడరని నాయిని యాదగిరి స్పష్టం చేశారు.గజ్వేల్‌లో ఈ రాజకీయ ఆరోపణలు…ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన సీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు అమ్మవారికి గరుడ గంగా నది జిల్లాలతో అభిషేకం పంచ అంతా అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రులంకరణ చేసి పసుపు కుంకుమతో అలంకరించారు అనంతరం పుష్పాలంకరణ నిమ్మకాయల హారం అలంకరణ చేశారు సహస్రనామారచన కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగించారు ఆలయ ఈవో వీరేశమ ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు
    1
    తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన సీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు అమ్మవారికి గరుడ గంగా నది జిల్లాలతో అభిషేకం పంచ అంతా అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రులంకరణ చేసి పసుపు కుంకుమతో అలంకరించారు అనంతరం పుష్పాలంకరణ నిమ్మకాయల హారం అలంకరణ చేశారు సహస్రనామారచన కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగించారు ఆలయ ఈవో వీరేశమ ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • పత్రిక ప్రకటన తేది: 07.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH), కమారెడ్డి లో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (HDS) సమావేశం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించబడింది. సమావేశం ప్రారంభంలో సభ్య కార్యదర్శి/సూపరింటెండెంట్ హాజరైన సభ్యులను ఆహ్వానించారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు: గత సమావేశపు నిమిషాలను పరిశీలించి, తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన పనుల్లో సుమారు 99% పూర్తయ్యాయని వెల్లడించారు. హెచ్‌డీఎస్ నిధుల ఆర్థిక స్థితిపై వివరాలు అందించారు. సుమారు ₹18 లక్షలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అందులో ₹10 లక్షలు క్యాన్సర్ కేర్ మరియు పాలియేటివ్ సేవలకు కేటాయించగా, ₹2 లక్షలు హాస్పిటల్ క్యాంటీన్ కాషన్ డిపాజిట్‌గా వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను పెండింగ్ పనుల కోసం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా వినియోగించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే కేసీఆర్ కిట్ అమలు తర్వాత ప్రసూతి కేసుల పెరుగుదలపై వివరాలు కోరడంతో పాటు ట్రామా కేసుల గణాంకాలను సమర్పించాలని సూచించారు. హాస్పిటల్‌లో సీటీ స్కాన్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రామా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోందని చర్చించారు. ప్రస్తుత టి-హబ్ భవనంలో సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు రాజన్న సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (SDP) అందుబాటులో లేకపోవడంపై ప్రస్తావించారు. యంత్రం ఉన్నప్పటికీ ప్రతి యూనిట్‌కు సుమారు ₹8000 వ్యయం అవుతున్నందున ఆర్థిక పరిమితులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే ఇండెంట్ పంపించాలని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య తీర్మానంగా జీజీహెచ్ ఆసుపత్రిని కొత్త భవనానికి మార్చే అంశంపై చర్చించారు. మెడికల్ కాలేజ్ భవనం జూన్ నాటికి పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. కాలేజ్ అక్కడికి మారిన అనంతరం ప్రస్తుత ఎంసిహెచ్ భవనాన్ని ఆసుపత్రి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మార్పు ప్రక్రియ పర్యవేక్షణ కోసం TSMIDC, R&B ఇంజినీర్లు, సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, అదనపు కలెక్టర్, DMHO, RDO RMOలతో కమిటీ ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రాజన్న హాస్పిటల్‌కు ఒక వెంటిలేటర్ అందజేస్తామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగాన్ని బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశం లో aclb మధుమెహన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, సుపేరేండెంట్ వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్ వాల్యా, rdo NV గిరి, ee ఆర్ అండ్ బి, ee pr, సంబంధిత అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన
తేది: 07.04.2026
కామారెడ్డి జిల్లా, మంగళవారం
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH), కమారెడ్డి లో హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (HDS) సమావేశం జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన, ఎమ్మెల్యే  వెంకట రమణ రెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించబడింది.
సమావేశం ప్రారంభంలో సభ్య కార్యదర్శి/సూపరింటెండెంట్ హాజరైన సభ్యులను ఆహ్వానించారు.
సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు:
గత సమావేశపు నిమిషాలను పరిశీలించి, తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన పనుల్లో సుమారు 99% పూర్తయ్యాయని వెల్లడించారు.
హెచ్‌డీఎస్ నిధుల ఆర్థిక స్థితిపై వివరాలు అందించారు. సుమారు ₹18 లక్షలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అందులో ₹10 లక్షలు క్యాన్సర్ కేర్ మరియు పాలియేటివ్ సేవలకు కేటాయించగా, ₹2 లక్షలు హాస్పిటల్ క్యాంటీన్ కాషన్ డిపాజిట్‌గా వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను పెండింగ్ పనుల కోసం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా వినియోగించనున్నట్లు వివరించారు.
ఎమ్మెల్యే కేసీఆర్ కిట్ అమలు తర్వాత ప్రసూతి కేసుల పెరుగుదలపై వివరాలు కోరడంతో పాటు ట్రామా కేసుల గణాంకాలను సమర్పించాలని సూచించారు.
హాస్పిటల్‌లో సీటీ స్కాన్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రామా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోందని చర్చించారు. ప్రస్తుత టి-హబ్ భవనంలో సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు రాజన్న సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (SDP) అందుబాటులో లేకపోవడంపై ప్రస్తావించారు. యంత్రం ఉన్నప్పటికీ ప్రతి యూనిట్‌కు సుమారు ₹8000 వ్యయం అవుతున్నందున ఆర్థిక పరిమితులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే ఇండెంట్ పంపించాలని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్య తీర్మానంగా జీజీహెచ్ ఆసుపత్రిని కొత్త భవనానికి మార్చే అంశంపై చర్చించారు. మెడికల్ కాలేజ్ భవనం జూన్ నాటికి పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. కాలేజ్ అక్కడికి మారిన అనంతరం ప్రస్తుత ఎంసిహెచ్ భవనాన్ని ఆసుపత్రి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ మార్పు ప్రక్రియ పర్యవేక్షణ కోసం TSMIDC, R&B ఇంజినీర్లు, సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, అదనపు కలెక్టర్, DMHO, RDO  RMOలతో కమిటీ ఏర్పాటు చేశారు.
రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రాజన్న హాస్పిటల్‌కు ఒక వెంటిలేటర్ అందజేస్తామని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగాన్ని బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమావేశం లో aclb మధుమెహన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, సుపేరేండెంట్ వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్ వాల్యా, rdo NV గిరి, ee ఆర్ అండ్ బి, ee pr, సంబంధిత అధికారులు, తదితరులు,  పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ లో డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వేను పరిశీలించి లోపాలను ఎత్తి చూపారు. పలు డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బి.ఎల్.ఓ) లు పని చేస్తున్నట్టు కనిపించడం, కానీ బి.ఎల్.ఓ లు డివిజన్ లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నుల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బి.ఎల్.ఓ లు వారి పై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లే భాద్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాలో మరణించినవారి ఓట్లు యధాతథంగా ఉండడం, బ్రతికున్నవారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్ లో ఒక ఇంటిలో ఉన్న నాలుగు ఓట్లు నలుదిక్కుల నాలుగు ఇతర డివిజన్లలో బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో దొంగ ఓట్లు నమోదు చేయించడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటరు జాబితాలో పేరు ఒకటి, ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని తెలిపారు. తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు ఓటరు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ “సర్” నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లకు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో తెలంగాణలో సర్ నిబంధనను అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
    2
    కరీంనగర్ లో డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వేను పరిశీలించి లోపాలను ఎత్తి చూపారు. పలు  డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బి.ఎల్.ఓ) లు పని చేస్తున్నట్టు కనిపించడం, కానీ బి.ఎల్.ఓ లు డివిజన్ లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నుల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని తెలిపారు. ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బి.ఎల్.ఓ లు వారి పై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లే భాద్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఓటరు జాబితాలో మరణించినవారి ఓట్లు యధాతథంగా ఉండడం, బ్రతికున్నవారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్ లో ఒక ఇంటిలో ఉన్న నాలుగు ఓట్లు నలుదిక్కుల నాలుగు ఇతర డివిజన్లలో బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో  దొంగ ఓట్లు నమోదు చేయించడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటరు జాబితాలో పేరు ఒకటి, ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని తెలిపారు. తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు ఓటరు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ “సర్” నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లకు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో తెలంగాణలో సర్ నిబంధనను అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    51 min ago
  • ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. వేములవాడ పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు.అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
    1
    ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని 
కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
వేములవాడ పట్టణంలోని మహాత్మాజ్యోతి బాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, కిచెన్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ చార్ట్ పరిశీలించి.. ఏ ఏ వంటకాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తమ కుటుంబంలో పిల్లలకు ఆహార పదార్థాలు ఎలా సిద్ధం చేస్తారో అలాగే ఇక్కడ విద్యార్థుల కోసం వండాలని ఆదేశించారు.అనంతరం 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని, ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో ముందే రాసుకోవాలని, దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టులు చదవడం, రాయడం పూర్తి చేయాలని తెలిపారు. రైటింగ్ కూడా సాధన చేయాలని, వార్షిక పరీక్షల సమయానికి అనుగుణంగా ఇప్పుడు అదే సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సాధన చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి మార్కులు మీరు తర్వాత చదివే ఉన్నత తరగతులకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులం దరూ రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఏ నేపథ్యం నుంచి వచ్చినా.. ఇప్పుడు ఇష్టపడి సాధన చేయడం.. అన్ని సబ్జెక్టుల్లో రాణించడంతో వారి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని, ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో రూ.5 లక్షల వ్యయంతో కూనవాణిపల్లి పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ప్రారంభించారు.
గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ గారు వాటర్ ట్యాంక్ నుండి పెద్దమ్మ గుడి వరకు ఈ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బోయిని బాలయ్య, బామండ్ల మల్లేష్, కూన శ్రవంతి, MRPS మండల అధ్యక్షులు రేపాక బాబు, కూన చంద్రశేఖర్, కూన రవి, కూన రాజు, కూన సతీష్, కూన శ్రీనివాస్, జెరిపోతుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
    user_Shuru
    Shuru
    Grain Importer గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • గన్నేరువరం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో మాజీ సుడ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో 
మాజీ సుడ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో  ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. 
ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్, నేత సుధాకర్, మీసాల ప్రభాకర్, కొట్టే భూమయ్య, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు  పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • “ప్రతాప్ రెడ్డి… నీవొక రాజకీయ అజ్ఞానివి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన… అధికార ఆశతో ఎన్ని పార్టీలు మారతావని ప్రశ్నించారు.హరీష్ రావు బండారం బయటపెడతానన్న మాటలేమయ్యాయని నిలదీస్తూ…కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడుపోయావని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలనుమరిచిపోయి… ఇప్పుడు అదే నేతలతో కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు పూర్తిగా విఫలమైందని…ఉదయం 10 గంటలకే ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయని తెలిపారు.కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా సీఎం ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచగా… దానిని తొలగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని ప్రతాప్ రెడ్డిని ప్రశ్నించారు.ప్రజల సమస్యలు వినడానికి కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ…ప్రతాప్ రెడ్డి వంటి నేతల విమర్శలకు కాంగ్రెస్ నేతలు భయపడరని నాయిని యాదగిరి స్పష్టం చేశారు.గజ్వేల్‌లో ఈ రాజకీయ ఆరోపణలు…ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
    4
    “ప్రతాప్ రెడ్డి… నీవొక రాజకీయ అజ్ఞానివి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన…
అధికార ఆశతో ఎన్ని పార్టీలు మారతావని ప్రశ్నించారు.హరీష్ రావు బండారం బయటపెడతానన్న మాటలేమయ్యాయని నిలదీస్తూ…కేసీఆర్‌కు ఎంతకు అమ్ముడుపోయావని సూటిగా ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలనుమరిచిపోయి…
ఇప్పుడు అదే నేతలతో కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఇక బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు పూర్తిగా విఫలమైందని…ఉదయం 10 గంటలకే ప్రైవేట్, ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయని తెలిపారు.కాంగ్రెస్ నేతలు శాంతియుతంగా సీఎం ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచగా…
దానిని తొలగించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని ప్రతాప్ రెడ్డిని ప్రశ్నించారు.ప్రజల సమస్యలు వినడానికి కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ…ప్రతాప్ రెడ్డి వంటి నేతల విమర్శలకు కాంగ్రెస్ నేతలు భయపడరని నాయిని యాదగిరి స్పష్టం చేశారు.గజ్వేల్‌లో ఈ రాజకీయ ఆరోపణలు…ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • పత్రిక ప్రకటన తేది: 07.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ టోల్ ఫ్రీ నంబర్ 9908712421 మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని రూమ్ నెం. 25లో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తిన పక్షంలో ప్రజలు వెంటనే స్పందించేందుకు ఈ మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సెల్‌కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 9908712421 ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉన్న యెడల ప్రజలు ఈ నంబర్‌కు సంప్రదించి తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. ఈ మానిటరింగ్ సెల్ తేది :07.04.2026 నుండి తేది : 30.06.2026 వరకు పని చేస్తుందని, ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని త్రాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందులో ఇండస్ట్రీ ఆఫీసర్ లాలు, sc కార్పొరేషన్ వెంకటశ్వర్లు, dlpo శ్రీనివాస్, మెప్మా శ్రీధర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది: 07.04.2026
కామారెడ్డి జిల్లా 
మంగళవారం 
డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 
టోల్ ఫ్రీ నంబర్ 9908712421
మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని రూమ్ నెం. 25లో ఏర్పాటు చేసిన  డ్రింకింగ్ వాటర్ మానిటరింగ్ సెల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తిన పక్షంలో ప్రజలు వెంటనే స్పందించేందుకు ఈ మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సెల్‌కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ 9908712421 ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా త్రాగునీటి సమస్యలు ఉన్న యెడల ప్రజలు ఈ నంబర్‌కు సంప్రదించి తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు.
ఈ మానిటరింగ్ సెల్ తేది :07.04.2026 నుండి తేది : 30.06.2026 వరకు పని చేస్తుందని, ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని త్రాగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందులో ఇండస్ట్రీ ఆఫీసర్ లాలు, sc కార్పొరేషన్ వెంకటశ్వర్లు, dlpo శ్రీనివాస్, మెప్మా శ్రీధర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • కోరిన కోర్కెలు తీర్చే కోడే మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చెందిన 300 కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. తిప్పాపురం గోశాలలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ పర్యవేక్షణలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 150 మంది రైతులకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేశారు. భక్తి భావంతో భక్తులు రాజన్నకు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమితికి మించి ఉన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల ముసుగులో ఇతరులు కోడెలు పొందే అవకాశం లేదని, ప్రస్తుతం రాజన్న కోడెలు పొందిన రైతులు అక్రమంగా విక్రయించినా వ్యవసాయేతర పనులకు వినియోగించినా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రాజన్న కోడెలను జియో ట్యాగింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానం పై వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోడెల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 150 కోట్లతో విశాలమైన గోశాల నిర్మించబోతున్నామని తెలిపారు. రైతులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
    2
    కోరిన కోర్కెలు తీర్చే కోడే మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలకు చెందిన 300 కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. తిప్పాపురం గోశాలలో కలెక్టర్ గరిమా అగ్రవాల్ పర్యవేక్షణలో కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 150 మంది రైతులకు రెండు కోడెల చొప్పున పంపిణీ చేశారు. భక్తి భావంతో భక్తులు రాజన్నకు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమితికి మించి ఉన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతుల ముసుగులో ఇతరులు కోడెలు పొందే అవకాశం లేదని, ప్రస్తుతం రాజన్న కోడెలు పొందిన రైతులు అక్రమంగా విక్రయించినా వ్యవసాయేతర పనులకు వినియోగించినా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. రాజన్న కోడెలను జియో ట్యాగింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానం పై వెటర్నరీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోడెల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 150 కోట్లతో విశాలమైన గోశాల నిర్మించబోతున్నామని తెలిపారు. రైతులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.