Shuru
Apke Nagar Ki App…
జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంపు జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్య ప్రణవ్,deo రాము,కౌన్సిలర్ ప్రశాంత్ రావు,ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆనంద్ రావు,ప్రసాద్ రావు,అమర్నాథ్ రెడ్డి,విద్యార్థులు,తల్లి దండ్రులు,పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Boga naga bhushanam
జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంపు జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్య ప్రణవ్,deo రాము,కౌన్సిలర్ ప్రశాంత్ రావు,ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆనంద్ రావు,ప్రసాద్ రావు,అమర్నాథ్ రెడ్డి,విద్యార్థులు,తల్లి దండ్రులు,పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- కరీంనగర్లో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ముగిసింది. మే 25, 26 తేదీలలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కళాకారులకు ఉపాధి అవకాశాలు, గుర్తింపు కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.2
- కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.4
- తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. క్వింటాల్కు ₹500 నష్టపోవడంతో పాటు, 12.5 కిలోల తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మోర్తాడ్లో భారీ నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.1
- ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సంచలన కలిసే ప్రతిపాదన చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. "నువ్వు నన్ను కలవకుంటే, నువ్వు వెళ్లాలనుకున్న చోటుకు నేను నిన్ను తీసుకెళ్తాను" అని మోడీ చెప్పినట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తీవ్ర కుదుపు సృష్టించాయి. ఈ సమావేశం జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని 161వ జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ వ్యాన్ బోల్తా పడింది. టైరు పేలడంతో రుశేగావ్ గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ నుండి ప్రత్యేక రైలులో వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సిర్పూర్ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అనంతరం వారు పరేడ్ గ్రౌండ్కు ర్యాలీగా చేరుకున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- తెలంగాణలోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభ 'జై శ్రీరాం' నినాదాలతో హోరెత్తింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగం కాంగ్రెస్, బీఆర్ఎస్ గుండెల్లో రాళ్లు పడేలా చేసిందని అనడంతో కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. తాను ధర్మం కోసం పనిచేసే మోదీ సైనికుడిని అని చెప్పి వారిని మరింత ఆకట్టుకున్నారు.1
- పోలీసుల అదుపులో కరీంనగర్ జ్యువెలరీ షాప్ దొంగలు.. బెంగాల్ లో కొంత గోల్డ్ రికవరీ.. త్వరలో అరెస్టు చూపే అవకాశం రాజకీయంగా దుమారం రేపిన కరీంనగర్ లో పిఎంజే జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అంతరాష్ట్ర బీహార్ కు చెందిన ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ముఠా సభ్యులు ఇద్దరితో పాటు గోల్డ్ కొనుగోలు చేసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత బంగారాన్ని రికవరీ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసుల వేట కొనసాగుతుంది. పోలీసులకు చిక్కకుండా పగడ్బందీ వ్యూహంతో పారిపోయిన దొంగలు, పలుచోట్ల సిసి కెమెరాకు చిక్కడం ధర్మపురిలో బైక్, బుగ్గారం శివారులో మొబైల్ ఫోన్ పడేసి పోవడంతో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లైంది. ప్రధాన నిందితుడు రెండురోజుల కిందట పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు చిక్కగా పీఎంజేలో దోచుకున్న బంగారు ఆభరణాలలో కొంత పశ్చిమబెంగాల్ లో విక్రయించినట్లు నిర్థారించి రికవరీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురి కోసం మూడు రాష్ట్రాల్లో కరీంనగర్ తో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 16 బృందాలుగా విడిపోయి గాలింపు కొనసాగిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జ్యువెల్లరీ షాప్ చోరీ నిందితుల అరెస్టు చూపించే అవకాశం ఉంది.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో ₹9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, పరిశ్రమలు, రైల్వేలు, టెక్స్టైల్ పార్కులు వంటి కీలక రంగాల్లో ఈ పనులు రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇవ్వనున్నాయి. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర ముఖ్యమని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.1