Shuru
Apke Nagar Ki App…
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
Merzaa Tv
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తిరుపతి AITUC రాష్ట్ర మహాసభల విజయానికి ఎమ్మిగనూరులో సమావేశం1
- కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు3
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్గ్రామ్లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.1
- బండి ఆత్మకూరు మండల కేంద్రం కు చెందిన కరీముల్లా (32) అనే యువ వ్యక్తి శనివారం అర్ధరాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి సమీపంలో అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్య తరఫు బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.1
- గద్వాల: తెలంగాణ గడ్డపై ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేయడానికి ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కలకుంట్ల కవిత గారు నూతన పార్టీని ఆవిర్భవిస్తున్నారని పెద్ద ఎత్తున జరిగే ఇట్టి సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని *NHPS జిల్లా చైర్మన్ మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలోని మండల ముఖ్య నాయకులతో కలిసి అయన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... అమరుల ఆశయ సాధన కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అధ్వయ కన్వెన్షన్ నందు నూతన రాజకీయ శక్తిగా రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు జిల్లాలోని ప్రజలు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, మల్దకల్, ధరూర్ మండలాల అధ్యక్షులు విష్ణు, నెట్టెంపాడు గోవిందు, పెంచికలపాడు, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచులు ఆంజనేయులు,కృష్ణ,ఉప సర్పంచ్ గుండన్న,మండల నాయకులు ప్రేమ్ రాజ్,మీసాల కిష్టన్న,మునెప్ప, ఆంజనేయులు,సుభాష్,వీరేష్,చిన్న రాముడు, వెంకటేష్, రాము, సర్వేష్, భూపతి నాయుడు,శివన్న, వాసు,నేతన్న, అమ్రేష్,తిమ్మప్ప,సురేష్, తదితరులు పాల్గొన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా : మదనపల్లె *తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్* అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..1
- అందరికి నమస్కారం 🙏 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ1
- ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.1