Shuru
Apke Nagar Ki App…
రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించిన 'బోర్డ్ ఆఫ్ విజిటర్స్' రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నేతృత్వంలోని 'బోర్డ్ ఆఫ్ విజిటర్స్' బృందం గురువారం సందర్శించింది. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మితో కలిసి జైలులోని వసతులను తనిఖీ చేశారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో నిబంధనల అమలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Alluri DurgaPrasad
రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించిన 'బోర్డ్ ఆఫ్ విజిటర్స్' రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నేతృత్వంలోని 'బోర్డ్ ఆఫ్ విజిటర్స్' బృందం గురువారం సందర్శించింది. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మితో కలిసి జైలులోని వసతులను తనిఖీ చేశారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో నిబంధనల అమలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడిన పెద్దపులిని పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న అనంతరం తొలుత విశాఖ జూకు తరలించి, ఆరోగ్యం కుదుటపడ్డాక దాని సహజసిద్ధ నివాసమైన అడవిలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అప్పటి డ్రోన్ వీడియోను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్కర్లు కొడుతుంది.1
- Post by Srinivas Y1
- 🙏🙏1
- మచిలీపట్నంలో ఆర్టీసీ విలీనంపై గళమెత్తిన కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కార్మిక పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విలీనంపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో జరిగిన కృష్ణా రివిజన్ మహాసభ సమావేశం సందర్భంగా కార్మికులు భారీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం వెంటనే కల్పించాలని గతంలో ఉన్న వైద్య సౌకర్యాలను పునరుద్ధరించాలని లాంటి పలు సమస్యలు కార్మికులకు భరోసా కలిగించే విధంగా స్పష్టమైన విధానాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- *ఉపవాస దీక్షల సమయంలో హలీం శక్తినిస్తుంది* *అఫ్సర్ భాయ్ హలీం స్టాల్ ను ప్రారంభించిన జంపాల సీతారామయ్య* ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19, పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి హలీం శక్తినిస్తుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య. గురువారం నాడు కొండపల్లిలో రంజాన్ స్పెషల్ అప్సర్ భాయ్ హలీమ్ సెంటర్ ను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ప్రారంభించారు. సలీం సెంటర్ ప్రజాదరణ పొందాలని, అప్సర్ వ్యాపారం మంచిగా జరగాలని మిఠాయి తినిపించి ఆకాంక్షించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి హలీం రుచి చూశారు. అప్సర్ జంపాల సీతారామయ్య గారిని, చిట్టిబాబును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- ఖమ్మం:పెనుబల్లి మండల కేంద్రంలో విషాదం... స్నేహితుడి దశదిన కర్మకు వచ్చి వెళ్తుండగా పెనుబల్లి శివారు వైంజంక్షన్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న బర్రె వంశీ(24) కి తలభాగంలో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి. మృతుడు వంశీ సత్తుపల్లి డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహణ తోటి ప్రైవేటు బస్సు డ్రైవర్ రాయల ప్రకాశ్ దశదిశ కార్యక్రమానికి వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వంశీ.. 10రోజుల వ్యవధిలో ఇద్దరు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందటంతో నెలకొన్న విషాదం3
- గుంటూరు మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాల విరామం తర్వాత జరిగిన మెడికల్ ఎగ్జిబిషన్కు 42,951 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తెలిపారు. సుందరాచారి అన్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 22న ముగుస్తుంది.1
- రాజమండ్రి కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నేతృత్వంలోని 'బోర్డ్ ఆఫ్ విజిటర్స్' బృందం గురువారం సందర్శించింది. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మితో కలిసి జైలులోని వసతులను తనిఖీ చేశారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో నిబంధనల అమలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.1