చిన్నారుల మెదడు అభివృద్ధికి పౌష్టికాహారం అత్యవసరం. - ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె. సత్యనారాయణమ్మ, ప్రభావతి పిఠాపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె. సత్యనారాయణమ్మ, ప్రభావతి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో గర్భిణీలు,బాలింతలు మరియు తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల లోపు చిన్నారుల్లో మెదడు అభివృద్ధికి అవసరమైన న్యూట్రిషన్ మరియు ఎర్లీ స్టిములేషన్(ప్రేరణాత్మక పద్ధతులు)గురించి వివరించారు. జంక్ ఫుడ్ వద్దు పోషకాహారం ముద్దు అనే నినాదంతో చిన్నారులకు ప్యాకేజ్డ్ ఫుడ్స్,జంక్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, స్థానికంగా లభ్యమయ్యే ఆకుకూరలు,పండ్లు,పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ కరపత్రాల ద్వారా ప్రజలకు ఆరోగ్యం మరియు పోషణ పై సందేశాలను అందించారు. పిల్లల భవిష్యత్తు వారి చిన్నతనంలో తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని,గర్భిణీలు,బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ స్టాఫ్,అంగన్వాడీ కార్యకర్తలు మరియు గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు.
చిన్నారుల మెదడు అభివృద్ధికి పౌష్టికాహారం అత్యవసరం. - ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె. సత్యనారాయణమ్మ, ప్రభావతి పిఠాపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు కె. సత్యనారాయణమ్మ, ప్రభావతి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో గర్భిణీలు,బాలింతలు మరియు తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల లోపు చిన్నారుల్లో మెదడు అభివృద్ధికి అవసరమైన న్యూట్రిషన్ మరియు ఎర్లీ స్టిములేషన్(ప్రేరణాత్మక పద్ధతులు)గురించి వివరించారు. జంక్
ఫుడ్ వద్దు పోషకాహారం ముద్దు అనే నినాదంతో చిన్నారులకు ప్యాకేజ్డ్ ఫుడ్స్,జంక్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, స్థానికంగా లభ్యమయ్యే ఆకుకూరలు,పండ్లు,పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ కరపత్రాల ద్వారా ప్రజలకు ఆరోగ్యం మరియు పోషణ పై సందేశాలను అందించారు. పిల్లల భవిష్యత్తు వారి చిన్నతనంలో తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని,గర్భిణీలు,బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ స్టాఫ్,అంగన్వాడీ కార్యకర్తలు మరియు గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు.
- పిఠాపురం: పిఠాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి, పారిశుధ్య పనుల పురోగతిని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ సుందరీకరణతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. పట్టణంలోని ప్రధాన రహదారులు,కాలనీల్లో పారిశుధ్య పరిస్థితులను పీడీ స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీ వ్యవస్థలు,నిత్యం జరిగే చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించి ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాధవపురం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ను సందర్శించిన పీడీ వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టిడ్కో నివాస సముదాయాలను సందర్శించి,అక్కడ లబ్ధిదారులకు అందుతున్న తాగునీరు,విద్యుత్ వంటి ప్రాథమిక వసతులపై సమీక్ష నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా తక్షణమే మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు,మరియు శానిటేషన్ సిబ్బంది ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.3
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *"స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర"* కార్యక్రమంలో భాగంగా ఈరోజు (శనివారం) కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ ల నందు ఆయా స్టేషన్ సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కేంద్రమైన కాకినాడలో జిల్లా ఎంఎం*ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్, ఐపీఎస్* ఏ ఆర్ క్వార్టర్స్ ప్రాంతంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, మొక్కను నాటి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సిబ్బంది మరియు అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి శ్రమ దానం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ S. శ్రీనివాసరావు, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, డిఎస్పీ (ఏ ఆర్) శ్రీ వి జి శ్రీహరి రావు, MT రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె వెంకటరావు, కంపెనీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్ నరసింహ మూర్తి, కాకినాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం అప్పలనాయుడు, పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీ పి సునీల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. @జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ.1
- పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఇట్స్ మై ఎడిటింగ్ వీడియో1
- UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.2
- చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త #WomenReservationBill #YSRCPForWomen1
- छुट्टियों पर लगा महंगाई का ग्रहण, पश्चिम एशिया संकट से विमानन क्षेत्र को ₹18000 करोड़ का नुकसान क्या आप गर्मियों की छुट्टियां मनाने विदेश जाने की सोच रहे हैं? या हाल ही में आपने हवाई टिकट बुक करते समय अचानक बढ़े हुए किरायों पर गौर किया है? इसकी वजह सिर्फ घरेलू महंगाई नहीं है, बल्कि आपके शहर से हजारों किलोमीटर दूर चल रहा पश्चिम एशिया का तनाव है। इस अंतरराष्ट्रीय भू-राजनीतिक संकट ने न सिर्फ वैश्विक व्यापार को प्रभावित किया है, बल्कि भारतीय विमानन और पर्यटन क्षेत्र को भी सीधे तौर पर लगभग 18,000 करोड़ रुपये का भारी नुकसान पहुंचाया है। पश्चिम एशिया के तनाव से भारतीय एविएशन को कितना और कैसे नुकसान हुआ है? जवाब: पीएचडी चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री (पीएचडीसीसीआई) की एक ताजा रिपोर्ट के मुताबिक, इस संकट से भारत के एविएशन सेक्टर को करीब ₹18,000 करोड़ का नुकसान उठाना पड़ा है। दरअसल, पश्चिम एशिया के प्रमुख हवाई रास्ते (कॉरिडोर) दुनिया के सबसे व्यस्त मार्गों में से एक हैं, लेकिन युद्ध के कारण वहां उड़ान भरना सुरक्षित नहीं रह गया है। इसके चलते एयरलाइंस को उड़ानें रद्द करनी पड़ रही हैं या अपना रास्ता बदलना पड़ रहा है, जिससे उड़ान के समय में 2 से 4 घंटे तक की बढ़ोतरी हुई है।1
- Post by Shyam1
- పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1