Shuru
Apke Nagar Ki App…
ప్రతి విద్యార్థి విజయమే లక్ష్యం: ఎక్స్సెలెన్షియ ప్రిన్సిపాల్ ఎక్స్సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
Telangana news
ప్రతి విద్యార్థి విజయమే లక్ష్యం: ఎక్స్సెలెన్షియ ప్రిన్సిపాల్ ఎక్స్సెలెన్షియా విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాయని, కేవలం టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ఆమె శుక్రవారం శామీర్పేట్ లోని విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదని, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Hyderabad Traffic Police #HyderabadTrafficPolice #CPRAwareness #SaveLives #RoadSafety #HyderabadNews #TrafficAwareness #HumanityFirst #EmergencyCare #HeartAttackHelp #PublicSafety #HyderabadPolice #LifeSavingSkills #CPRTraining #SafetyFirst #IndiaNews1
- తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిగాచి బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం బైఠాయించారు. పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ ను కలిసి అవకాశం ఇచ్చేవరకు ఇక్కడే బయట ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో కొందరు బాధితులను కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించారు.1
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి *బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి.... *మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ* ... *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి* *యందు బడిబాట* *కార్యక్రమాన్ని నిర్వహించారు*. *ఈ కార్యక్రమానికి* *ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ గారు హాజరయ్యారు*ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా విద్యాధికారిని విజయ మాట్లాడుతూ* ..బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని*, *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సకల వసతులు ఉన్నాయని , పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో లభిస్తుందని, ఇది గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం అని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారుప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు, యువత గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని* మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మన విద్యార్థులను చదివించాలని ఆమె గ్రామస్తుల ఉద్దేశించి అన్నారుమరియు ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ మాట్లాడుతూ* *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని*, *ప్రభుత్వము కల్పించిన ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు*. *చాలామంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారని వారికి సులభముగా చదువుకోడానికి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబులు , కరాటే , యోగా మరియు సందర్శన ప్రదేశాలకు తీసుకపోవడంముఖ్యమైనటువంటి విషయాల పైన ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇవన్నీ అవకాశాలు సద్వినియోగం చేసుకొని గ్రామీణ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు*.*అనంతరం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడిబాటకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు*. ఈ కార్యక్రమంలో జిల్లా CMO అధికారి. రాజు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ,. శశి కుమార్, ఎల్లం, రాజు, సంతోషి కుమారి, కృష్ణవేణి, విమల, గంగమణి, స్వప్న రాజేందర్ రెడ్డి, చక్రపాణి శశి కుమార్ రెడ్డి, సందీప్ కృష్ణ , త్యార్ల శ్రీనివాస్, మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు1
- వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారపాలి పట్టణంలో శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో కార్యక్రమంలో భాగంగా మలక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు ప్రమాద భద్రత అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి Ekdin డిజిపి స్వాతిలక్ర,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆమె తెలిపారు.1
- కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి రోడ్లో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో చీకటి కారణంగా ప్రమాదాల భయం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి సెంట్రల్ లైటింగ్ బల్బులు అమర్చాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.1
- కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ నేడు 19వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాలువల పరిస్థితి, చెత్త సేకరణ, నీటి నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. డ్రైనేజీ నిల్వలు, చెత్త తొలగింపులో ఉన్న లోపాలపై అధికారులను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలని కాలనీవాసులను మున్సిపల్ అధికారులు సూచించారు.1
- Hyderabad Traffic Police Ka Insaniyat Bhara Kadam: Auto Drivers Ke Liye Free Eye Test Camp Ne Jeeta Sabka Dil #HyderabadTrafficPolice #ChikkadpallyPolice #Insaniyat #EyeTestCamp #AutoDrivers #RoadSafety #PublicSafety #HealthAwareness #PoliceInitiative #InspiringStep #SafetyFirst #HyderabadNews #24NewsHaqKiAwaaz1
- సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈనెల 20వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా ఆద్య శిలా స్థాపనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి వెల్లడించారు. శనివారం ఆశ్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటలకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు శిలలపై బీజాక్షరాలు భక్తులతో వ్రాయించే కార్యక్రమం జరుగుతుందన్నారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మా ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఆలయ పూజారులు అమ్మవారికి మంజీరా నది జలాలతో అభిషేకంపట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు కుంకుమార్చన సహస్రనామార్చన పుష్పార్చన నిమ్మకాయల హారంతో ప్రత్యేక పూజలు అనంతరం మంగళహారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగించారు.ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించారుకోరికలుతీరినభక్తులు అమ్మవారికి కొంతమంది బోనాలు సమర్పించగా మరి కొంతమంది ఓడిబియాలను సమర్పించారు మరి కొంతమంది తలనీలాలు సమర్పించారు.1