logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

18 hrs ago
user_Bondhu Suresh
Bondhu Suresh
Atmakur, Spsr Nellore•
18 hrs ago
26f39773-2dea-48c4-b7ea-459ecfceca19

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు: రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ లో రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు.. రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహని కారణం అంటున్నారు. తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ ఉపక్రమించిన విషయం తెలిసిన రెండు వర్గం అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ వర్గీయులు విషయం తెలుసుకుని డీసీసీబీ చైర్మన్జాగ్రత్త పడ్డారు.ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసినదే..! పనుల ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరికీ ప్రోటోకాల్ లేని టీడీపీ నేతల రచ్చ ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాటలు..
    2
    బద్వేలు: రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ లో రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు..
రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్  సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహని కారణం అంటున్నారు. తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి  డీసీసీబీ చైర్మన్ ఉపక్రమించిన విషయం తెలిసిన రెండు వర్గం అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ వర్గీయులు
విషయం తెలుసుకుని  డీసీసీబీ చైర్మన్జాగ్రత్త పడ్డారు.ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం అందరికీ తెలిసినదే..!
పనుల ప్రారంభోత్సవానికి ఏ  ఒక్కరికీ ప్రోటోకాల్  లేని టీడీపీ నేతల రచ్చ
ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాటలు..
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    46 min ago
  • ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి ఈ tidko apartments పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు గాలికి వదిలేసిన గవర్నమెంట్.
    1
    ఏ పరిధిలో ఉందొ కూడా తెలియని పరిస్థితి  ఈ tidko apartments  పంచాయితీ పట్టించుకోదు మునిసపాలిటీ అవసరము లేదు. ఒక పని మీద gandhi నగర్ సచివాలయం కి  వెళ్లిన అది మా లిమిట్స్ కాదు అని అంటున్నారు రాత్రి అయితే బయటకు రావాలి అంటే భయపడుతున్న ప్రజలు  కారణం పాములు తెల్లు శుభ్రం చేసే వాళ్ళు కరువు అయ్యారు కనీసం రోడ్లు అయినా చిమ్మడం లేదు పట్టించుకోని అధికారులు  గాలికి వదిలేసిన గవర్నమెంట్.
    user_PR
    PR
    Gudur, Tirupati•
    7 hrs ago
  • సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.
    1
    సింగరాయకొండ హైవేపై మంగళవారం కారు-ట్రాక్టర్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ రెండూ బోల్తా పడ్డాయి. వైజాగ్ నుంచి తిరుమల వెళ్తున్న ఆ కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా వారిలో రేవతి, వివేక్, సంతోశ్, రాజేశ్, యశోదలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కారులోని ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు, నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress Party - YSRCP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు  వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు  కాటసాని రాంభూపాల్ రెడ్డి  గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్  పెద్దిరెడ్డి
రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని తెలిపారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు.
ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు,  నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress  Party - YSRCP  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    1
    👉 “💼 Work From Home Opportunity |  Income 💰
📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
  • కృష్ణ జిల్లా మచిలీపట్నం :- తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులు: 1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ 2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ 3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
    1
    కృష్ణ జిల్లా మచిలీపట్నం :- 
తీసుకున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న మరో బాలుడిని సురక్షితంగా రక్షించి, రూ. 80,500 నగదును సీజ్ చేశారు.
జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడి, అభం శుభం తెలియని చిన్నారులను ఎరగా చేసుకుని, తల్లుల నుండి వేరుచేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు.
ఈ నెల 17న నమోదైన కేసులో ఇప్పటికే 10 నెలల బాలుడిని రక్షించి, కొనుగోలు చేసిన ఇద్దరితో పాటు ఒక ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ ఆధారంగా ప్రధాన నిందితులైన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టైన నిందితులు:
1. గంటా మేరీ (26), రాజరాజేశ్వరి పేట, విజయవాడ
2. పిడమర్తి కనకమ్మ (23), కొత్త రాజరాజేశ్వరి పేట, విజయవాడ
3. గండికోట గురమ్మ (30), అయ్యప్ప నగర్, విజయవాడ
వీరు ప్రధానంగా బిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో అపహరించి, ఇతరులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    23 hrs ago
  • నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు
    1
    నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.