లేబర్ కొడ్స్ అమలు నిరసిస్తూ ఎల్ఐసి ఉద్యోగులు నిరసన.ఎల్ఐసి ఉద్యోగుల సంఘము ప్రధాన కార్యదర్శి వి. రవికుమార్. లేబర్ కోడ్స్ అమలు నిరసిస్తూ ఎల్ఐసి ఉద్యోగుల నిరసన. లేబర్ కోడ్స్ పై పోరాటం ఆగదు. -- ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వి రవికుమార్ ఆత్మకూరు ఏప్రిల్ 01,నంద్యాల జిల్లా ఏప్రిల్ 1 నుండి లేబర్ కోడ్స్ అమలు దేశంలో ప్రారంభమైనా వాటికి వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆత్మకూరు బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ స్పష్టం చేశారు. కార్మిక సంఘాల బ్లాక్ డే లో భాగంగా అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఎఐఐఇఎ) దేశవాప్త పిలుపుమేరకు ఈరోజు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం ఎదుట బ్రాంచ్ అధ్యక్షులు పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ... లేబర్ కోడ్స్ అమలైతే 300 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే-ఆఫ్, రిట్రెంచ్మెంట్ చేయవచ్చని అన్నారు. సమ్మెకు 60 రోజుల ముందు నోటీసు తప్పనిసరి కావడం వల్ల నిరసన హక్కు కఠినమవుతుందని అన్నారు. చర్చల సమయంలో సమ్మె చేయకూడదని అన్నారు. రోజుకు 12 గంటల పనితో శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. ఫిక్సడ్-టర్మ్ ఉపాధికి ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల శాశ్వత ఉద్యోగాలు తగ్గి ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని అన్నారు. 51% సభ్యత్వం లేని చిన్న యూనియన్లకు కార్మికుల సమస్యలు ప్రాతినిధ్యం చేయడం సాధ్యం కాదులే అన్నారు. మొత్తంగా కార్మికుల హక్కులు బలహీనపడతాయని, యజమానులకు కొమ్ములు వస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగన్న, ప్రవీణ్ ,దేవన్న, చంద్రశేఖర్, జెబి బుల్ల, అమీర్ , సుమంత్ , సురేష్, పరమేశ్వర్ రెడ్డి, ఇస్మాయిల్,లియాఫీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కొడ్స్ అమలు నిరసిస్తూ ఎల్ఐసి ఉద్యోగులు నిరసన.ఎల్ఐసి ఉద్యోగుల సంఘము ప్రధాన కార్యదర్శి వి. రవికుమార్. లేబర్ కోడ్స్ అమలు నిరసిస్తూ ఎల్ఐసి ఉద్యోగుల నిరసన. లేబర్ కోడ్స్ పై పోరాటం ఆగదు. -- ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వి రవికుమార్ ఆత్మకూరు ఏప్రిల్ 01,నంద్యాల జిల్లా ఏప్రిల్ 1 నుండి లేబర్ కోడ్స్ అమలు దేశంలో ప్రారంభమైనా వాటికి వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆత్మకూరు బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ స్పష్టం చేశారు. కార్మిక సంఘాల బ్లాక్ డే లో భాగంగా అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఎఐఐఇఎ) దేశవాప్త పిలుపుమేరకు ఈరోజు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం ఎదుట బ్రాంచ్ అధ్యక్షులు పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ... లేబర్ కోడ్స్ అమలైతే 300 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా లే-ఆఫ్, రిట్రెంచ్మెంట్ చేయవచ్చని అన్నారు. సమ్మెకు 60 రోజుల ముందు నోటీసు తప్పనిసరి కావడం వల్ల నిరసన హక్కు కఠినమవుతుందని అన్నారు. చర్చల సమయంలో సమ్మె చేయకూడదని అన్నారు. రోజుకు 12 గంటల పనితో శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. ఫిక్సడ్-టర్మ్ ఉపాధికి ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల శాశ్వత ఉద్యోగాలు తగ్గి ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని అన్నారు. 51% సభ్యత్వం లేని చిన్న యూనియన్లకు కార్మికుల సమస్యలు ప్రాతినిధ్యం చేయడం సాధ్యం కాదులే అన్నారు. మొత్తంగా కార్మికుల హక్కులు బలహీనపడతాయని, యజమానులకు కొమ్ములు వస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పోరాడతామని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగన్న, ప్రవీణ్ ,దేవన్న, చంద్రశేఖర్, జెబి బుల్ల, అమీర్ , సుమంత్ , సురేష్, పరమేశ్వర్ రెడ్డి, ఇస్మాయిల్,లియాఫీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
- Post by PSPK Shiva Jsp1
- तेलंगाना: माता-पिता की सेवा नहीं की तो वेतन से कटेंगे 10 हजार रुपये, विधानसभा में विधेयक पारित तेलंगाना विधानसभा ने रविवार को 'तेलंगाना कर्मचारी की जवाबदेही और माता-पिता के भरण-पोषण की निगरानी विधेयक, 2026' को सर्वसम्मति से पारित कर दिया। इसमें उन कर्मचारियों के कुल वेतन से 15 प्रतिशत या 10,000 रुपये (जो भी कम हो) तक की कटौती का प्रविधान है, जो अपने माता-पिता की उपेक्षा करते पाए जाएंगे। काटी गई राशि सीधे उनके माता-पिता को दी जाएगी। इसके दायरे में केवल सरकारी कर्मचारी ही नहीं, बल्कि निजी क्षेत्र के कर्मचारी और विधायक, एमएलसी, कारपोरेटर, पार्षद एवं सरपंच जैसे जनप्रतिनिधि भी शामिल हैं। माता-पिता के भरण-पोषण के लिए निगरानी विधेयक प्रदेश के एससी-एसटी कल्याण एवं वरिष्ठ नागरिक मंत्री अड्लूरी लक्ष्मण कुमार ने इसे पेश किया। सभी दलों ने इसका समर्थन किया और इसे ध्वनिमत से पारित कर दिया। विधेयक के उद्देश्यों और कारणों के विवरण में प्रदेश सरकार ने कहा कि बुजुर्ग माता-पिता की उपेक्षा की घटनाएं बढ़ रही हैं, लिहाजा बदलते सामाजिक-आर्थिक परिवेश में पारिवारिक जिम्मेदारियों को मजबूत करने के लिए ऐसे उपायों की आवश्यकता है जिन्हें सख्ती से लागू किया जा सके।1
- ఎమ్మిగనూరులో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నారన్న వదంతులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఖండించారు. విలీనం అన్నది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. మార్కెటింగ్ మర్జర్ను విలీనం అంటూ వైకాపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చేనేత కార్మికుల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.1
- రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.1
- కేశంపేట మండల కేంద్రంలో పేటీఎం పేరుతో వ్యాపారులను మోసం చేసే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని నకిలీ స్క్రీన్షాట్లు చూపించి నగదు తీసుకుని పరారవుతున్నారు. ఇటీవల ఓ జిరాక్స్ షాపులో రూ.16 వేల మోసం చోటుచేసుకుంది. మొదట డబ్బులు పంపినట్టు నమ్మబలికి నగదు తీసుకుని పారిపోయారు. బాధితుడు వెంబడించగా కొంత మొత్తం ఇచ్చి మళ్లీ తప్పించుకున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచితులను నమ్మవద్దని, నగదు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.2
- ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.2
- నకిరేకల్ మునిసిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ 21వ రోజు మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాకు అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యం వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో పనిచేసే దడువాయుల జీవనోపాధి కష్టాల్లో ఉందని, వారికి తక్షణమే పని కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.3
- ఎమ్మిగనూరులో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 25వ వార్డు ఎస్.ఎం.టి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం సహా పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.1