లలిత కళా సమితి 50 వసంతాల వేడుకలకు ఆహ్వానం.. మెట్ పల్లి పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ సమీపంలోని చావిడి చౌరస్తాలో ఈ నెల 14న శనివారం లలిత కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే 50 వసంతాల ముగింపు వేడుకలను విజయవంతం చేయాలని సమితి నాయకులు కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, కరపత్రాలను సమితి అధ్యక్షులు గోదూరు మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టెల గంగాధర్ విడుదల చేశారు.జగిత్యాల జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య కన్వీనర్, మాజీ ఎంపీపీ కోటగిరి వెంకటస్వామి మాట్లాడుతూ పల్లె సంస్కృతిని ప్రతిబింబించే జానపద, సాంస్కృతిక కళారూపాలను ఒకే వేదికపై ప్రదర్శించే కళాజాతరగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా డప్పు దరువులు, కోలాటాలు, ఒగ్గుడోలు, గుస్సాడి నృత్యాలు, చిందు యక్షగానం, వీధి నాటకాలు, హరికథ, బుర్రకథ వంటి కళారూపాలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి చైతన్య, అందె మారుతి బాపూజీ, నంబి రాజేందర్ శర్మ, బండి రవి, మర్రి భాస్కర్, తుమ్మనపల్లి రాజు, శేఖర్, నవీన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
లలిత కళా సమితి 50 వసంతాల వేడుకలకు ఆహ్వానం.. మెట్ పల్లి పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ సమీపంలోని చావిడి చౌరస్తాలో ఈ నెల 14న శనివారం లలిత కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే 50 వసంతాల ముగింపు వేడుకలను విజయవంతం చేయాలని సమితి నాయకులు కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, కరపత్రాలను సమితి అధ్యక్షులు గోదూరు మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టెల గంగాధర్ విడుదల చేశారు.జగిత్యాల జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య కన్వీనర్, మాజీ ఎంపీపీ కోటగిరి వెంకటస్వామి మాట్లాడుతూ పల్లె సంస్కృతిని ప్రతిబింబించే జానపద, సాంస్కృతిక కళారూపాలను ఒకే వేదికపై ప్రదర్శించే కళాజాతరగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా డప్పు దరువులు, కోలాటాలు, ఒగ్గుడోలు, గుస్సాడి నృత్యాలు, చిందు యక్షగానం, వీధి నాటకాలు, హరికథ, బుర్రకథ వంటి కళారూపాలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి చైతన్య, అందె మారుతి బాపూజీ, నంబి రాజేందర్ శర్మ, బండి రవి, మర్రి భాస్కర్, తుమ్మనపల్లి రాజు, శేఖర్, నవీన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి. మార్చి15 న హనుమకొండ, వరంగల్ పట్టణంలో నిర్వహించబోయే హమాలీ మహా గర్జనను విజయవంతం చేయాలని హమాలీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. అట్టి హమాలి మహాగర్జన సభకు హమాలి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.1
- तेलंगाना में दर्दनाक हादसा, करंट लगने से दो लोग जिंदा जले; सामने आया VIDEO मंचेरियाल: तेलंगाना के मंचेरियाल जिले से एक दर्दनाक हादसा सामने आया है। यहां इलेक्ट्रिक शॉक लगने की वजह से दो युवकों की मौत हो गई। जानकारी के मुताबिक दोनों युवक एक पेट्रोल पंप के पास मौजूद थे। इस दौरान यहां एक लोहे का खंभा बिजली की मेन लाइन की तार से टकरा गए। लोहे के खंभे से सटने की वजह से इलेक्ट्रिक शॉक लग गया और दोनों युवक मौके पर ही जल गए। आग में जलने की वजह से युवकों की मौत हो गई। घटना का वीडियो भी सामने आया है, जो सोशल मीडिया पर वायरल हो रहा है।1
- నెరడిగొండ : మండలంలోని తేజాపూర్ గ్రామంలో జరుగుతున్న వేదాంత విజ్ఞాన మహా సభలు,సాధు సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా శివానంద భారతి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం చేస్తామని కోరుకొని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని మొట్టమొదటగా కలిసి తెలియజేయగానే ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి ఈయొక్క సమ్మేళనానికి అండగా నిలిచారని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని ఘనంగా సన్మానించి అభినందన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. శివానంద స్వామి కలిసి సాకారం అందించాలని కోరారు. కానీ నా సాకారం కాదు దేవుడి ఆశీర్వాదంతోనే మీతో ఒకడిగా మీలో ఒకడిగా ఉంటానన్నారు. ఋషులు ఎన్నో తపస్సులు చేసి ధర్మాన్ని కాపాడుతున్నారని వారి మార్గదర్శనమీ మనకు నిదర్శనమని మనం ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో మహిళా సమాఖ్య భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కళ్యాణి గ్రామ మహిళా సోదరిమణులందరూ మహిళా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి గ్రామ సర్పంచ్ గారు, గ్రామ మహిళలు, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు మరియు గ్రామ అధ్యక్షులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళల అభివృద్ధి కోసం మహిళా సమాఖ్య భవనం ఏర్పాటు చేసినందుకు గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ అన్న గారికి మహిళలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో శ్రీశ్రీశ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి బంజారా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదే నని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా కుల పెద్దలు, బంజారా మహిళలు, బంజారా యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.2
- సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ భక్తుల ఆరాధ్య దైవం ఎద్దు గుట్ట మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ మల్లన్న స్వామి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషకరమైన జీవితం గడపాలని పాడిపంటలు వ్యాపార మొదలగు రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆ మల్లన్న స్వామిని కోరానని అన్నారు. అనంతరం స్వామి వారి నాగవల్లి పట్నం ను వీక్షించి అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించారు.1