Shuru
Apke Nagar Ki App…
నెల్లూరులోని ఏసీ నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిరం నమూనా ఎగ్జిబిషన్లో శ్రియ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ స్టాల్ ప్రారంభమైంది. కన్నడ నటి ప్రియా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరై, స్పాట్ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు బంగారు కాయిన్ బహుమతులు అందిస్తామని ప్రకటించారు. నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
SRIHARI POONDLA
నెల్లూరులోని ఏసీ నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిరం నమూనా ఎగ్జిబిషన్లో శ్రియ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ స్టాల్ ప్రారంభమైంది. కన్నడ నటి ప్రియా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరై, స్పాట్ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు బంగారు కాయిన్ బహుమతులు అందిస్తామని ప్రకటించారు. నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- ప్రజల మధ్యకి వెళ్లి ఫిర్యాదులను స్వీకరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ చేసిన ఈ పనికి మెచ్చుకుంటున్న ఫిర్యాదుదారులు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను వేడుకున్న ఫిర్యాదుదారులు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి, బాధితులను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.1
- సత్తనపల్లిలో చోరీ... నిందితులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి లో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులు అదుపులోకి – రూ.1.33 లక్షల బంగారం, బైక్ స్వాధీనం సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన ఉదయం సత్తెనపల్లి పట్టణంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు తాళిబొట్టును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 13.88 గ్రాముల వెండి ఆభరణాలు, అంచనా విలువ రూ.1,33,000 నగలు, అలాగే AP 07 BA 2113 నంబర్ గల హీరో స్పెండర్ ప్లస్ మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఉపయోగించిన ఇతర వస్తువులను కూడా పోలీసులు జప్తు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ఎం. పవన్ కుమార్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఏ.వి. ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్ కే. రాజు కీలక పాత్ర పోషించారు. వారి సేవలను సర్కిల్ ఇన్స్పెక్టర్ అభినందించారు.1
- కాగ్ నివేదికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒకే ఏడాదిలో రాష్ట్ర ఆదాయం రూ.50 వేల కోట్లు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.20 వేల కోట్లు తగ్గిందని కాగ్ వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అసమర్థతకు ఇది నిదర్శనమని వైసీపీ ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు.1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1
- సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో తమ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు హాజరయ్యారు. తమ విజ్ఞాపనలను కలెక్టర్కు నేరుగా అందజేసి సమస్యలను పరిష్కరించవలసిందిగా వారు కోరారు1