logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_Bondhu Suresh
Bondhu Suresh
Atmakur, Spsr Nellore•
2 hrs ago

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    2 hrs ago
  • పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూటిడిపి కూటమినేతల సంబరాలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు మేరకు విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. "అమరావతి మన రాజధాని - అమరావతి మన భవిష్యత్తు" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో విడవలూరు గ్రామ వీధులు మార్మోగాయి. ​ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, కేంద్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి మన రాష్ట్ర శాశ్వత రాజధాని అని, దీని అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదని వారు ధీమా వ్యక్తం చేశారు. ​ఈ భారీ ర్యాలీలో విడవలూరు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు. ​
    4
    పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూటిడిపి కూటమినేతల సంబరాలు
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  పిలుపు మేరకు విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. "అమరావతి మన రాజధాని - అమరావతి మన భవిష్యత్తు" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో విడవలూరు గ్రామ వీధులు మార్మోగాయి.
​ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, కేంద్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి మన రాష్ట్ర శాశ్వత రాజధాని అని, దీని అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదని వారు ధీమా వ్యక్తం చేశారు.
​ఈ భారీ ర్యాలీలో విడవలూరు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
​
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • *భారతీయ జనతా పార్టీ స్టోన్ హౌస్ పేట మండలం (6,7,8,9,10 డివిజన్లు) లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా " మన ఊరు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం.* ఈ రోజు తేదీ సోమవారం 06-04-2026 ఉదయం 10:30 గంటలకు నెల్లూరు నగరం, స్టోన్ హౌస్ పేట మండలం 9వ డివిజన్ నవాబుపేట ఏరియా (opp)HP పెట్రోల్ బంక్ నందు మరియు 7వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు పిండి మిల్లు సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమాలకి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గౌరవనీయులు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు విచ్చేసి పార్టీ జెండాలు ఎగరవేయడం జరిగింది. వారు మాట్లాడుతూ 1980లో పార్టీ ప్రారంభమై ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరిగింది. మరియు మూడుసార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నాము , ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు , కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షులు కోసూరు వెంకట సుధీర్, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా మోర్చా కోస్తాంధ్ర ఇంచార్జ్ లక్ష్మీ ప్రియ, బిజెపి జిల్లా కార్యదర్శి మేడేపల్లి రత్నం నాయుడు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు లాల్ కాజా మస్తాన్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వి. హర్షవర్ధన్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాటక రాని జయచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు నీలి శెట్టి కోటేశ్వరరావు, ఎర్రమల్లి హరికృష్ణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కారుణ్య, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ పొట్టి శివ శంకర్, స్టోన్ హౌస్ పేట మండల ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి వెంకట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు ఉచ్చూరు ముని మోహన్, చీమలదిన్నె లక్ష్మయ్య, జూలుగంటి మణికంఠేశ్వరరావు, కార్యదర్శులు ఓంకారం వెంకటేశ్వర్లు, భీమవరపు చిన్న రాఘవేంద్ర, నారపనేని శివ, మంచి కలపాటి నవీన్, కోశాధికారి మెంటా జ్ఞానేశ్వర్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి భీమవరపు వినయ్, మండల యువ మోర్చా అధ్యక్షుడు లక్కాకుల నరేష్, మండల మహిళా మోర్చా అధ్యక్షులు అశ్విని , మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు మందా రవి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బి రామయ్య, మండల గిరిజన మోర్చా అధ్యక్షులు కుప్పచర్ల మణి, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే ఖాదర్ మస్తాన్ , మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి గుర్రం హర్ష, మండల యువ మోర్చా కార్యదర్శి దినేష్,మండల యువమోర్చా కార్యదర్శి పాదర్తి సాయి,బిజెపి సీనియర్ నాయకులు ఎర్ర శ్రీనివాసులు, నర్సాపురం సుబ్రమణ్యం, తిరుమల శెట్టి రవి,మండల కార్యవర్గ సభ్యులు గుబ్బ శ్రీను, బిజెపి నాయకులు సురేష్ ,రాంబాబు, సాయి, వాడపర్తి ప్రవీణ్, వాసు, అభిమానులు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
    3
    *భారతీయ జనతా పార్టీ స్టోన్ హౌస్ పేట మండలం (6,7,8,9,10 డివిజన్లు) లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా " మన ఊరు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం.*
ఈ రోజు తేదీ సోమవారం 06-04-2026 ఉదయం 10:30 గంటలకు నెల్లూరు నగరం, స్టోన్ హౌస్ పేట మండలం 9వ డివిజన్ నవాబుపేట ఏరియా (opp)HP పెట్రోల్ బంక్ నందు మరియు 7వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు పిండి మిల్లు సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమాలకి  ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గౌరవనీయులు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు విచ్చేసి పార్టీ జెండాలు ఎగరవేయడం జరిగింది. వారు మాట్లాడుతూ 1980లో పార్టీ ప్రారంభమై ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరిగింది. మరియు మూడుసార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నాము , ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు , కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షులు కోసూరు వెంకట సుధీర్, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా మోర్చా కోస్తాంధ్ర ఇంచార్జ్ లక్ష్మీ ప్రియ, బిజెపి జిల్లా కార్యదర్శి మేడేపల్లి రత్నం నాయుడు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు లాల్ కాజా మస్తాన్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వి. హర్షవర్ధన్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాటక రాని జయచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు నీలి శెట్టి కోటేశ్వరరావు, ఎర్రమల్లి హరికృష్ణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కారుణ్య, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ పొట్టి శివ శంకర్, స్టోన్ హౌస్ పేట మండల ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి వెంకట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు ఉచ్చూరు ముని మోహన్, చీమలదిన్నె లక్ష్మయ్య, జూలుగంటి మణికంఠేశ్వరరావు, కార్యదర్శులు ఓంకారం వెంకటేశ్వర్లు, భీమవరపు చిన్న రాఘవేంద్ర, నారపనేని శివ, మంచి కలపాటి నవీన్, కోశాధికారి మెంటా జ్ఞానేశ్వర్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి భీమవరపు వినయ్, మండల యువ మోర్చా అధ్యక్షుడు లక్కాకుల నరేష్, మండల మహిళా మోర్చా అధ్యక్షులు అశ్విని , మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు మందా రవి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బి రామయ్య, మండల గిరిజన మోర్చా అధ్యక్షులు కుప్పచర్ల మణి, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే ఖాదర్ మస్తాన్ , మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి గుర్రం హర్ష, మండల యువ మోర్చా కార్యదర్శి దినేష్,మండల యువమోర్చా కార్యదర్శి పాదర్తి సాయి,బిజెపి సీనియర్ నాయకులు ఎర్ర శ్రీనివాసులు, నర్సాపురం సుబ్రమణ్యం, తిరుమల శెట్టి రవి,మండల కార్యవర్గ సభ్యులు గుబ్బ శ్రీను, బిజెపి నాయకులు సురేష్ ,రాంబాబు, సాయి, వాడపర్తి ప్రవీణ్, వాసు, అభిమానులు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బద్వేలు:బద్వేలుకు చెందిన టిడిపి, జనసేన నేతలు కళ్యాణం మండపం ముందు బాగాన ఉన్న ఇండ్లలోకి చొరబడి వేట కొడవళ్ళు మారనాయుధాలతో దాడి చేశారు. కోర్టులో వివాదంలో ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు కూటమినేతలు మూకుమ్మడి దాడి చేసినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలు కావడంతో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కడపకు చెందిన సుమారు 30 మంది మద్యం మత్తులో దాడి చేసినట్లు తెలిపారు. ఇండ్లతోపాటు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేశారు.గతంలో రెండుసార్లు దాడి జరిగినా ఫిర్యాదు చేసిన కనీసం కేసు కూడా నమోదు చేయలేదంటున్న బాధితులు తెలిపారు.అధికార పార్టీ అండతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటన్న బాధితులు వాపోతున్నారు.
    1
    బద్వేలు:బద్వేలుకు చెందిన టిడిపి, జనసేన నేతలు కళ్యాణం మండపం ముందు బాగాన ఉన్న ఇండ్లలోకి చొరబడి వేట కొడవళ్ళు మారనాయుధాలతో దాడి చేశారు.
కోర్టులో వివాదంలో ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు కూటమినేతలు మూకుమ్మడి దాడి చేసినట్లు తెలుస్తోంది.
పలువురికి గాయాలు కావడంతో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 
కడపకు చెందిన సుమారు 30 మంది మద్యం మత్తులో దాడి చేసినట్లు తెలిపారు.
ఇండ్లతోపాటు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేశారు.గతంలో రెండుసార్లు దాడి జరిగినా ఫిర్యాదు చేసిన కనీసం కేసు కూడా నమోదు చేయలేదంటున్న బాధితులు తెలిపారు.అధికార పార్టీ అండతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటన్న బాధితులు వాపోతున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అలంకానుపల్లి కి చెందిన పెద్ద దస్తగిరి హత్య పై సిట్ దర్యాప్తు చేయాలి శాంతిభద్రతలు కాపాడటంలో, గంజాయి మూకలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన ఎస్పీ నచికేతన్ ను బదిలీ చేయాలి సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ స్టేషన్లు ఆసుపత్రిలో హత్య చేయడం జిల్లా చరిత్రలో మాయని మచ్చ గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి సోమవారం తెల్లవారుజామున కడప రిమ్స్ ప్రాంగణంలో గంజాయి మూకల చేతిలో దారుణ హత్యకు గురైన కడప నగరం అలంకానపల్లెకు చెందిన పెద్ద దస్తగిరి డెడ్ బాడీని రిమ్సు మార్చరీలో పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కడప నగరం అలంకరణపల్లెలో జరిగిన మారమ్మ జాతరలో తలెత్తిన వివాదం ఆదివారం రాత్రి 11 గంటలకు గంజాయి మూకలు కత్తులు పట్టుకొని దస్తగిరి ఇంటిపై దాడికి తెగబడ్డారు, అడ్డువచ్చిన ఇరుగుపొరుగు వారిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి అన్నారు. జరిగిన ఘటనను సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకుండా, రిమ్స్ హాస్పిటల్కు పోయి అడ్మిట్ కావాలని ఉచిత సలహాలు ఇవ్వగా, తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నదని పోలీసులకు చెప్పిన సకాలంలో పోలీసుల స్పందించకపోవడం పర్యావసానమే వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి లపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో రిమ్స్ లో మాటు వేసి పెద్ద దస్తగిరి పై కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. చిన్న దస్తగిరి కి కూడా కత్తిపోట్లు పడ్డాయన్నారు. జిల్లా కేంద్రం కడప నడిబొడ్డులో ఇంత జరుగుతున్న పోలీసు అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ద్రోన్ కెమెరాల పేరుతో, విస్తృత దాడుల పేరుతో ప్రచార ఆర్భాటాలు మాత్రమే పోలీసు అధికారులు చేస్తూ అసలు గంజాయి విక్రయ దారులు, సప్లైదారులు, వాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దమనుషుల జోలికి పోకుండా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుస్తూ శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేసారని వారు ఆరోపించారు. గంజాయి మూకలు గ్యాంగ్స్టర్లుగా మారి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ చుట్టూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన ఎంతటి వారినైనా మట్టు పెట్టడానికి కిరాయి హంతకులుగా మారుతున్నారని వారన్నారు. సమాజంలో గంజాయి మూకల ప్రమాదం ఉన్నదని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం సహించరానిది అన్నారు. నేరాలను ముందస్తుగా నివారించేందుకు 100కు డయల్ చేయమని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో రాత్రి 10 దాటితే నంబర్ పనిచేయదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్షనిజానికి పేరుగాంచిన కడప జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఫ్యాక్షన్లో చంపుకున్న ఘటనలు ఉన్నాయి కానీ ఆసుపత్రిలో ఉన్న వరిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. చంపిన వారిని తక్షణం అరెస్టు చేసి, సిట్ దర్యాప్తు జరిపించాలని, శాంతిభద్రతలు కాపాడడంలో, గంజాయిని అరికట్టడంలో విఫలమైన జిల్లా ఎస్పీ నచ్చకేతన్ను తక్షణం బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి కే.సి.బాదుల్లా ఎన్ వెంకట శివ బ్రహ్మం, మల్లికార్జున, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.
    1
    అలంకానుపల్లి కి చెందిన పెద్ద దస్తగిరి హత్య పై సిట్ దర్యాప్తు చేయాలి 
శాంతిభద్రతలు కాపాడటంలో, గంజాయి మూకలను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన ఎస్పీ నచికేతన్ ను బదిలీ చేయాలి 
సెటిల్మెంట్లకు అడ్డాగా మారిన పోలీస్ స్టేషన్లు 
ఆసుపత్రిలో హత్య చేయడం జిల్లా చరిత్రలో మాయని మచ్చ 
గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి 
సోమవారం తెల్లవారుజామున కడప రిమ్స్ ప్రాంగణంలో గంజాయి మూకల చేతిలో దారుణ హత్యకు గురైన కడప నగరం అలంకానపల్లెకు చెందిన పెద్ద దస్తగిరి డెడ్ బాడీని రిమ్సు మార్చరీలో పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కడప నగరం అలంకరణపల్లెలో జరిగిన మారమ్మ జాతరలో తలెత్తిన వివాదం ఆదివారం రాత్రి 11 గంటలకు గంజాయి మూకలు కత్తులు పట్టుకొని దస్తగిరి ఇంటిపై దాడికి తెగబడ్డారు, అడ్డువచ్చిన ఇరుగుపొరుగు వారిపై దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి అన్నారు. జరిగిన ఘటనను సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకుండా, రిమ్స్ హాస్పిటల్కు పోయి అడ్మిట్ కావాలని ఉచిత సలహాలు ఇవ్వగా, తమపై దాడి చేసిన వారు గంజాయి మత్తులో ఉన్నారని వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నదని పోలీసులకు చెప్పిన సకాలంలో పోలీసుల స్పందించకపోవడం పర్యావసానమే వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకుపోయిన పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి లపై గంజాయి మూకలు పక్కా ప్రణాళికతో రిమ్స్ లో మాటు వేసి పెద్ద దస్తగిరి పై కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. చిన్న దస్తగిరి కి కూడా కత్తిపోట్లు పడ్డాయన్నారు. జిల్లా కేంద్రం కడప నడిబొడ్డులో ఇంత జరుగుతున్న పోలీసు అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ద్రోన్ కెమెరాల పేరుతో, విస్తృత దాడుల పేరుతో ప్రచార ఆర్భాటాలు మాత్రమే పోలీసు అధికారులు చేస్తూ అసలు గంజాయి విక్రయ దారులు, సప్లైదారులు, వాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దమనుషుల జోలికి పోకుండా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుస్తూ శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేసారని వారు ఆరోపించారు. గంజాయి మూకలు గ్యాంగ్స్టర్లుగా మారి దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ చుట్టూ జనాన్ని  భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన ఎంతటి వారినైనా మట్టు పెట్టడానికి కిరాయి హంతకులుగా మారుతున్నారని వారన్నారు. సమాజంలో గంజాయి మూకల ప్రమాదం ఉన్నదని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం సహించరానిది అన్నారు. నేరాలను ముందస్తుగా నివారించేందుకు 100కు డయల్ చేయమని ప్రభుత్వం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో రాత్రి 10 దాటితే నంబర్ పనిచేయదని వారు పేర్కొన్నారు. ఫ్యాక్షనిజానికి పేరుగాంచిన కడప జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఫ్యాక్షన్లో చంపుకున్న ఘటనలు ఉన్నాయి కానీ ఆసుపత్రిలో ఉన్న వరిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. చంపిన వారిని తక్షణం అరెస్టు చేసి, సిట్ దర్యాప్తు జరిపించాలని, శాంతిభద్రతలు కాపాడడంలో, గంజాయిని అరికట్టడంలో విఫలమైన జిల్లా ఎస్పీ నచ్చకేతన్ను తక్షణం బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి కే.సి.బాదుల్లా ఎన్ వెంకట శివ బ్రహ్మం, మల్లికార్జున, నరసింహులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 
గాలి చంద్ర 
సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ, కొత్తవలస గ్రామంలో ఉపాది హమీ వేతనదారులు ముఖ హాజరు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.గత మూడు రోజులుగా పనులకు వెళ్లిన ఎవరికి హాజరు పడలేదని, ఒక్కరికి మాత్రమే హాజరు పడిందని వారు వాపోయారు.ప్రభుత్వం, సంబందించిన జిల్లా అధికారులు స్పందించి ఉపాధి హామీని పాత పద్దతిలో కొనసాగించాలని గిరిజనులు విజ్ఞప్తి చేసారు.
    1
    అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ, కొత్తవలస గ్రామంలో ఉపాది హమీ వేతనదారులు ముఖ హాజరు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.గత మూడు రోజులుగా పనులకు వెళ్లిన ఎవరికి హాజరు పడలేదని, ఒక్కరికి మాత్రమే హాజరు పడిందని వారు వాపోయారు.ప్రభుత్వం, సంబందించిన జిల్లా అధికారులు స్పందించి ఉపాధి హామీని పాత పద్దతిలో కొనసాగించాలని గిరిజనులు విజ్ఞప్తి చేసారు.
    user_Laxman Regam
    Laxman Regam
    Citizen information bureau అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నమస్తే… సిహెచ్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం… చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో దేవస్థానం స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలోని సత్యమ్మ గ్రామదేవత ఆలయం స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన కొందరికి తహసీల్దార్ కార్యాలయం ద్వారా అనతికాలమ్ లో ఆగమేఘాలమీద అక్రమమార్గంలో పట్టాలు ఇచ్చారని స్థానిక హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోతపోల రామమూర్తి మరియు ఆంధ్రప్రదేశ్ హిందూ చైతన్య వేదిక ప్రచారక్ పుంగనూరు నానబాల లోకేష్ రాయల్ లు మాట్లాడుతూ… సుమారు 50 సంవత్సరాలుగా BC (వడ్డెర/బోయ) కులానికి చెందిన 50 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తూ సత్యమ్మ గ్రామదేవతను పూజిస్తున్నారని తెలిపారు. కొండలు, గుట్టలు, బండరాళ్లుగా ఉన్న సర్వే నంబర్ 9/1 లో 2.39 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు (పంచాంగం) భూమిగా ఇప్పటికీ రెవెన్యూ ఫెయిర్ అడంగల్ లో ఉన్నదన్నారు. ఈ భూమిని ఎంతో శ్రమించి చదును చేసిన ఘనత బీసీలదేనన్నారు. పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను ఇప్పటికే అర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన అగ్రవర్ణాలకు చెందిన, బాగా స్థిరపడిన వారికి ఇవ్వడం ఎంతవరకు సమంజసం?, ఎంత వరకు న్యాయం అని వారు ప్రశ్నించారు. వడ్డెర కుటుంబాలకు దేవస్థానం నిర్మాణం కోసం అదే స్థలాన్ని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గంగాధర నెల్లూరు తహసీల్దార్ పై ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా వెంటనే జోక్యం చేసుకుని గ్రామంలోని పేద కుటుంబాలకు న్యాయం చేయాలని, దేవస్థానం నిర్మాణానికి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల స్పందన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు త్వరలో… 🚨 BREAKING NEWS స్క్రోల్ లైన్స్ 🔴 చిత్తూరు జిల్లాలో దేవస్థానం స్థల వివాదం 🔴 పాత వెంకటాపురంలో సత్యమ్మ దేవస్థానం భూమి వివాదం 🔴 అక్రమంగా పట్టాలు ఇచ్చారని హిందూ సంఘాల ఆరోపణ 🔴 50 ఏళ్లుగా పూజలు చేస్తున్న వడ్డెర కుటుంబాలు 🔴 తహసీల్దార్ వెంటనే స్పందించాలని హిందూ చైతన్య వేదిక డిమాండ్ 🔴 స్పందించకపోతే ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరిక 🔴 జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
    1
    నమస్తే… సిహెచ్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం…
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో దేవస్థానం స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.
గ్రామంలోని సత్యమ్మ గ్రామదేవత ఆలయం స్థలాన్ని అక్రమంగా ఆక్రమించిన కొందరికి తహసీల్దార్  కార్యాలయం ద్వారా అనతికాలమ్ లో ఆగమేఘాలమీద  అక్రమమార్గంలో పట్టాలు ఇచ్చారని స్థానిక హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక చిత్తూరు జిల్లా అధ్యక్షులు  పోతపోల రామమూర్తి మరియు ఆంధ్రప్రదేశ్ హిందూ చైతన్య వేదిక ప్రచారక్ పుంగనూరు నానబాల లోకేష్ రాయల్ లు మాట్లాడుతూ…
సుమారు 50 సంవత్సరాలుగా  BC (వడ్డెర/బోయ) కులానికి చెందిన 50 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తూ సత్యమ్మ గ్రామదేవతను పూజిస్తున్నారని తెలిపారు. కొండలు, గుట్టలు, బండరాళ్లుగా ఉన్న సర్వే నంబర్ 9/1 లో 2.39 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు (పంచాంగం) భూమిగా ఇప్పటికీ రెవెన్యూ ఫెయిర్ అడంగల్ లో ఉన్నదన్నారు. ఈ భూమిని ఎంతో శ్రమించి చదును చేసిన ఘనత బీసీలదేనన్నారు.
పేదలకు ఇవ్వాల్సిన స్థలాలను ఇప్పటికే  అర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన అగ్రవర్ణాలకు చెందిన, బాగా స్థిరపడిన వారికి ఇవ్వడం ఎంతవరకు సమంజసం?,  ఎంత వరకు న్యాయం అని వారు ప్రశ్నించారు.
వడ్డెర కుటుంబాలకు దేవస్థానం నిర్మాణం కోసం అదే స్థలాన్ని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గంగాధర నెల్లూరు తహసీల్దార్  పై ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు.
అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా వెంటనే జోక్యం చేసుకుని గ్రామంలోని పేద కుటుంబాలకు న్యాయం చేయాలని, దేవస్థానం నిర్మాణానికి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారుల స్పందన కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు.
ఇదే అంశంపై మరిన్ని వివరాలు త్వరలో…
🚨 BREAKING NEWS స్క్రోల్ లైన్స్
🔴 చిత్తూరు జిల్లాలో దేవస్థానం స్థల వివాదం
🔴 పాత వెంకటాపురంలో సత్యమ్మ దేవస్థానం భూమి వివాదం
🔴 అక్రమంగా పట్టాలు ఇచ్చారని హిందూ సంఘాల ఆరోపణ
🔴 50 ఏళ్లుగా పూజలు చేస్తున్న వడ్డెర కుటుంబాలు
🔴 తహసీల్దార్ వెంటనే స్పందించాలని హిందూ చైతన్య వేదిక డిమాండ్
🔴 స్పందించకపోతే ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరిక
🔴 జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
    user_Krishanamurthy Reddy
    Krishanamurthy Reddy
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.