Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు: బద్వేలు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నందు రాధాకృష్ణ నగర్ లో బొల్లు భాస్కర్ అడ్వకేట్ నివాసం ఉన్న ఇల్లు, స్థలంపై గత పది సంవత్సరాలుగా వివాదం జరుగుతూ ఉంది. భాస్కర్ తన ఇంటి పరిసరాలకు సంబంధించి తన ఫోన్లకు తన కుటుంబ సభ్యుల ఫోన్లకు సిసి కెమెరాలతో రికార్డు అవుతుంది. భాస్కర్ ఇంటిపై గత 15 రోజుల నుండి ఇది మూడవసారి దౌర్జన్యం జరగడం గతంలో రెండు సార్లు ఫిర్యాదు చేసిన PGRS ద్వారా ఫిర్యాదుల ను రికార్డెడ్ గా పంపిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించినారు ఈ దినం అనగా 06-04- 2026 భాస్కర్ కోర్టులో ఉండగా తన ఇంటిపై కొందరు రౌడీ మూకలను ఆ సివిల్ కేసులను పార్టీలు వారికి సపోర్టుగా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి పథకం ప్రకారం భాస్కర్ ఇంటిపై దౌర్జన్యం చేసి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి వారి కుటుంబ సభ్యులను గాయపరిచినారు అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి న్యాయవాదులందరూ కలసి కోర్టు విధులను బహిష్కరించడానికి నిర్ణయించుకుని రేపటినుండి ఆదివారం వరకు విధుల బహిష్కరణకు సంబంధించిన అధికారులకు ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ల దృష్టికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, డీజీపీ కి తగిన వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది.1
- అల్లూరి జిల్లా,అనంతగిరి మండలం పరిధిలో గల పినకోట,జీనబాడు,పెదకోట, కివర్ల పంచాయతీలలో జిడిమామిడి రైతులకు ఈఏడాది తీవ్రంగా నష్టం చేకూరెలా ఉంది. ఈ ప్రాంతంలో రెండో ప్రధాన పంటగా జీడీ తోటలను అధికామొత్తంలో గిరిజన రైతులు సాగజెస్తున్నారు.ఇటీవల వర్షాలు,మబ్బులు వల్ల జీడీపూత మడిపోయిందని గిరిజనులు వాపోయారు.వేలల్లో వడ్డీలకు అప్పు తెచ్చి తోటలో పనులకు ఖర్చు చేశామని, కనీసం వడ్డీ తీర్చేందుకుకైనా జీడీ కాపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు తెగులు,అకాల వర్షాలకు నష్ట పోయిన జీడీ రైతులను ప్రభుత్వ ఆదుకోక పోతే ఉరి తాళ్ళే శరన్యమని గిరిజనులు అంటున్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల గిరిజన రైతులు మాట్లాడుతూ... ఈ సంవత్సరం అకాల వర్షాలు వల్ల,మంచు తెగులుతో జీడీతోటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు. సంవత్సరం కాలం జీడి పైనె అదార పడ్డ గిరిజన రైతులు అప్పులు పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎకారకు 30 వేలు చప్పున నష్టం పరిహరం చేల్లించాలని డిమాండ్ చేసారు,జిల్లా కలెక్టర్, ఐటీడీఏ,అధికారులు జీడీ పంటలకు నష్ట పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.అల్లూరి జిల్లాలోని వరి తరువాత మెట్ట భూముల్లో ప్రదాన పంట జీడీ పంటగా ఉందని తెలిపారు.అటువంటి పంటలను కూటమి ప్రభుత్వ గుర్తించక పోవడం దారుణ మన్నారు.కోద్దిగోప్పో ఉన్న జీడీ పిక్కలకు మద్దతు ధర కేజీ 200 రూ/-ప్రకటించి ఆర్.ఎస్.కె ల ద్వారా కోను గోలు చేయాల అన్నారు.గత ఐదు సంవత్సరం నుండి వాతావరణ మార్పులు ఉష్ణో గ్రతలు పొగ మంచు,తెగుళ్లు పిండి నల్లి.వంటి తదితర విపత్తుల వల్ల పూత,పింజ దెబ్బతిని తీవ్ర నష్టాలకు గురయ్యారని పేర్కొన్నారు.ఈసంవత్సరం కూడా పూత వచ్చినా కాపు నిలపడక పూర్తిగా అనేక మంది తోటలు దెబ్బతి న్నాయని. తోటలో వివిధ పనులకు కొట్టటానికి ఎకరకు రూ.10నుండి 20వే వరకు పెట్టు బడిపెట్టి నా కాపునిలబడక నష్ట పోయామని తెలిపారు. ఈ పరిస్థితిలో రైతులు ప్రతి సంవత్సరం నష్టాలు భరించలేక అనేక మంది జీడీ తోటలను పూర్తిగా తొలగించుకునె పరిస్థితి ఎర్పడుతుందని తెలిపారు.జీడి పంటలు ఎస్సీ,ఎస్టి,చిన్న,సన్న కారు రైతులు ఎక్కువగా పండి స్తున్నామని తెలిపారు. కనీసం కేజీ. రూ.200/-ఇస్తే తప్ప కిట్టుబాటు కదన్నారు. అందువల్ల ప్రభుత్వం ఆర్.ఎస్.కెల ద్వారా కేజీ రూ.200/-కొనుగోలు చేయాలని,పంటల భీమా ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు. హర్టికల్చర్ అదికారులు ఆపీసుల్లో నిద్ర పోకుండా గ్రామాల్లో తిరిగి జీడీ పంటలను అంచనా కట్టి వెంటనే నష్టపరిహారం చేల్లించాలని కేజీ జీడీ రెండు వందలు రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.1
- రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత యువత, విద్యార్థులకు రోడ్డు నిబంధనలపట్ల అవగాహన అవసరం మదర్ థెరిసా కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు సిబ్బందికి హెల్మెట్ల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి. రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేర్ శాసన సభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు భద్రత - హెల్మెట్ ప్రాధాన్యత పై తెలియజేశారు.కేవలం హెల్మెట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదని, వాటిని ధరించడం వల్ల కలిగే రక్షణ గురించి అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ISI గుర్తు ఉన్న నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే వాడాలని ఆయన సూచించారు. రోడ్డు పక్కన దొరికే నాసిరకం హెల్మెట్లు వాడటం వల్ల ప్రమాద సమయంలో సరైన రక్షణ లభించదని హెచ్చరించారు.ఇక రాత్రి సమయాల్లో హెల్మెట్ గ్లాస్పై పడే లైటింగ్ రిఫ్లెక్షన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండ కలిగి ఉండాలని కోరారు.లైసెన్స్ లేని విద్యార్థుల కోసం కాలేజీలోనే ప్రత్యేక క్యాంప్లు ఏర్పాటు చేసి లైసెన్స్లు ఇప్పించేందుకు రవాణా శాఖ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. టీనేజ్ వయస్సులో వేగంగా వాహనాలు నడపాలనే ఉత్సాహం ఉంటుందని, కానీ అది ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఒక చిన్న పొరపాటు వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, దానివల్ల మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. ఇక మాదకద్రవ్యాల కు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని.ఆవేదన వ్యక్తం చేశారు.ఏ విధమైన చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని హితవు పలికారు.మీరు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగితే అది మీ కుటుంబానికి మరియు మీరు చదువుకున్న సంస్థలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇక మీదట ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రసాద్ నాయుడు,భరత్, జయసింహా,రహీంభాషా, శ్రీనివాసులు, సురేష్, బాలాజీ, రవి మరియు కళాశాల యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1
- శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామ పొలంలో జాంపుల అప్పస్వామి , జాంపుల ప్రమీల , రైతుల పొలములో సోమవారం ఉదయం సుమారు రూ. 6లక్షల విలువ చేసే డ్రిప్ పరికరాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్,వల్ల మంటలు చెలరేగి ల్యాటర్లు మొత్తం కాళిపోగా విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే లోపు అప్పటికే పూర్తిగా కాలిపోయాయి. ప్రభుత్వం తమకు జరిగిన నష్టానికి సహాయం అందించి ఆదుకోవాలని రైతులు బోరున కోరారు.1
- తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.1
- Post by Bondhu Suresh1
- అల్లూరి జిల్లా,అనంతగిరి మండలంలో గల పినకోట పంచాయతీ పరిది అడవుల్లో అడవి దున్నలు విస్తృతంగా సంచరిస్తున్నాయి. సోమవారం చింతపాక, అరేమాను గురువు మధ్య ఉన్న జీడీతోటల్లో అడవిదున్న కనిపించినట్లు స్థానికులు తెలిపారు.కొండ పోడు,జీడి మామిడి తోటలకు అలాగే పశువులకి వెళ్లాలన్నా చాలా భయంగా ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జీడీ తోటలకు ఒంటరిగా వెళ్లలంటే భయంగా ఉందని ప్రజలు వాపోయారు. సంబందించిన అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు..1
- పలమనేరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. బెంగళూరు నుంచి తిరుపతి కి కారులో వస్తున్న సమయంలో పలమనేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.తిరుపతి కోర్టు లో పనిచేయు చున్న యుగంధర్ జూనియర్ అసిస్టెంట్,హరీష్. బెంగళూరు లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో జరిగిన ఘటన.పలమనేరు గంగవరం సమీపంలో ముందర వెళుతున్న లారీ ఉన్నట్లుండి ఆగడంతో వెనుక వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలింపు.1