logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తానూర్ మండలంలోని భోసి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు* హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను రైతు బిడ్డనని పేర్కొంటూ సంఘ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.సంఘానికి దశలవారీగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామస్తులు మరియు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

3 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
3 hrs ago
eeba792d-9ec0-4aa0-9017-a309dcf31f03
facc37df-c977-40e9-a294-94f02c342929

తానూర్ మండలంలోని భోసి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు* హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను రైతు బిడ్డనని పేర్కొంటూ సంఘ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.సంఘానికి దశలవారీగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామస్తులు మరియు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • .' అలాంటి రైతన్నను కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. భారత దేశపు 75 ఏళ్ల చరిత్రలో ఏ నాయకుడూ ఆలోచించని ఒక గొప్ప పథకం, రైతు బంధు.
    1
    .'
అలాంటి రైతన్నను కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత.
భారత దేశపు 75 ఏళ్ల చరిత్రలో ఏ నాయకుడూ ఆలోచించని ఒక గొప్ప పథకం, రైతు బంధు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    1 hr ago
  • Post by Solanke Ravi
    3
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    1 hr ago
  • ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరు, బోధనలో నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్లు ఇచ్చారని మండిపడ్డారు. సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరు, బోధనలో నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్లు ఇచ్చారని మండిపడ్డారు. సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా  పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహణ 📅 తేదీ : 03.04.2026 📍 స్థలం : IDOC, కామాహరెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (LB) శ్రీ మధు మోహన్ గారు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, “దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమర వీరుడని, రెండు పదుల వయసు నిండకుండానే భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం రైతాంగ పోరాటం చేసి అమరుడైన మహా వీరుడని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని, ఆయన ధైర్యసాహసాలు మరియు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.” అలాగే బహుజన సంఘాల నాయకులు, కుర్మ సంఘం నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సహాయ బీసీ అభివృద్ధి అధికారి శ్రీ చక్రధర్ గారు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, గణేష్ నాయక్, విఠల్, నాగరాజు, కుర్మ సంఘం నాయకులు భూమయ్య, సంజీవ్ స్వామి, అశ్వక్, నరేష్, స్వప్న, సునీత, పవన్ మరియు జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహణ
📅 తేదీ : 03.04.2026
📍 స్థలం : IDOC, కామాహరెడ్డి
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (LB) శ్రీ మధు మోహన్ గారు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, “దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమర వీరుడని, రెండు పదుల వయసు నిండకుండానే భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం రైతాంగ పోరాటం చేసి అమరుడైన మహా వీరుడని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని, ఆయన ధైర్యసాహసాలు మరియు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.”
అలాగే బహుజన సంఘాల నాయకులు, కుర్మ సంఘం నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సహాయ బీసీ అభివృద్ధి అధికారి శ్రీ చక్రధర్ గారు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, గణేష్ నాయక్, విఠల్, నాగరాజు, కుర్మ సంఘం నాయకులు భూమయ్య, సంజీవ్ స్వామి, అశ్వక్, నరేష్, స్వప్న, సునీత, పవన్ మరియు జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    51 min ago
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.
    1
    జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలను సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఘనంగా నివాళులర్పించారు , అదనపు కలెక్టర్ నగేష్, బీసీ సంక్షేమ కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలను సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఘనంగా నివాళులర్పించారు  , అదనపు కలెక్టర్ నగేష్, బీసీ సంక్షేమ కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • బీ.ఆర్.ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మాజీమంత్రి జోగురామన్న ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. బీ.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఆయనను నియమించాలని మున్సిపల్ కమిషనర్ కు, చైర్ పర్సన్ కు లేఖ రాశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు... కౌన్సిల్ లో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి కౌన్సిలర్లు అభినందనలు తెలియచేశారు. పట్టణాభివృద్దికి గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న అన్నారు. అదే స్పూర్తితో ప్రస్తుత కౌన్సిల్ లోనూ అభివృద్ధికే బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు పాటు పడాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించడంతో పాటు... పట్టణాభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, అన్నెల వసంత్, ఆత్రం వెంకటేష్, డాక్టర్ గౌస్ , సలీమ్,అనిల్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు..
    4
    బీ.ఆర్.ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మాజీమంత్రి జోగురామన్న ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. బీ.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఆయనను నియమించాలని మున్సిపల్ కమిషనర్ కు, చైర్ పర్సన్ కు లేఖ రాశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు... కౌన్సిల్ లో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి కౌన్సిలర్లు అభినందనలు తెలియచేశారు. పట్టణాభివృద్దికి గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న అన్నారు. అదే స్పూర్తితో ప్రస్తుత కౌన్సిల్ లోనూ అభివృద్ధికే బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు పాటు పడాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించడంతో పాటు... పట్టణాభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, అన్నెల వసంత్, ఆత్రం వెంకటేష్, డాక్టర్ గౌస్ , సలీమ్,అనిల్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు..
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.