తిరుమల తరువాత మరో తిరుమల తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు తిరుమల తరువాత మరో తిరుమల తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు తగినట్లుగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. బుధవారం ఆయన ఆలయం వద్ద జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, సభ్యులు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రూ.1.25 కోట్లతో నిర్మించనున్న స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్లు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఆలయంలో రూ.10లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు.కరూర్ వైశ్యా బ్యాంకు వారు దేవాలయానికి అందించిన దర్శనం, లడ్డూ టిక్కెట్లను జారీ చేసే టిక్కెట్ మిషన్ ను ప్రారంభించారు. పుష్కర ఘాట్ ను, కోనేరు అభివృద్ధి పనులతో పాటు, వకుళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను, ఆలయం వద్ద జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన గడువు లోపుగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు శనివారాలు, ఏడు ప్రదక్షిణలు ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్యూలైన్లు పెంచడానికి క్యూలైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. పార్కింగ్ కేంద్రానికి వెళ్ళడానికి రూ.50లక్షల ఎమ్జీఎన్ఆర్జీఎస్ నిధులతో రహదారి నిర్మాణం జరిగిందని తెలిపారు. దానికి కొనసాగింపుగా పార్కింగ్ ఏరియా నుంచి ఏటిగట్టు వరకూ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిపారు. వకుళమాత అన్నదాన భవనం త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కోనేరు పనులు, రథం షెడ్డు పనులు పూర్తవుతున్నాయని అన్నారు.8 ఎకరాలు పార్కింగ్ స్థలం శాండ్ ఫిల్లింగ్ పూర్తయిందని, త్వరలోనే గ్రావెల్ ఫిల్లింగ్ చేయనున్నట్లు తెలిపారు. రూ.12 కోట్లతో శ్రీనివాసం పేరుతో 54 రూములు, 4 డార్మెటరీలు నిర్మాణానికి త్వరలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మరొక డార్మెటరీ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. టూరిజం శాఖ సహకారంతో 18 టెన్షల్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. శ్రీనివాసం 2 కోసం టిటిడి ని సంప్రదిస్తున్నామని తెలిపారు. లక్ష లీటర్ల వాటర్ ట్యాంకు కోసం హెటిరో సంస్థలు విరాళం అందించడం జరిగిందని, ఆ వాటర్ ట్యాంకు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని, 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు కూడా నిర్మిస్తామని తెలిపారు. రహదారి వెడల్పు, నిర్మాణాల కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్, సభ్యులు, అధికారులు అందరికీ స్వామివారి సేవ చేసుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించి పనులు చేస్తున్నామని తెలిపారు.
తిరుమల తరువాత మరో తిరుమల తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు తిరుమల తరువాత మరో తిరుమల తరహాలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు తగినట్లుగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. బుధవారం ఆయన ఆలయం వద్ద జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో దేవస్థానం పాలకమండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, సభ్యులు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రూ.1.25 కోట్లతో నిర్మించనున్న స్టెయిన్ లెస్ స్టీల్ క్యూలైన్లు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఆలయంలో రూ.10లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు.కరూర్ వైశ్యా బ్యాంకు వారు దేవాలయానికి అందించిన దర్శనం, లడ్డూ టిక్కెట్లను జారీ చేసే టిక్కెట్ మిషన్ ను ప్రారంభించారు. పుష్కర ఘాట్ ను, కోనేరు అభివృద్ధి పనులతో పాటు, వకుళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను, ఆలయం వద్ద జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన గడువు లోపుగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు శనివారాలు, ఏడు ప్రదక్షిణలు ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు తగినట్లుగా సౌకర్యాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్యూలైన్లు పెంచడానికి క్యూలైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. పార్కింగ్ కేంద్రానికి వెళ్ళడానికి రూ.50లక్షల ఎమ్జీఎన్ఆర్జీఎస్ నిధులతో రహదారి నిర్మాణం జరిగిందని తెలిపారు. దానికి కొనసాగింపుగా పార్కింగ్ ఏరియా నుంచి ఏటిగట్టు వరకూ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిపారు. వకుళమాత అన్నదాన భవనం త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కోనేరు పనులు, రథం షెడ్డు పనులు పూర్తవుతున్నాయని అన్నారు.8 ఎకరాలు పార్కింగ్ స్థలం శాండ్ ఫిల్లింగ్ పూర్తయిందని, త్వరలోనే గ్రావెల్ ఫిల్లింగ్ చేయనున్నట్లు తెలిపారు. రూ.12 కోట్లతో శ్రీనివాసం పేరుతో 54 రూములు, 4 డార్మెటరీలు నిర్మాణానికి త్వరలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మరొక డార్మెటరీ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. టూరిజం శాఖ సహకారంతో 18 టెన్షల్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. శ్రీనివాసం 2 కోసం టిటిడి ని సంప్రదిస్తున్నామని తెలిపారు. లక్ష లీటర్ల వాటర్ ట్యాంకు కోసం హెటిరో సంస్థలు విరాళం అందించడం జరిగిందని, ఆ వాటర్ ట్యాంకు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని, 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు కూడా నిర్మిస్తామని తెలిపారు. రహదారి వెడల్పు, నిర్మాణాల కోసం టెండర్లు పిలిచామని తెలిపారు. దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్, సభ్యులు, అధికారులు అందరికీ స్వామివారి సేవ చేసుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించి పనులు చేస్తున్నామని తెలిపారు.
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- 🙏😭1
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం. అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది. అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది. వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.1
- Post by Shyam1
- Post by Anji Raju1
- 🙏😭1