Shuru
Apke Nagar Ki App…
బూర్గంపాడు మండలంలో పర్యటించిన తినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.
VANAMA SRINIVAS RAO
బూర్గంపాడు మండలంలో పర్యటించిన తినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పెద్ద ఎల్లాపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో.. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పని ఒక రైతును రోడ్డున పడేసింది. గ్రామానికి చెందిన రైతు గుండగాని రాజు, తనకున్న పొలంలో ఎంతో ఆశతో మొక్కజొన్న సాగు చేశారు. పంట బాగా పండిందని, ఈసారి మంచి దిగుబడి వస్తుందని సంతోషిస్తున్న తరుణంలో.. కొందరు దుండగులు పంట చేనుకు నిప్పు పెట్టారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో మొక్కజొన్న కంకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయిపొలానికి వెళ్లిన రాజుకు.. కాలిపోయిన పంటను చూసి గుండె తరుక్కుపోయింది. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన తనకు, ఇప్పుడు మిగిలింది కేవలం బూడిదేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, ఈ అగ్నిప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గుండగాని రాజు వేడుకుంటున్నారు.1
- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటి విలువ సుమారు ₹45,000. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.1
- వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.3
- Post by Anji Raju1
- L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...... 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి నివేదిక లో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో వాటర్ శ్యాంపిల్ లను సేకరించి పరీక్షించారు. వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాలికల వసతి గృహం, పాఠశాలను పరిశీలించి విద్యార్థినీలతో ముచ్చటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్ వాడి కేంద్రాల భవవనాలని పరిశీలించారు. అధికారులను ఎప్పటికప్పుడు 99 రోజుల ప్రణాళికలో పనులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.1
- హన్మకొండ:అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్లో చేపడుతున్న అభివృద్ధి పనులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్ చందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నేతలతో పరిశీలించారు. రైల్వే అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు.1
- గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.1