చార్మినార్ నుంచి యుద్ధ వ్యతిరేక ర్యాలీ భారీగా తరలిన తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్, మార్చి 29: దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది
చార్మినార్ నుంచి యుద్ధ వ్యతిరేక ర్యాలీ భారీగా తరలిన తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్, మార్చి 29: దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది
- హైదరాబాద్, మార్చి 29: దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది1
- తోపన గడ్డ తండ ప్రజలు వన బోజనం కార్యక్రమం. జరిగింది. ఇందులోభాగంగా పలువురు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుగులోత్ జయరాం. భానోత్ సాగర్. రమేష్. ప్రసాద్. మాజీ వార్డు మెంబర్ బాలు. పర్సు. రాములు. వీర స్వామి. మాజీ సర్పంచ్ ఈర్య. హట్టి. బంగరు. హరి చంద్. ఆకు బాయ్. మరియు శారద మాజీ వార్డు మెంబర్. చిట్టి. గమ్మక. ఉమ. దేవులి. సునిత. ఈ దేవులి. సునిత. తదితరులు పా లోనడం జరిగింది.1
- ఈ నెల 30వ తేదీన సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి - గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఐటీడీఏ ఏటూరు నాగారం లో నిర్వహించే గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ అర్జీలను సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.2
- జనగాం జిల్లా:అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థుల ఆరోపణలకు ఒక్కొక్కటిగా కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో స్పందించారు. కడియం శ్రీహరి తమకు తండ్రి సమానమని, ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆ కాలంలోని కార్యకలాపాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.1
- భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ధరణి పోర్టల్ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వంలో సామాన్యులకు .. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.1
- అసెంబ్లీ కమిటీ హాల్లో మానేర్ రివర్ ఫ్రంట్ పై కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి నివేదికలపై ఆరా తీశారు. త్వరలో మానేరు రివర్స్ ఫ్రంట్ పై మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించారు. భూ సేకరణ, అంచనా వ్యయం, నీటిపారుదల, పర్యాటక శాఖ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.3
- అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగిందని డిఎస్పి ఎల్. ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం మేరకు సిఐ కరుణాకర్ పాత కొత్తగూడెం ఏరియాలో ఓక బైక్ ను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 9.980 కేజీల గంజాయి పట్టుబడిందని, దాని విలువ 4 లక్షల 99వేల రూపాయల ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణా చేసిన, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.3
- వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గంలో మండల, డివిజన్ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మహమ్మద్ హాజరై అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1