logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित

7 hrs ago
user_पत्रकार नासिफ खान
पत्रकार नासिफ खान
कूर्डीनेटर నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
7 hrs ago

इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित

More news from తెలంగాణ and nearby areas
  • इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित
    1
    इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित
    user_पत्रकार नासिफ खान
    पत्रकार नासिफ खान
    कूर्डीनेटर నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. అగంతకులు కోర్టులో మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు బాంబు పేలుతుందని కోర్టు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కు మెయిల్ పంపారు. వెంటనే ఏవో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు సిబ్బంది న్యాయమూర్తులు న్యాయవాదులు వివిధ కేసులపై కోర్టుకు హాజరైన వారంతా భయంతో బయటికి వచ్చారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అగంతకులు కోర్టులో అలజడి సృష్టించేందుకే బెదిరింపు మెయిల్ చేశారని భావిస్తున్నారు. అగంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కోర్టులో అలజడి సృష్టించడానికే ఫేక్ బాంబు బెదిరింపుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    4
    కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. అగంతకులు కోర్టులో మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు బాంబు పేలుతుందని కోర్టు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కు మెయిల్ పంపారు. వెంటనే ఏవో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోర్టు సిబ్బంది న్యాయమూర్తులు న్యాయవాదులు వివిధ కేసులపై కోర్టుకు హాజరైన వారంతా భయంతో బయటికి వచ్చారు.  బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. అగంతకులు కోర్టులో అలజడి సృష్టించేందుకే బెదిరింపు మెయిల్ చేశారని భావిస్తున్నారు. అగంతకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న కోర్టులో అలజడి సృష్టించడానికే ఫేక్ బాంబు బెదిరింపుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • మంగళవారం రోజు అర్ధరాత్రి నాయుడు పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు నుజులు అయింది కారు వెనుక ముందు నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం
    3
    మంగళవారం రోజు అర్ధరాత్రి నాయుడు పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు నుజులు అయింది కారు వెనుక ముందు నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    5 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 18 ప్రజా తెలంగాణ న్యూస్ ఈరోజు ప్రజా నాయకుడు, మనసున్న మహానేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర్ రావు గారి 72వ జన్మదినం సందర్బంగా వేడుకలు గజ్వెల్ పట్టణంలో mlc వంటేరి యాదవరెడ్డి,గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో brs మండల అధ్యక్షుడు బెండే మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి నిండు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజా సేవలో ముందుకు వెళ్లేలా ఆశీర్వధించాలని ప్రార్థించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తదననంతరం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి, వైస్ ఛైర్మన్ కల్యాణ్ కార్ నర్సింగరావు మురియు పాలక వర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన సల్లూరీ మహేష్ S%రామయ్య నిరుపేద కుటుంబానికి చెంది వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు రాఆకాంక్షించారు72000 రూపాయల ఆర్థిక సహాయం బంగ్లా వెంకటాపూర్ లోని ఇంటికి వెళ్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు.ఆ తర్వాత స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తాలో గజ్వేల్ మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ గారు తిరుగులేని ప్రజా నాయకునిగా తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన మనసున్న మానవతావాది కేసీఆర్ గారు అని వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రారస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పోరాట వీరునిగా, పదేళ్ళ పాలనలో మంచి పరిపాలనా దక్షునిగా, నేడు రాష్ట్ర ప్రజలందరూ జాతిపిత గా పిలుస్తున్న నేతగా నిజాయితీకి, నిరాడంబరతకు, నిలువెత్తు రూపం కెసిఆర్ అన్నారు. గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్టానికి మార్గదర్శనం చేసి రోల్ మొడల్గా నిలిపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారని గుర్తు చేశారు. వారు ఇచ్చిన స్ఫూర్తి తోనే తాము కూడా ప్రజా సేవలో కొనసాగుతూ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదం తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో పురోగమించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,అరుణ,జఖి ఉద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవాని, భాగ్యలక్ష్మీ, శ్రీధర్, అత్తెల్లి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్ లు, రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి స్వామి, బ్యాగారి ప్రభాకర్, నాయకులు బలమని, మద్ది రాజిరెడ్డి,కృష్ణా రెడ్డి, రగుపతి రెడ్డి, రమేష్ గౌడ్, శివ,స్వామి, మల్లేశం, బిమప్ప, అహ్మద్,దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కనక గౌడ్, భాను, చందు, బూరన్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 18 ప్రజా తెలంగాణ న్యూస్
ఈరోజు ప్రజా నాయకుడు, మనసున్న మహానేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర్ రావు గారి 72వ జన్మదినం సందర్బంగా వేడుకలు గజ్వెల్ పట్టణంలో mlc వంటేరి యాదవరెడ్డి,గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో brs మండల అధ్యక్షుడు బెండే మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్  గారికి నిండు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజా సేవలో ముందుకు వెళ్లేలా ఆశీర్వధించాలని ప్రార్థించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తదననంతరం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో  మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి, వైస్ ఛైర్మన్ కల్యాణ్ కార్ నర్సింగరావు మురియు పాలక వర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గజ్వేల్  మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన సల్లూరీ మహేష్ S%రామయ్య  నిరుపేద  కుటుంబానికి  చెంది వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు రాఆకాంక్షించారు72000 రూపాయల ఆర్థిక సహాయం బంగ్లా వెంకటాపూర్ లోని  ఇంటికి వెళ్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో  ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,  గజ్వేల్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు.ఆ తర్వాత స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తాలో  గజ్వేల్ మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో  అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ గారు  తిరుగులేని ప్రజా నాయకునిగా  తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన మనసున్న మానవతావాది కేసీఆర్  గారు అని వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రారస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పోరాట వీరునిగా, పదేళ్ళ పాలనలో మంచి పరిపాలనా దక్షునిగా, నేడు రాష్ట్ర ప్రజలందరూ జాతిపిత గా పిలుస్తున్న నేతగా నిజాయితీకి, నిరాడంబరతకు, నిలువెత్తు రూపం కెసిఆర్ అన్నారు.  గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్టానికి మార్గదర్శనం చేసి రోల్ మొడల్గా నిలిపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారని గుర్తు చేశారు. వారు ఇచ్చిన స్ఫూర్తి తోనే తాము కూడా ప్రజా సేవలో కొనసాగుతూ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదం తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్  గారు  ఆయురారోగ్యాలతో  పురోగమించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,అరుణ,జఖి ఉద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవాని, భాగ్యలక్ష్మీ, శ్రీధర్, అత్తెల్లి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్ లు,  రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి స్వామి, బ్యాగారి ప్రభాకర్, నాయకులు బలమని,  మద్ది రాజిరెడ్డి,కృష్ణా రెడ్డి, రగుపతి రెడ్డి,  రమేష్ గౌడ్, శివ,స్వామి,  మల్లేశం, బిమప్ప, అహ్మద్,దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కనక గౌడ్, భాను, చందు, బూరన్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • వర్ధన్నపేట | వరంగల్ జిల్లా: ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.
    1
    వర్ధన్నపేట | వరంగల్ జిల్లా:
ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు.
సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.
    user_Ibrahim sulthana
    Ibrahim sulthana
    Tailor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    1
    ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు...
రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర...
మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి....
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ....
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు.
కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం.
ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు.
ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు.
ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు.
తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు.
కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ...
తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం.
రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది.
రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము.
తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది.
ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ....
ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది.
తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు.
రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు.
బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్.
దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు
నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు.‌ పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో  విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు.‌ వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి  అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు.‌ పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో  విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు.‌ వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి  అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.