Shuru
Apke Nagar Ki App…
ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి వెల్దుర్తి మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి నెలకొంది. ట్రాక్టర్లతో భూములను దున్నిస్తూ రైతులు వరి నాట్లకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి వరకు వర్షాభావంతో ఆందోళన చెందిన రైతులు, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడటంతో సాగు పనులను ముమ్మరం చేశారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఈ సీజన్లో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో పొలాలన్నీ వ్యవసాయ పనులతో కళకళలాడుతున్నాయి.
Priya
ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి వెల్దుర్తి మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి నెలకొంది. ట్రాక్టర్లతో భూములను దున్నిస్తూ రైతులు వరి నాట్లకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి వరకు వర్షాభావంతో ఆందోళన చెందిన రైతులు, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడటంతో సాగు పనులను ముమ్మరం చేశారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఈ సీజన్లో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో పొలాలన్నీ వ్యవసాయ పనులతో కళకళలాడుతున్నాయి.
More news from తెలంగాణ and nearby areas
- ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి వెల్దుర్తి మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి నెలకొంది. ట్రాక్టర్లతో భూములను దున్నిస్తూ రైతులు వరి నాట్లకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి వరకు వర్షాభావంతో ఆందోళన చెందిన రైతులు, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడటంతో సాగు పనులను ముమ్మరం చేశారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఈ సీజన్లో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో పొలాలన్నీ వ్యవసాయ పనులతో కళకళలాడుతున్నాయి.1
- శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 41 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స అందించి, గర్భాశయాన్ని తొలగించకుండా కాపాడారు. తీవ్రమైన యోని రక్తస్రావంతో బాధపడుతున్న మహిళకు సంప్రదాయ శస్త్రచికిత్స అవసరం లేకుండా "నో సర్జరీ – నో స్కార్" విధానంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సాంకేతికతను ఉపయోగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. దీంతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా రోగి ప్రాణాలను, గర్భాశయాన్ని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ సందర్భంగా మెడికోవర్ వైద్య నిపుణులు మాట్లాడుతూ, అసాధారణమైన యోని రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా అనేక గైనకాలజీ సమస్యలకు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఈ విధానంలో శరీరంపై పెద్ద కోతలు లేకుండా, మచ్చలు లేకుండా చికిత్స అందించడంతో పాటు రోగులు తక్కువ సమయంలోనే కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ విజయవంతమైన చికిత్సకు సంబంధించిన వివరాలను హైటెక్ సిటీలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక వైద్య సాంకేతికతతో మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికోవర్ అందిస్తున్న సేవలను వివరించారు.1
- చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు! హైదరాబాద్లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.4
- మైనంపల్లి హనుమంతరావు టూ ప్లస్ టు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? ఏనుముల తిరుపతి రెడ్డి, ఏనుముల కొండల్ రెడ్డిలు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు? సునీతా మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్. ఆమెకు గన్మెన్లను ఇచ్చారు సత్యవతి రాథోడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి.. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి. ఆమె గన్మెన్లను తీసేశారు జోగు రామన్న మాజీ మంత్రి. ఆయన గన్మెన్లను తొలగించారు.. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి 2+2 గన్మెన్లను ఇచ్చారు ఎందుకు? కుందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి? ఆయనకు 2+2 గన్మెన్లను ఇచ్చి, అత్యాధునిక బుల్లెట్ప్రూఫ్ వాహనం ఇచ్చారు జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్న కూడా మాజీ మంత్రులే కదా. మరి వీళ్లకు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం.. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా? దీని మీద డీజీపీ సమాధానం చెప్పాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్1
- JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party1
- ఘనాపూర్ పెద్దమ్మ ఆలయంలో చోరీ.. తాళాలు పగులగొట్టి అమ్మవారి నగలు అపహరణ తూప్రాన్ మండలం ఘనాపూర్ గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఆలయానికి తాళాలు వేసి వెళ్లిన అనంతరం, బుధవారం ఉదయం పూజల కోసం వచ్చిన పూజారి నర్సింలు గేటు, ప్రధాన తలుపుల తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించారు. ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక, పుస్తె మట్టెలు, సౌండ్ బాక్స్ను దుండగులు అపహరించినట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో వరుసగా జరుగుతున్న చోరీలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని కోరుతున్నారు.1
- 10 కిలోల గంజాయినికి స్వాధీనం చేసుకున్న కొల్లేరు పోలీసులు ఒడిశా రాష్ట్రానికి చెందిన జయదేవ్ బిశ్వాస్ (23), ప్రశంజిత్ రాయ్ (22) అనే ఇద్దరు యువకులు 10 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలించి కొల్లూరు లేబర్ క్యాంపులో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసిన ఎస్ఐపీ రాంబాబు శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.1