శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 41 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స అందించి, గర్భాశయాన్ని తొలగించకుండా కాపాడారు. తీవ్రమైన యోని రక్తస్రావంతో బాధపడుతున్న మహిళకు సంప్రదాయ శస్త్రచికిత్స అవసరం లేకుండా "నో సర్జరీ – నో స్కార్" విధానంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సాంకేతికతను ఉపయోగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. దీంతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా రోగి ప్రాణాలను, గర్భాశయాన్ని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ సందర్భంగా మెడికోవర్ వైద్య నిపుణులు మాట్లాడుతూ, అసాధారణమైన యోని రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా అనేక గైనకాలజీ సమస్యలకు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఈ విధానంలో శరీరంపై పెద్ద కోతలు లేకుండా, మచ్చలు లేకుండా చికిత్స అందించడంతో పాటు రోగులు తక్కువ సమయంలోనే కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ విజయవంతమైన చికిత్సకు సంబంధించిన వివరాలను హైటెక్ సిటీలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక వైద్య సాంకేతికతతో మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికోవర్ అందిస్తున్న సేవలను వివరించారు.
శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 41 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స అందించి, గర్భాశయాన్ని తొలగించకుండా కాపాడారు. తీవ్రమైన యోని రక్తస్రావంతో బాధపడుతున్న మహిళకు సంప్రదాయ శస్త్రచికిత్స అవసరం లేకుండా "నో సర్జరీ – నో స్కార్" విధానంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సాంకేతికతను ఉపయోగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. దీంతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా రోగి ప్రాణాలను, గర్భాశయాన్ని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ సందర్భంగా మెడికోవర్ వైద్య నిపుణులు మాట్లాడుతూ, అసాధారణమైన యోని రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా అనేక గైనకాలజీ సమస్యలకు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఈ విధానంలో శరీరంపై పెద్ద కోతలు లేకుండా, మచ్చలు లేకుండా చికిత్స అందించడంతో పాటు రోగులు తక్కువ సమయంలోనే కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ విజయవంతమైన చికిత్సకు సంబంధించిన వివరాలను హైటెక్ సిటీలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక వైద్య సాంకేతికతతో మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికోవర్ అందిస్తున్న సేవలను వివరించారు.
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- బీరప్పగడ్డ కమ్యూనిటీ హాల్కు తొలి అంతస్తు.. రూ.15 లక్షలతో నిర్మాణం బీరప్పగడ్డ డివిజన్లోని కమ్యూనిటీ హాల్ తొలి అంతస్తు నిర్మాణ పనులను రూ.15 లక్షలతో చేపడుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనులను పరిశీలించి, వెంటిలేషన్, పెద్ద తలుపులు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.1
- JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party1
- ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి వెల్దుర్తి మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఆలస్యంగా పలకరించిన వరుణుడు ఇప్పుడు వరుసగా కురుస్తుండటంతో పొలాల్లో సందడి నెలకొంది. ట్రాక్టర్లతో భూములను దున్నిస్తూ రైతులు వరి నాట్లకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి వరకు వర్షాభావంతో ఆందోళన చెందిన రైతులు, ప్రస్తుతం అనుకూల వాతావరణం ఏర్పడటంతో సాగు పనులను ముమ్మరం చేశారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే ఈ సీజన్లో మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్దుర్తి మండలంలోని గ్రామాల్లో పొలాలన్నీ వ్యవసాయ పనులతో కళకళలాడుతున్నాయి.1
- వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి, బ్యాంకు, రైతు వేదికల ద్వారా రైతులకు యురియా అందించాలి : తెలంగాణ రైతు సంఘం. వికారాబాద్ : వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి pacs రైతు వేదికల నుండి ప్రభుత్వం రైతులకు యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు ప్రభుత్వం సబ్సిడీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పంపిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఈరోజు బుధవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాలకు వెళ్లి రైతు సంఘం వికారాబాద్ నాయకులు పరిశీలించారు. రైతులు పడుతున్న సమస్యలు తెలుసుకొని ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన ఎరువు ధరలు కాకుండా దళారులు తమ ఇష్టానుసారంగా ఏరియాను డిఏపిని అమ్ముతున్నారని ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.1
- జిన్నారం మండలం బొల్లారం డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో సుమారు రూ.50 లక్షల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.1
- హైడ్రాపై తప్పుడు ప్రచారం.. డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఎం ఆరోపణ హైడ్రాపై సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో కూడా హైడ్రా పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.1
- జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం, మ్యాన్హోల్లో పడి వృద్ధుడు గల్లంతు హైదరాబాద్ –మియాపూర్ వైశాలి నగర్ వద్ద ఉన్న రైల్వే అండర్పాస్ వద్ద తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి గల్లంతైన బాలయ్య(70) అనే వృద్ధుడు ఈ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా నాలా పనులు జరుగుతుండగా, మ్యాన్హోల్ మూసివేయకుండా వదిలేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్ఎఫ్ (NDRF) రక్షక దళాలు2