మెదక్ జిల్లా కేంద్రంలో రేపు ఎల్లుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పెద్దరెడ్డిపేట 90MLD WTP మెయింటనేన్స్ లో భాగంగా మరియు 1000 dia పైప్ లైన్ లీకేజీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున సింగూరు నుండి పట్టణమునకు మంచినీరు సరఫరా నిలిపి వేసినారు. కావున తేదీ *05.03.2026* మరియు *06.03.2026* *రెండు రోజులు* పట్టణములో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగదు. కావున ఇట్టి విషయములో పట్టణ ప్రజలు సహకరించగలరు. కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పురపాలక సంఘము మెదక్.
మెదక్ జిల్లా కేంద్రంలో రేపు ఎల్లుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పెద్దరెడ్డిపేట 90MLD WTP మెయింటనేన్స్ లో భాగంగా మరియు 1000 dia పైప్ లైన్ లీకేజీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున సింగూరు నుండి పట్టణమునకు మంచినీరు సరఫరా నిలిపి వేసినారు. కావున తేదీ *05.03.2026* మరియు *06.03.2026* *రెండు రోజులు* పట్టణములో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగదు. కావున ఇట్టి విషయములో పట్టణ ప్రజలు సహకరించగలరు. కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పురపాలక సంఘము మెదక్.
- కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ రాజేష్ చంద్ర ఏఎస్పి చైతన్య రెడ్డి సిఐ నరహరి ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా వద్ద బుధవారం ఉదయం సౌండ్ పొల్యూషన్ కి కారణమవుతున్న ద్విచక్ర వాహన సైలెన్సర్లను రోడ్డుపై వరుసగా ఉంచి రోడ్డు రోలర్ తో తొక్కించడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు ఎవరైనా అధిక శబ్దాలు చేసే సైలెన్సర్లను వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని పట్టణ సీఐ నరహరి పోలీస్ బృందం వాహనదారులను హెచ్చరించడం జరిగింది.1
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వర్ధన్నపేట ఎమ్మెల్యే మాల ముద్దుబిడ్డ కేఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో మాల కమ్యూనిటీకి సంబంధించిన సమస్యల పైన అసెంబ్లీలో గలమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటూ ఎవరైతే మాల జాతి అభివృద్ధికి నిలబడతారు వారి వెనుక మాల స్టూడెంట్ జేఏసీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల విద్యార్థులు నిరుద్యోగులు మీ వెంట ఉంటారని తెలియజేసార్. ఈ కార్యక్రమం లో మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, బట్టపోతుల మోహన్ nsui, బత్తుల రమేష్, బత్తుల దిలీప్,సాల్వది అనీష్ వర్మ,గడ్డం అంజిబాబు, లావణ్య,నాగరాజు పాల్గొన్నారు.1
- అంతర్ రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. ముధోల్, భైంసాకు చెందిన 10 మంది ముఠా సభ్యులు పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు 10 క్వింటాళ్ల కాపర్ కాల్స్ చోరీ చేయగా, 1.20 క్వింటాళ్ల కాపర్ కాయిల్స్, 2 లక్షల రూ.75 వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు.1
- Post by Balu urban company Employee Ba1
- జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.1
- ధర్మపురి : బుగ్గారం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్ బుగ్గారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని, నిర్మాణ పనులు నాణ్యతతో సాగాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, పోషకాహారం పంపిణీ, పరిశుభ్రతపై ఆదేశాలు జారీ చేశారు. బుగ్గారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి రాబోయే పరీక్షల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు. విద్యార్థులు సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం, బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 90 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపివో, ఎంఈఓ, బుగ్గారం సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పరీక్షల సమయంలో ఒత్తిడి వద్దు: డా.రమణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్యాధికారి డాక్టర్ రమణ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రణాళికబద్ధంగా చదవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు పలు సలహాలు ఇచ్చారు. హెచ్ఎం శోభారాణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్, సోషల్ వర్కర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.1
- నందిపేట్ మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ రావుపై నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అతనిపై దొంగనోట్లు, ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కానిస్టేబుల్పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.1
- I want advertisement urgent hiring job urban company Housekeeping staff jobs1