*అంగన్వాడి కార్మికులకి ఎండల తీవ్రత వలన మే నెల అంత వేసవి సెలవులు ఇవ్వాలని ఐసిడిఎస్ కార్యాలయం ముందు నిరసన* చింతూరు:-31-03-2026:- ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చింతూరు ఐసిడిఎస్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ పోడియం లక్ష్మణ్ మాట్లాడుతూ మే నెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీస్కూల్ పిల్లలు సెంటర్ కు పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ప్రీ స్కూల్ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గర్భని బాలింతలు కూడా సెంటర్ కు రాలేకపోతున్నారు. ఆ సమయంలో అంగన్వాడి వర్కర్లు. హెల్పర్లు. మినీ వర్కర్లు మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్లడానికి వడదెబ్బకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. అందువలన మే నెల అంతా ప్రీస్కూల్ పిల్లలకు. గర్భిణీ బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ఇచ్చి అంగన్వాడీలకు మే నెల అంతా వేసవి సెలవులు అమలు చేయాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడినటువంటి వినతి పత్రానికి ఐసిడిఎస్ కార్యాలయంలో సూపర్వైజర్ సత్యవతికి అందజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి నూక రత్నం. అధ్యక్షులు చిట్టమ్మ. కోశాధికారి భద్రమ్మ. కార్మికులు దుర్గ. సావిత్రి. స్వరూప. సుమలత. పొద్దమ్మ. కిట్టమ్మ. లలిత. వీరమ్మ. తదితరులు పాల్గొన్నారు.
*అంగన్వాడి కార్మికులకి ఎండల తీవ్రత వలన మే నెల అంత వేసవి సెలవులు ఇవ్వాలని ఐసిడిఎస్ కార్యాలయం ముందు నిరసన* చింతూరు:-31-03-2026:- ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చింతూరు ఐసిడిఎస్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ పోడియం లక్ష్మణ్ మాట్లాడుతూ మే నెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీస్కూల్ పిల్లలు సెంటర్ కు పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ప్రీ స్కూల్ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గర్భని బాలింతలు కూడా సెంటర్ కు రాలేకపోతున్నారు. ఆ సమయంలో అంగన్వాడి వర్కర్లు. హెల్పర్లు. మినీ వర్కర్లు మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్లడానికి వడదెబ్బకు గురై అనారోగ్యం పాలవుతున్నారు. అందువలన మే నెల అంతా ప్రీస్కూల్ పిల్లలకు. గర్భిణీ బాలింతలకు టేక్ హోమ్ రేషన్ ఇచ్చి అంగన్వాడీలకు మే నెల అంతా వేసవి సెలవులు అమలు చేయాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడినటువంటి వినతి పత్రానికి ఐసిడిఎస్ కార్యాలయంలో సూపర్వైజర్ సత్యవతికి అందజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యదర్శి నూక రత్నం. అధ్యక్షులు చిట్టమ్మ. కోశాధికారి భద్రమ్మ. కార్మికులు దుర్గ. సావిత్రి. స్వరూప. సుమలత. పొద్దమ్మ. కిట్టమ్మ. లలిత. వీరమ్మ. తదితరులు పాల్గొన్నారు.
- Post by V Ramarao2
- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- Post by Shyam1
- Post by SS NEWS1
- గిరి గ్రామాలలో ఇటుకల పండగ ప్రస్తుతం ఘనంగా కొనసాగుతోంది. ఈ పండగను గిరిజనులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. పండగ ప్రారంభానికి ముందు గ్రామ పూజారి (గురుమై) ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక గుడ్డును ప్రతిష్ఠిస్తారు. అనంతరం గ్రామస్తులు రాళ్లతో ఆ గుడ్డును పగలగొట్టేందుకు ప్రయత్నిస్తారు. గుడ్డును పగలగొట్టిన వ్యక్తిని ప్రత్యేకంగా సత్కరించి ఊరేగింపు నిర్వహిస్తారు. అంతేకాకుండా విజేతకు నగదు బహుమతి కూడా అందజేస్తారు.1
- హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- Post by V Ramarao1