కృష్ణాజిల్లా ఉయ్యూరులో గంజాయి విక్రయిస్తూ పదిమంది అరెస్ట్ ఉయ్యూరులో గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముఠా అరెస్ట్ – 4 కేజీల గంజాయి, 2 బైకులు స్వాధీనం.ఉయ్యూరు మండలం ఉయ్యూరు పట్టణంలో పోలీస్ స్టేషన్లో సిఐ రామారావ్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఐ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పర్యవేక్షణలో ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మోటార్ సైకిల్ దొంగతనం అనుమానంతో గోశాల వద్ద షేక్ కాలీషా అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ విస్తృత గంజాయి సరఫరా నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. ఉయ్యూరు పరిసర ప్రాంతాలకు చెందిన 10 మంది యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 4 కేజీల గంజాయి, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణాజిల్లా ఉయ్యూరులో గంజాయి విక్రయిస్తూ పదిమంది అరెస్ట్ ఉయ్యూరులో గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముఠా అరెస్ట్ – 4 కేజీల గంజాయి, 2 బైకులు స్వాధీనం.ఉయ్యూరు మండలం ఉయ్యూరు పట్టణంలో పోలీస్ స్టేషన్లో సిఐ రామారావ్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిఐ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పర్యవేక్షణలో ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మోటార్ సైకిల్ దొంగతనం అనుమానంతో గోశాల వద్ద షేక్ కాలీషా అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ విస్తృత గంజాయి సరఫరా నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. ఉయ్యూరు పరిసర ప్రాంతాలకు చెందిన 10 మంది యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 4 కేజీల గంజాయి, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
- రూ.2కోట్ల 74 లక్షలతో సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు పాలకొల్లు మండలం, పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్ వద్ద రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..1
- రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వార్యాలతో విలసిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాను.. వేడుకలను పురస్కరించుకుని మండపాలు ఏర్పాటు చేసేవారు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, పెద్ద శబ్దాలు లేకుండా డీజేలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పూర్తిగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా, పరస్పర సౌభ్రాతృత్వంతో ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను..2
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పవిత్ర సంగమం వద్ద జల హారతికి హాజరైన భక్తులు పవిత్ర సంగమం వద్ద సందర్శికుల తాకిడి పండగ రోజు కావడంతో హారతి దర్శనకు భారీగా హాజరైన ప్రజలు హారతి దర్శించుకున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని చైర్మన్ ను కోరిన భక్తులు మున్సిపల్ నిధులతో త్వరలో పవిత్ర సంగమం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని చైర్మన్ హామీ వినాయక చవితి పండగ కావడంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద హారతి కు సందర్శకులు భారీగా హాజరయ్యారు. హారతి దర్శించుకుని పరవశించారు. హారతి దర్శనకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హాజరై దర్శించుకున్నారు. ప్రజల మధ్య కూర్చొని పవిత్ర హారతి సందర్శించుకున్నారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు పాత సినిమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సందర్శకులు చైర్మన్ కు పవిత్ర సంగమం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో,చీకట్లో రాకపోకలు ఇబ్బందికరంగా మారాయని, మంచినీరు లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో అధికారులతో మాట్లాడి మున్సిపల్ నిధులతో పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పవిత్ర సంగమానికి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి అప్సర్, కో- ఆప్షన్ సభ్యులు మహబూబ్ సుభాని, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.1
- నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి. సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...2
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..1
- 69 మంది లబ్ధిదారులకు 72.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మంత్రి సత్యప్రసాద్. రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 69 మంది లబ్ధిదారులకు 72,89,587 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు.1
- జైనూర్లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.1
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2004, 2009లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఆళ్ల నాని అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.1