పాకాల సరస్సుకు ఏకో టూరిజం హబ్గా రూపుదిద్దే చర్యలు – పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు, బోటు షికారు విస్తరణ – డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ వెల్లడి వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకాల సరస్సుకు ఏకో టూరిజం హబ్గా రూపుదిద్దే చర్యలు – పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు, బోటు షికారు విస్తరణ – డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ వెల్లడి వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును
మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
- మహబూబాబాద్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల పాఠశాల విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దూషిస్తున్నారని ఆరోపించారు. ప్రిన్సిపాల్ను వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమస్య పరిష్కారం వరకు గురుకులానికి వెళ్లబోమని విద్యార్థులు స్పష్టం చేశారు.1
- అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా మారింది టమాటా రైతుల పరిస్థితి. కిలో టమాట ధర రూపాయికి పడిపోవడంతో కరీంనగర్ జిల్లాలో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కూలీ కూడా గిట్టుబాటు కాక పంట చేల్లోనే టమాటను వదిలేస్తున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో దాదాపు 25 ఎకరాలలో రైతులు టమాట పంటను సాగు చేశారు. ఓవైపు కోతుల బెడద, మరోవైపు పకృతి వైపరీత్యాలను తట్టుకుని పంటను పండిస్తే చివరకు చేతికందిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధరలేని పరిస్థితి ఏర్పడింది. కిలో టమాట ధర రూపాయి నుంచి రెండు రూపాయలు మాత్రమే పలుకుంది. ధర పడిపోవడంతో రైతులకు కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమాటాను తెంపకుండా చేల్లోనే వదిలేస్తున్నారు. టమాటా పంట వేసి తీవ్ర నష్టాలను కొని తెచ్చుకున్నామని టమాటా రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటను చేనులోనే వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి సుమారు 50 వేల వరకు పెట్టుబడి పెట్టినప్పటికీ, మార్కెట్లో కిలోకు రూపాయి నుంచి 2 రూపాయల వరకు మాత్రమే ధర లభిస్తుందని, దీంతో ఖర్చులు కూడా రాక పంటను చేల్లోనే వదిలేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదంటున్నారు రైతు గుండు అంజయ్య. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని లేదంటే తగిన నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.2
- కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం పరిధిలో ఉన్న తుర్ఖాసినగర్ రైల్వే గేట్ వద్ద నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం అయిన కరీంనగర్ నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ రైల్వే గేట్ ఉండటంతో ప్రతిరోజూ రైళ్లు రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల నుండి కరీంనగర్కు అత్యవసర వైద్యం కోసం రోగులను తరలిస్తున్న అంబులెన్సులు కూడా ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుండటంతో ప్రాణాపాయం ఏర్పడుతున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.1
- ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల గ్రామమును సోలార్ మోడల్ విలేజ్ ఎంపికైన సందర్భంగా సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన TGSPDCL-CMD గౌరవ శ్రీ ముషరఫ్ అలీ ఫరూక్ IAS మరియు నల్గొండ జిల్లా సబ్-కలెక్టర్ శ్రీ అమిత్ నారాయన్ IAS గారితో పాటు హాజరై అనుముల గ్రామానికి 41.63 కోట్ల రూపాయలతో సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ,సౌర విద్యుత్ వలన ఉన్న లాభాలను,కరెంటు వినియోగించుకునే పద్ధతులను రైతులకు మరియు ప్రజలకు సవివరంగా తెలియజేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారు1
- Post by Sk Noori4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ బిఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం, పార్టీ లోపలే విభేదాలు రెచ్చగొట్టడం, స్వార్థ ఎజెండాతో వ్యవహరించడం బిఆర్ఎస్ నేతల లక్ష్యమైందని ఆయన ఆరోపించారు. Bharat Rashtra Samithi లో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉద్యమకారులకు, నిజమైన కేడర్కు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని, తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టే రాజకీయాలు నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. “పార్టీ పతనం కోసం లోపలే కుయుక్తులు పన్నేవాడు నాయకుడా?” అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మచ్చలేని నాయకుడు Raghunandan Rao కోటి రూపాయలు తీసుకుని వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలు చేసిన వారు గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం వద్ద వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. “నిజం ఉంటే దేవాలయం వద్ద ప్రమాణం చేయి… లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకో” అని ఘాటుగా హెచ్చరించారు. గతంలో K. Chandrashekar Rao ను ఓడించాలని T. Harish Rao ఫోన్ చేశారని ప్రచారం చేసి, బిఆర్ఎస్ నేతల వద్ద ఎంత డబ్బులు దోచుకున్నావో గజ్వేల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇతరులపై ఆరోపణలు చేసి డబ్బులు సంపాదించడం నీ రాజకీయ జీవన విధానమా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ పంపకాలపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో జరిగిన రచ్చను ప్రజలు మర్చిపోలేదన్నారు. “బ్లాక్మెయిల్ రాజకీయాలతో జీవితం గడిపేవాడిని ప్రజలు ఇక నమ్మరు” అని భైరి శంకర్ ముదిరాజ్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, ఎల్కంటి సురేష్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నత్తి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.4
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మర్రిగూడ గ్రామంలో నాగులమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. స్థానికుల కథనాల ప్రకారం, సమ్మక్క సోదరిగా భావించే నాగులమ్మ పగిడిద్దరాజును వివాహం చేసుకున్నారని ప్రచారం ఉంది. వీరి కుమారులు జంపన్న, మువ్వన్న కాకతీయులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడారని చెబుతారు. జంపన్న వాగు వద్ద నాగులమ్మ వీరమరణం పొందినట్లు పురాణ కథనం. అమ్మవారి ఆశీస్సులతో సంతానం, విద్య, ఉద్యోగం, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆందోళనకు గురిచేస్తుంది. రైతులను రోడ్డెక్కించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మానేర్, మోయతుమ్మెద, మూల వాగుల్లో ప్రభుత్వం ఇసుక రీచ్ ల ఏర్పాటు చేసి ప్రభుత్వ అవసరాలకు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేస్తుంది. ఆన్లైన్ పద్ధతిలో ఇసుక రవాణా చేసే అవకాశం ఉన్నప్పటికీ అక్రమార్కులు కొందరు ఇందిరమ్మ ఇళ్ల టోకెన్ల పేరుతో అక్రమ దందా సాగిస్తున్నారు. సక్రమం కంటే అక్రమంగా భారీ ఎత్తున ఇసుక రవాణా జరుగుతుండడంతో వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి, బొల్లారం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. మూలవాగు నుంచి ఇసుక రవాణా చేసే 400 ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ అనుమతితోనే ఇసుక రవాణా చేస్తున్నామని ట్రాక్టర్ యాజమానులు, డ్రైవర్లు చెప్పినప్పటికీ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడగంటి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు నిరసనతో ఆందోళనకు దిగారు. ఇసుక రీచ్ వల్ల పంటలు కోల్పోయో పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తీయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూరల్ తహశిల్దార్ అబూకర్ అక్కడికి చేరుకోగా పర్మిషన్ ఎలా ఇస్తారని రైతులు నిలదీశారు. రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు. పంటలు చేతికందేవరకూ వాగుల నుంచి ఇసుక తీయొద్దని రైతులు డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.4
- మునుగోడు లో వైన్ షాపుల సమయపాలన నిర్వహణ తీరును పరిశీలించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు.. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి పరిసరాలను పరిశీలించారు.. సాయంత్రం 6 గంటల వరకు పర్మిట్ రూమ్ లో గాని చుట్టు పరిసరాల ప్రాంతాల్లో ఎవ్వరు కూడా మందు తాగొద్దని వైన్ షాప్ నిర్వాహకులకు మరో మారు గట్టిగా చెప్పారు... వైన్ షాపుల సమయపాలన నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు..1