గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 16 ఐ 3 న్యూస్ /* *తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మారుతున్నాయి.* *తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి...* *కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్..* *జి విజయ్ కుమార్* ప్రజలు ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులపై ప్రలోభాలు, ఒత్తిడులు, అధికార దుర్వినియోగం జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా తీర్పును వక్రీకరించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే. గెలవలేకపోతే ఇతర మార్గాలు అన్వేషించడం అనే రాజకీయ సంస్కృతి తెలంగాణ ప్రజలు అంగీకరించరు. అధికార అహంకారంతో ప్రజల నిర్ణయాన్ని మార్చాలనుకోవడం సరైంది కాదు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు జరిగితే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజా బలమే అసలు బలం — డబ్బు లేదా ఒత్తిడి కాదు. ప్రజల గళం ఎప్పటికీ మౌనంగా ఉండదు. ప్రజా తీర్పే తుది తీర్పు. *జై కెసిఆర్ జై కేటీఆర్ జై హరీష్ అన్న జై అంజన్న*
గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 16 ఐ 3 న్యూస్ /* *తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మారుతున్నాయి.* *తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి...* *కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్..* *జి విజయ్ కుమార్* ప్రజలు ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులపై ప్రలోభాలు, ఒత్తిడులు, అధికార దుర్వినియోగం జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా తీర్పును వక్రీకరించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే. గెలవలేకపోతే ఇతర మార్గాలు అన్వేషించడం అనే రాజకీయ సంస్కృతి తెలంగాణ ప్రజలు అంగీకరించరు. అధికార అహంకారంతో ప్రజల నిర్ణయాన్ని మార్చాలనుకోవడం సరైంది కాదు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు జరిగితే వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజా బలమే అసలు బలం — డబ్బు లేదా ఒత్తిడి కాదు. ప్రజల గళం ఎప్పటికీ మౌనంగా ఉండదు. ప్రజా తీర్పే తుది తీర్పు. *జై కెసిఆర్ జై కేటీఆర్ జై హరీష్ అన్న జై అంజన్న*
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.2
- మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతాప్ సింగారం లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలకు పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుదీర్ రెడ్డి గపాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు, మరియు ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయిలేష్ యాదవ్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, సోమయ్య, బద్దం సాయిరాం రెడ్డి, కర్ణాకర్ తదితరులతో పాటు వివిధ మున్సిపల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- మేడ్చల్–మల్కాజిగిరి, జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు బండమాదారం 19వ వార్డు కౌన్సిలర్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, గుమ్మడిదల మహేశ్వరి, 6వ వార్డు కౌన్సిలర్ రాజేష్, 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై ఎంపీతో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను ఎంపీ అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.3
- Mattress Manufacturers Company in Hyderabad LB Nagar Kamineni Hospital Back1
- తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపింది.ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.1
- Beef is being sold openly near Darushifa Ground, right where Metro Rail work is in progress. GHMC needs to instruct these Everyday shop open 8:pm1
- కదులుతున్న రైలుపై విమానం ల్యాండింగ్: ఇటలీ పైలట్ సాహసం! గాలిలో సాహస విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఇటలీ పైలట్ డారియో కోస్టా తాజాగా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక కార్గో రైలు కంటైనర్పై తన విమానాన్ని అత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేసి, మరుక్షణమే టేకాఫ్ అయ్యారు. కేవలం కొద్ది మీటర్ల వెడల్పు ఉన్న కంటైనర్ను రన్వేగా మార్చుకుని ఆయన చేసిన ఈ సాహసం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత ప్రమాదకరమైన ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.1