వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే: బెల్లంకొండ వెంకటేశ్వర్లు.. రత్నవరం (నడిగూడెం మండలం), సెప్టెంబర్ 16: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం దొరలు, జాగీర్దారులకు వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఈ పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మతోన్మాద శక్తులు వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. నైజాం పాలనలో జమీందారులు, భూస్వాములు, రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వృత్తిదారులు ఎర్రజెండా నాయకత్వంలో సాగించిన మహోన్నత పోరాటమే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని పేర్కొన్నారు. ఈ పోరాట ఫలితంగా లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందని, వేలాది గ్రామాలు విముక్తి పొంది గ్రామ స్వరాజ్యాలుగా అవతరించాయని, వేలాది మంది అమరుల త్యాగాలతో కౌలుదారుల హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. నేడు అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయని విమర్శించారు. సాయుధ పోరాట స్ఫూర్తితో భూమి, ఇళ్ల స్థలాలు, గృహాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు కామ్రేడ్ పగడాల రామ్రెడ్డి, కన్నెబోయిన లింగయ్య, కన్నెబోయిన నరసయ్య చిత్రపటాలకు గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్లు పగడాల పద్మా ప్రభాకర్రెడ్డి, పసుపులేటి వినయవర్ధన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్య, మొలుగూరి సురేష్, బుచ్చిరెడ్డి, సోమా వీరయ్య, కాసాని శ్రీనివాసరావు, కూరాకుల కృష్ణమూర్తి, పల్లి సంజీవరెడ్డి, కన్నెబోయిన భాస్కరరావు, మొలుగూరి సైదులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే: బెల్లంకొండ వెంకటేశ్వర్లు.. రత్నవరం (నడిగూడెం మండలం), సెప్టెంబర్ 16: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం దొరలు, జాగీర్దారులకు వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఈ పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మతోన్మాద శక్తులు వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. నైజాం పాలనలో జమీందారులు, భూస్వాములు, రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వృత్తిదారులు ఎర్రజెండా నాయకత్వంలో సాగించిన మహోన్నత పోరాటమే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని పేర్కొన్నారు. ఈ పోరాట ఫలితంగా లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందని, వేలాది గ్రామాలు విముక్తి పొంది గ్రామ స్వరాజ్యాలుగా అవతరించాయని, వేలాది మంది అమరుల త్యాగాలతో కౌలుదారుల హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. నేడు అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయని విమర్శించారు. సాయుధ పోరాట స్ఫూర్తితో భూమి, ఇళ్ల స్థలాలు, గృహాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులు కామ్రేడ్ పగడాల రామ్రెడ్డి, కన్నెబోయిన లింగయ్య, కన్నెబోయిన నరసయ్య చిత్రపటాలకు గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్లు పగడాల పద్మా ప్రభాకర్రెడ్డి, పసుపులేటి వినయవర్ధన్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్య, మొలుగూరి సురేష్, బుచ్చిరెడ్డి, సోమా వీరయ్య, కాసాని శ్రీనివాసరావు, కూరాకుల కృష్ణమూర్తి, పల్లి సంజీవరెడ్డి, కన్నెబోయిన భాస్కరరావు, మొలుగూరి సైదులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..1
- సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణా ప్రాంతం నిజాం నవాబు కబంధ హస్తాలలో మగ్గిందన్నారు.తెలంగాణా ప్రాంతానికి కూడా విముక్తి కావాలని పోరాడిన అమర వీరులకు గౌరవం రావాలని బీజేపీ ఉద్యమం చేస్తుంది.ఖమ్మం జిల్లా లో తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ నిజాం నవాబు కు వ్యతిరేకంగా సంపాదకీయం రాసినందుకు ఆయన్ను హతం చేశారని తెలిపారు. షోయబుల్లాఖాన్ జన్మించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు.1
- పడగవిప్పి కదలకుండా కనువిందు చేసిన నాగుపాము............ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జాతీయ రహదారిపై నాగుపాము హల్ చల్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.పడగవిప్పి కదలకుండా కనువిందు చేస్తూ కనిపించిన నాగుపామును స్థానికులు ఆసక్తికరంగా తిలకించారు.అరగంట పాటు ఆసక్తిగా తిలకించిన వాహనదారులు పాదాచారులు దానంతట అదే రోడ్డు దాటి ఓపెన్ ప్లాట్ లలోని చెట్ల పొదల్లోకి నాగుపాము వెళ్లిన తర్వాత ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర 8,911రూ.గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పాత పత్తి రూ.100 తగ్గింది. కొత్త పత్తి రూ.100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ప్రజా గోంతుక మల్లన్న గా మీ ముందుకు బిసి యాత్ర ఆకుల హనుమాండ్లు1
- రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ మా హయాంలో అక్రమాలు జరిగినయ్ అంటున్నావ్ కదా, నీ హయాంలో జరిగిన అక్రమాలపై, మా మీద నువ్వు వేస్తున్న ఆరోపణలపై సుప్రీమ్ కోర్టు జడ్జితో విచారణకు మేము సిద్ధం..నువ్వు సిద్ధమా?2
- ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కిక్కిరిసింది. వరుస సెలవులు ముగిశాక ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 9గంటలకే క్యూ మొదలైంది. అలాగే, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఓపీ కూడా రద్దీగా మారింది.1
- తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా తాతకు 3300 ఎకరాల భూమి ఉండేది మా తాతకు ముగ్గురు భార్యలు ఒక్కో భార్యకు 1100 ఎకరాలు భూమి ఇచ్చాడు - టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్1
- గణనాధుడి సేవలో కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఘనంగా గంగమ్మ తల్లి ఒడికి గణనాథుని పంపుతున్న పోలీసులు ఉత్సవాలకు కుల మతాలు, అధికార తారతమ్యాలు లేవని పోలీసులు రుజువు చేశారు... విజ్ఞాలను తొలగించే గణనాథుడిని సాంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఆ గణనాథుడి విగ్రహ ఊరేగింపు అత్యంత ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు... కాచిగూడ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది కలిసి ఆడుతూ పాడుతూ ఆ గణనాథుడి విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో సందడి చేశారు... హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కలిసి గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు గణనాథుడికి సాంప్రదాయపద్ధంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు... కాచిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కౌశిక్ నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది కలిసి బ్యాండ్ మేళా కనుగొనగా నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు....3