logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆగస్టు 14న భారత హర్ ఘర్ తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ..బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు.. పాల్గొనాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు తార్నాకలోని తన నివాసం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి తిరంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. భారతదేశ ఐక్యమత్యాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి ఆగస్టు 14న నిర్వహించే హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొని దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

14 hrs ago
user_DASU GANESH  REPORTER
DASU GANESH REPORTER
తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
14 hrs ago
5e9ad3b2-4f14-4ae1-8606-c1765b0ce441

ఆగస్టు 14న భారత హర్ ఘర్ తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ..బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు.. పాల్గొనాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు తార్నాకలోని తన నివాసం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి తిరంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. భారతదేశ ఐక్యమత్యాన్ని చాటేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేసి ఆగస్టు 14న నిర్వహించే హర్ ఘర్ తిరంగా యాత్రలో పాల్గొని దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • అన్నం పెట్టినోడినే మరిచారు: రేవంత్ పై పోచారం తిరుగుబాటు! బాన్సువాడను కేసీఆర్ అభివృద్ధి చేశారని, మంత్రులు ఫోన్ చేసినా ఎత్తడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జెండా కప్పుకోకపోవడమే మంచిదైందని, మొన్న దానం, నేడు పోచారం అంటూ రేవంత్ రెడ్డిపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    1
    అన్నం పెట్టినోడినే మరిచారు: రేవంత్ పై పోచారం తిరుగుబాటు!
బాన్సువాడను కేసీఆర్ అభివృద్ధి చేశారని, మంత్రులు ఫోన్ చేసినా ఎత్తడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జెండా కప్పుకోకపోవడమే మంచిదైందని, మొన్న దానం, నేడు పోచారం అంటూ రేవంత్ రెడ్డిపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    24 min ago
  • అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను: పోచారం శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను! మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది అని నేనే చెప్తున్నాను అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్న మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు పొంగులేటి, భట్టి సీఎం మాటలు వినడం లేదు మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా నేను నీకు అమ్ముడుపోయానా నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని అడిగాను - ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
    1
    అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను: పోచారం శ్రీనివాస్ రెడ్డి
అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను!
మరోసారి రేవంత్ పై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు
కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది అని నేనే చెప్తున్నాను
అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది
కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది
నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదు
నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను
ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెబితేనే జాతీయ కండువా కప్పుకున్న
మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు
పొంగులేటి, భట్టి సీఎం మాటలు వినడం లేదు
మంత్రులు పట్టించుకోవడం లేదంట, నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెబితే ఆయన కూడా పట్టించుకోలేదు
వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు
నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా
నేను నీకు అమ్ముడుపోయానా నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా అని అడిగాను
- ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    1 hr ago
  • బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు 🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ 🕉️ 📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ
    1
    బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో దమ్మాయిగూడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీ నందీశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

🪷 బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేష పూజలు
🙏 ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు
ఈ సందర్భంగా నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రదోష కాలంలో శివారాధనకు విశిష్టత ఉండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఓం నమః శివాయ 🙏
హర హర మహాదేవ 🕉️
📍 శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, దమ్మాయిగూడ
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    20 hrs ago
  • ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజుల బోనాలు వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పటాన్‌చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. డప్పుల మోతలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి. ఈ వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    పటాన్‌చెరులో ఘనంగా ముదిరాజుల బోనాలు

వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. డప్పుల మోతలు, భక్తిగీతాలతో పరిసరాలు మార్మోగాయి.
ఈ వేడుకల్లో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • కాంగ్రెస్ వరుణయాగంపై జగదీష్ రెడ్డి కౌంటర్ - ఎల్‌నినోపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వరుణయాగం పాపం చేసి చేతులు కడుకున్నట్టు ఉంది కాంగ్రెస్ వరుణయాగంపై జగదీష్ రెడ్డి కౌంటర్ ఎల్‌నినోపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం ఏంటి? వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేసి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని త్వరలోనే ఆధారాలతో బయటపెడతా – జగదీష్ రెడ్డి
    1
    కాంగ్రెస్ వరుణయాగంపై జగదీష్ రెడ్డి కౌంటర్ - ఎల్‌నినోపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం ఏంటి? 
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వరుణయాగం పాపం చేసి చేతులు కడుకున్నట్టు ఉంది
కాంగ్రెస్ వరుణయాగంపై జగదీష్ రెడ్డి కౌంటర్
ఎల్‌నినోపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఇప్పుడు గాల్లో దీపం పెట్టడం ఏంటి? 
వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేసి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని త్వరలోనే ఆధారాలతో బయటపెడతా
– జగదీష్ రెడ్డి
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    35 min ago
  • కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో సోమవారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్‌చల్ సృష్టించాడు. కొబ్బరి బొండాలు కోసే కత్తిని చేతిలో పట్టుకుని కాలనీలో తిరుగుతూ హంగామా చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన కాలనీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. యువకుడు కత్తితో ఎందుకు హల్‌చల్ చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
    1
    కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తితో యువకుడి హల్‌చల్.. కాలనీవాసుల్లో భయాందోళన
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో సోమవారం రాత్రి ఓ యువకుడు కత్తితో హల్‌చల్ సృష్టించాడు. కొబ్బరి బొండాలు కోసే కత్తిని చేతిలో పట్టుకుని కాలనీలో తిరుగుతూ హంగామా చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
పరిస్థితిని గమనించిన కాలనీవాసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. యువకుడు కత్తితో ఎందుకు హల్‌చల్ చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.