//గంజాయి కేసులో 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.// 🚩గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే దిశగా జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రదేశాలు, పాత నేరస్తులు మరియు అనుమానితులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍ఈ చర్యలలో భాగంగా సౌత్ పోలీస్ సబ్ డివిజన్ ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీ బి. మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో నల్లపాడు సీఐ కె. వంశీధర్ గారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్సై పి. మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 📍ఈ క్రమంలో 11.03.2026 తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, నల్లపాడు పోలీసులు మరియు CCS పోలీస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 📍వారిపై Cr.No.195/2026, U/Sec 8(C) r/w 20(b)(ii)(B)(A) NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 👉గంజాయి సరఫరాదారులు: 1. తోట గోపాలకృష్ణ @ సాయి (32), చౌడవరం, గుంటూరు రూరల్ (ఇతనిపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది) 2. కొల్లూరి నంధీశ్వర్ @ వరికూటి గౌరి శంకర్ (32), నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. 👉 గంజాయి కొనుగోలు చేసి విక్రయించే వారు / మత్తు బిళ్ళలు విక్రయించే వారు: 3. షేక్ ఉస్మాన్ (23), పాత గుంటూరు 4. షేక్ సనావుల్లా @ ఇర్ఫాన్ (24), కొత్తపేట, గుంటూరు 5. పటాన్ జానీ బాషా (30), వెంకటరావుపేట, పాత గుంటూరు 6. పోతార్లంక శ్యామ్ (26), అల్లీనగర్, పాత గుంటూరు 👉 గంజాయి వినియోగదారులు: 7. బత్తుల నాగరాజు (32), లాలాపేట్ 8. చల్లా వెంకటేశ్వర్లు (32), సాయిబాబా కాలనీ 9. నక్కా సాంబశివరావు (25), సాయిబాబా కాలనీ 10. కొడవటి హనోక్ (24), అల్లీనగర్. 11. షేక్ జబ్బార్ (25), చంద్రబాబు నాయుడు కాలనీ 12. బజంత్రీ దుర్గాప్రసాద్ @ అమ్ము (29), ఆనందపేట 13. చల్లా వెంకటేష్ @ చాపా (19), లాలాపేట్ 14. కనిగిరి నాగరాజు @ పిల్లి (26), లాలాపేట్ 👉 కేసు వివరాలు: 📍దర్యాప్తులో A1 మరియు A2 నిందితులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తినుబండారాలు విక్రయిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తరలించి, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో A1 ఇంటివద్ద నిల్వ ఉంచి, గుంటూరు నగరంలో గంజాయి విక్రయించే వారికి (A3–A6) మరియు వినియోగదారులకు (A7–A14) విక్రయిస్తున్నట్లు తేలింది. 📍 ది.06.03.2026 తేదీన నిందితులు ఒడిశాకు వెళ్లి 8 కిలోల గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 📍 ది.11.03.2026 తేదీన చోడవరం గ్రామంలో A1 ఇంటి వద్ద గంజాయి విక్రయం జరుగుతుండగా నల్లపాడు మరియు CCS పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి మొత్తం 7600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 📍దర్యాప్తులో A3 నుండి A6 నిందితులు ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు నగరంలోని అమాయక ప్రజలకు మత్తు బిళ్ళలు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. 📍గంజాయి సరఫరా, విక్రయం, వినియోగం మరియు అనధికారికంగా మత్తు బిళ్ళలు విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. ఇప్పటివరకు గత అక్టోబర్ నుండి గుంటూరు జిల్లాలో 34 కార్డెన్ సెర్చ్ లు 120 సంకల్పం ప్రోగ్రామ్స్ 8 మంది పై పీ డి యాక్ట్ కేసులు 51 NDPS కేసుల్లో 300 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపడమైనది గంజాయి కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని, గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు విశేష కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 👉ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడంలో మార్గనిర్దేశం చేసిన ఇన్చార్జ్ SDPO సౌత్ శ్రీ బి. మధుసూదన్ రావు గారిని, నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన SHO/CI కె. వంశీధర్ గారు, SI పి. మహేష్ కుమార్ గారు, నల్లపాడు పోలీస్ సిబ్బంది మరియు CCS సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు అభినందించారు.
//గంజాయి కేసులో 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.// 🚩గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే దిశగా జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రదేశాలు, పాత నేరస్తులు మరియు అనుమానితులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍ఈ చర్యలలో భాగంగా సౌత్ పోలీస్ సబ్ డివిజన్ ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీ బి. మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో నల్లపాడు సీఐ కె. వంశీధర్ గారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్సై పి. మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 📍ఈ క్రమంలో 11.03.2026 తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, నల్లపాడు పోలీసులు మరియు CCS పోలీస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 📍వారిపై Cr.No.195/2026, U/Sec 8(C) r/w 20(b)(ii)(B)(A) NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 👉గంజాయి సరఫరాదారులు: 1. తోట గోపాలకృష్ణ @ సాయి (32), చౌడవరం, గుంటూరు రూరల్ (ఇతనిపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది) 2. కొల్లూరి నంధీశ్వర్ @ వరికూటి గౌరి శంకర్ (32), నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. 👉 గంజాయి కొనుగోలు చేసి విక్రయించే వారు / మత్తు బిళ్ళలు విక్రయించే వారు: 3. షేక్ ఉస్మాన్ (23), పాత గుంటూరు 4. షేక్ సనావుల్లా @ ఇర్ఫాన్ (24), కొత్తపేట, గుంటూరు 5. పటాన్ జానీ బాషా (30), వెంకటరావుపేట, పాత గుంటూరు 6. పోతార్లంక శ్యామ్ (26), అల్లీనగర్, పాత గుంటూరు 👉 గంజాయి వినియోగదారులు: 7. బత్తుల నాగరాజు (32), లాలాపేట్ 8. చల్లా వెంకటేశ్వర్లు (32), సాయిబాబా కాలనీ 9. నక్కా సాంబశివరావు (25), సాయిబాబా కాలనీ 10. కొడవటి హనోక్ (24), అల్లీనగర్. 11. షేక్ జబ్బార్ (25), చంద్రబాబు నాయుడు కాలనీ 12. బజంత్రీ దుర్గాప్రసాద్ @ అమ్ము
(29), ఆనందపేట 13. చల్లా వెంకటేష్ @ చాపా (19), లాలాపేట్ 14. కనిగిరి నాగరాజు @ పిల్లి (26), లాలాపేట్ 👉 కేసు వివరాలు: 📍దర్యాప్తులో A1 మరియు A2 నిందితులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తినుబండారాలు విక్రయిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తరలించి, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో A1 ఇంటివద్ద నిల్వ ఉంచి, గుంటూరు నగరంలో గంజాయి విక్రయించే వారికి (A3–A6) మరియు వినియోగదారులకు (A7–A14) విక్రయిస్తున్నట్లు తేలింది. 📍 ది.06.03.2026 తేదీన నిందితులు ఒడిశాకు వెళ్లి 8 కిలోల గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 📍 ది.11.03.2026 తేదీన చోడవరం గ్రామంలో A1 ఇంటి వద్ద గంజాయి విక్రయం జరుగుతుండగా నల్లపాడు మరియు CCS పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి మొత్తం 7600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 📍దర్యాప్తులో A3 నుండి A6 నిందితులు ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు నగరంలోని అమాయక ప్రజలకు మత్తు బిళ్ళలు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. 📍గంజాయి సరఫరా, విక్రయం, వినియోగం మరియు అనధికారికంగా మత్తు బిళ్ళలు విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. ఇప్పటివరకు గత అక్టోబర్ నుండి గుంటూరు జిల్లాలో 34 కార్డెన్ సెర్చ్ లు 120 సంకల్పం ప్రోగ్రామ్స్ 8 మంది పై పీ డి యాక్ట్ కేసులు 51 NDPS కేసుల్లో 300 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపడమైనది గంజాయి కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని, గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు విశేష కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 👉ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడంలో మార్గనిర్దేశం చేసిన ఇన్చార్జ్ SDPO సౌత్ శ్రీ బి. మధుసూదన్ రావు గారిని, నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన SHO/CI కె. వంశీధర్ గారు, SI పి. మహేష్ కుమార్ గారు, నల్లపాడు పోలీస్ సిబ్బంది మరియు CCS సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు అభినందించారు.
- Post by Anji Raju1
- L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- నల్గొండ బ్రేకింగ్: నల్లగొండలో మొన్న జరిగిన యాక్సిడెంట్ కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారి... యాక్సిడెంట్లో తీవ్ర గాయపడిన ముద్దస్సిర్ ఉద్దీన్ ఖాన్ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచాడు... నేడు హైదరాబాద్ పట్టణంలో చికిత్స పొందుతూ మరణించిన ముదస్సిర్ ను భారీ నిరసన ర్యాలీతో వీటి కాలనీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు తీసుకొని వచ్చారు... నిరసనగా కుటుంబ సభ్యులు నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు... యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకోకుండా వదిలివేయడం ఏంటని నిరుత్సాహపరిచారు కుటుంబ సభ్యులు... వెంటనే ఆక్సిడెంట్ లో గాయపడిన మహిళకు మరియు ముదస్సిర్ ఖాన్ కుటుంబం కు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా నిరసన.. వీరికి మద్దతుగా నలగొండ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియోద్దీన్ మరియు ఏఐఎంఐఎం కార్పొరేటర్లు నదీమ్, హాజీ, మోయిన, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ మరియు టిఆర్ఎస్ మైనార్టీ నాయకులు జహంగీర్ బాబా, జమాల్ ఖాద్రి కాంగ్రెస్ మైనారిటీ కార్పొరేటర్లు మద్దతుగా ఉన్నారు.. డిప్యూటీ మేయర్ ఆమెర్ మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి బాధితుడికి 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని, ప్రమాదంలో గాయపడిన వారికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తమకు పూర్తి న్యాయం జరిగేవరకు తమ వెంటే ఉంటామని ధైర్యం వ్యక్తం చేశారు.. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు పూర్తి భరోసా లభించే వరకు నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని మృతుని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు...1
- జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.3
- NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.1