//గంజాయి కేసులో 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.// 🚩గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే దిశగా జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రదేశాలు, పాత నేరస్తులు మరియు అనుమానితులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍ఈ చర్యలలో భాగంగా సౌత్ పోలీస్ సబ్ డివిజన్ ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీ బి. మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో నల్లపాడు సీఐ కె. వంశీధర్ గారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్సై పి. మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 📍ఈ క్రమంలో 11.03.2026 తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, నల్లపాడు పోలీసులు మరియు CCS పోలీస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 📍వారిపై Cr.No.195/2026, U/Sec 8(C) r/w 20(b)(ii)(B)(A) NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 👉గంజాయి సరఫరాదారులు: 1. తోట గోపాలకృష్ణ @ సాయి (32), చౌడవరం, గుంటూరు రూరల్ (ఇతనిపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది) 2. కొల్లూరి నంధీశ్వర్ @ వరికూటి గౌరి శంకర్ (32), నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. 👉 గంజాయి కొనుగోలు చేసి విక్రయించే వారు / మత్తు బిళ్ళలు విక్రయించే వారు: 3. షేక్ ఉస్మాన్ (23), పాత గుంటూరు 4. షేక్ సనావుల్లా @ ఇర్ఫాన్ (24), కొత్తపేట, గుంటూరు 5. పటాన్ జానీ బాషా (30), వెంకటరావుపేట, పాత గుంటూరు 6. పోతార్లంక శ్యామ్ (26), అల్లీనగర్, పాత గుంటూరు 👉 గంజాయి వినియోగదారులు: 7. బత్తుల నాగరాజు (32), లాలాపేట్ 8. చల్లా వెంకటేశ్వర్లు (32), సాయిబాబా కాలనీ 9. నక్కా సాంబశివరావు (25), సాయిబాబా కాలనీ 10. కొడవటి హనోక్ (24), అల్లీనగర్. 11. షేక్ జబ్బార్ (25), చంద్రబాబు నాయుడు కాలనీ 12. బజంత్రీ దుర్గాప్రసాద్ @ అమ్ము (29), ఆనందపేట 13. చల్లా వెంకటేష్ @ చాపా (19), లాలాపేట్ 14. కనిగిరి నాగరాజు @ పిల్లి (26), లాలాపేట్ 👉 కేసు వివరాలు: 📍దర్యాప్తులో A1 మరియు A2 నిందితులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తినుబండారాలు విక్రయిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తరలించి, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో A1 ఇంటివద్ద నిల్వ ఉంచి, గుంటూరు నగరంలో గంజాయి విక్రయించే వారికి (A3–A6) మరియు వినియోగదారులకు (A7–A14) విక్రయిస్తున్నట్లు తేలింది. 📍 ది.06.03.2026 తేదీన నిందితులు ఒడిశాకు వెళ్లి 8 కిలోల గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 📍 ది.11.03.2026 తేదీన చోడవరం గ్రామంలో A1 ఇంటి వద్ద గంజాయి విక్రయం జరుగుతుండగా నల్లపాడు మరియు CCS పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి మొత్తం 7600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 📍దర్యాప్తులో A3 నుండి A6 నిందితులు ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు నగరంలోని అమాయక ప్రజలకు మత్తు బిళ్ళలు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. 📍గంజాయి సరఫరా, విక్రయం, వినియోగం మరియు అనధికారికంగా మత్తు బిళ్ళలు విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. ఇప్పటివరకు గత అక్టోబర్ నుండి గుంటూరు జిల్లాలో 34 కార్డెన్ సెర్చ్ లు 120 సంకల్పం ప్రోగ్రామ్స్ 8 మంది పై పీ డి యాక్ట్ కేసులు 51 NDPS కేసుల్లో 300 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపడమైనది గంజాయి కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని, గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు విశేష కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 👉ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడంలో మార్గనిర్దేశం చేసిన ఇన్చార్జ్ SDPO సౌత్ శ్రీ బి. మధుసూదన్ రావు గారిని, నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన SHO/CI కె. వంశీధర్ గారు, SI పి. మహేష్ కుమార్ గారు, నల్లపాడు పోలీస్ సిబ్బంది మరియు CCS సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు అభినందించారు.
//గంజాయి కేసులో 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.// 🚩గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే దిశగా జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానాస్పద ప్రదేశాలు, పాత నేరస్తులు మరియు అనుమానితులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 📍ఈ చర్యలలో భాగంగా సౌత్ పోలీస్ సబ్ డివిజన్ ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీ బి. మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో నల్లపాడు సీఐ కె. వంశీధర్ గారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్సై పి. మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 📍ఈ క్రమంలో 11.03.2026 తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, నల్లపాడు పోలీసులు మరియు CCS పోలీస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటున్న 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 📍వారిపై Cr.No.195/2026, U/Sec 8(C) r/w 20(b)(ii)(B)(A) NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 👉గంజాయి సరఫరాదారులు: 1. తోట గోపాలకృష్ణ @ సాయి (32), చౌడవరం, గుంటూరు రూరల్ (ఇతనిపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది) 2. కొల్లూరి నంధీశ్వర్ @ వరికూటి గౌరి శంకర్ (32), నూతలపాడు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. 👉 గంజాయి కొనుగోలు చేసి విక్రయించే వారు / మత్తు బిళ్ళలు విక్రయించే వారు: 3. షేక్ ఉస్మాన్ (23), పాత గుంటూరు 4. షేక్ సనావుల్లా @ ఇర్ఫాన్ (24), కొత్తపేట, గుంటూరు 5. పటాన్ జానీ బాషా (30), వెంకటరావుపేట, పాత గుంటూరు 6. పోతార్లంక శ్యామ్ (26), అల్లీనగర్, పాత గుంటూరు 👉 గంజాయి వినియోగదారులు: 7. బత్తుల నాగరాజు (32), లాలాపేట్ 8. చల్లా వెంకటేశ్వర్లు (32), సాయిబాబా కాలనీ 9. నక్కా సాంబశివరావు (25), సాయిబాబా కాలనీ 10. కొడవటి హనోక్ (24), అల్లీనగర్. 11. షేక్ జబ్బార్ (25), చంద్రబాబు నాయుడు కాలనీ 12. బజంత్రీ దుర్గాప్రసాద్ @ అమ్ము
(29), ఆనందపేట 13. చల్లా వెంకటేష్ @ చాపా (19), లాలాపేట్ 14. కనిగిరి నాగరాజు @ పిల్లి (26), లాలాపేట్ 👉 కేసు వివరాలు: 📍దర్యాప్తులో A1 మరియు A2 నిందితులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో తినుబండారాలు విక్రయిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తరలించి, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం గ్రామంలో A1 ఇంటివద్ద నిల్వ ఉంచి, గుంటూరు నగరంలో గంజాయి విక్రయించే వారికి (A3–A6) మరియు వినియోగదారులకు (A7–A14) విక్రయిస్తున్నట్లు తేలింది. 📍 ది.06.03.2026 తేదీన నిందితులు ఒడిశాకు వెళ్లి 8 కిలోల గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది. 📍 ది.11.03.2026 తేదీన చోడవరం గ్రామంలో A1 ఇంటి వద్ద గంజాయి విక్రయం జరుగుతుండగా నల్లపాడు మరియు CCS పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి మొత్తం 7600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 📍దర్యాప్తులో A3 నుండి A6 నిందితులు ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు నగరంలోని అమాయక ప్రజలకు మత్తు బిళ్ళలు విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. 📍గంజాయి సరఫరా, విక్రయం, వినియోగం మరియు అనధికారికంగా మత్తు బిళ్ళలు విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలిపారు. ఇప్పటివరకు గత అక్టోబర్ నుండి గుంటూరు జిల్లాలో 34 కార్డెన్ సెర్చ్ లు 120 సంకల్పం ప్రోగ్రామ్స్ 8 మంది పై పీ డి యాక్ట్ కేసులు 51 NDPS కేసుల్లో 300 మందిని అరెస్టు చేసి రిమాండ్ పంపడమైనది గంజాయి కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని, గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు విశేష కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 👉ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయడంలో మార్గనిర్దేశం చేసిన ఇన్చార్జ్ SDPO సౌత్ శ్రీ బి. మధుసూదన్ రావు గారిని, నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన SHO/CI కె. వంశీధర్ గారు, SI పి. మహేష్ కుమార్ గారు, నల్లపాడు పోలీస్ సిబ్బంది మరియు CCS సిబ్బందిని గౌరవ ఎస్పీ గారు అభినందించారు.
- Post by Bondhu Suresh1
- 🙏😭1
- జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు1
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.1
- Post by N సూరి4
- ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు1
- హన్మకొండ జిల్లా:కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నాయకులు, రాష్ట్ర ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- 🙏😭1