కాంటూర్ సాకులు వద్దు.. నిర్వాసితులందరికీ న్యాయం చేయాల్సిందే! కూనవరం మండల ముంపు గ్రామాలను ఒకే యూనిట్గా గుర్తించాలి సిపిఎం నేత మేకల నాగేశ్వరరావు డిమాండ్ కూనవరం, ఏప్రిల్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడం అమానుషమని, కాంటూర్ లెక్కలతో సంబంధం లేకుండా కూనవరం మండలంలోని ముంపు గ్రామాలన్నింటికీ తక్షణమే పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం రాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం టేకుల బోరు సిపిఎం కార్యాలయం నందు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆయన ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంటూర్ లెక్కల అశాస్త్రీయత వరదలు వచ్చినప్పుడు వరద కాంటూర్ లెక్కలు చూసి రాదని, పక్కపక్కనే ఉన్న గ్రామాల్లో ఒకరికి పరిహారం ఇచ్చి మరొకరిని విస్మరించడం వివక్షాపూరితమని ఆయన విమర్శించారు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిర్వాసితులకు మెరుగైన పునరావాసం మరియు నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ముందుకు సాగనివ్వాలని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడిని ప్రత్యేక యూనిట్గా గుర్తించి, ఎటువంటి 'కట్ ఆఫ్ డేట్' నిబంధనలు లేకుండా పరిహారం అందించాలి. త్యాగధనులను గౌరవించండి దేశాభివృద్ధి కోసం భూములిచ్చిన నిర్వాసితులను భిక్షగాళ్లలా చూడవద్దని, వారి హక్కులను కాపాడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత అని గుర్తు చేశారు. ప్రభుత్వానికి హెచ్చరిక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నిర్వాసితుల జీవితాలతో ఆడుకోవద్దని మేకల నాగేశ్వరరావు హెచ్చరించారు. ప్రభుత్వాలు తమ మొండి వైఖరిని వీడకుంటే, నిర్వాసితులందరినీ ఏకం చేసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. "కాంటూర్ సాకులు చెప్పి పరిహారంలో కోత విధిస్తే సహించేది లేదు. నిర్వాసితుల పక్షాన నిలబడటమే ఉద్యమిస్తామని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పాయం సీతారామయ్య, మండల కార్యదర్శి బాబు బర్రయ్య, కర్నాటి శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు మడకం నాగమణి, బొగ్గ రామారావు బొగ్గ వెంకమ్మ అమ్మాజీ జయ సుధా, మండల నాయకులు నానుపల్లి వెంకటేశ్వరరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, మడెం బాబురావు, ఆవుల ఉపేంద్ర, మురళి, కొన్నవరం టౌన్ శాఖ సెక్రెటరీ కొండ ఈశ్వర్, తెలగాని నాగరాజు బొగ్గ సుబ్బయ్య తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్య కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, అది వేలాది గిరిజన, గిరిజనేతర కుటుంబాల మనుగడకు సంబంధించినది. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది
కాంటూర్ సాకులు వద్దు.. నిర్వాసితులందరికీ న్యాయం చేయాల్సిందే! కూనవరం మండల ముంపు గ్రామాలను ఒకే యూనిట్గా గుర్తించాలి సిపిఎం నేత మేకల నాగేశ్వరరావు డిమాండ్ కూనవరం, ఏప్రిల్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడం అమానుషమని, కాంటూర్ లెక్కలతో సంబంధం లేకుండా కూనవరం మండలంలోని ముంపు గ్రామాలన్నింటికీ తక్షణమే పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం రాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం టేకుల బోరు సిపిఎం కార్యాలయం నందు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆయన ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంటూర్ లెక్కల అశాస్త్రీయత వరదలు వచ్చినప్పుడు వరద కాంటూర్ లెక్కలు చూసి రాదని, పక్కపక్కనే ఉన్న గ్రామాల్లో ఒకరికి పరిహారం ఇచ్చి మరొకరిని విస్మరించడం వివక్షాపూరితమని ఆయన విమర్శించారు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిర్వాసితులకు మెరుగైన పునరావాసం మరియు నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ముందుకు సాగనివ్వాలని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడిని ప్రత్యేక యూనిట్గా గుర్తించి, ఎటువంటి 'కట్ ఆఫ్ డేట్' నిబంధనలు లేకుండా పరిహారం అందించాలి. త్యాగధనులను గౌరవించండి దేశాభివృద్ధి కోసం భూములిచ్చిన నిర్వాసితులను భిక్షగాళ్లలా చూడవద్దని, వారి హక్కులను కాపాడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనీస బాధ్యత అని గుర్తు చేశారు. ప్రభుత్వానికి హెచ్చరిక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నిర్వాసితుల జీవితాలతో ఆడుకోవద్దని మేకల నాగేశ్వరరావు హెచ్చరించారు. ప్రభుత్వాలు తమ మొండి వైఖరిని వీడకుంటే, నిర్వాసితులందరినీ ఏకం చేసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. "కాంటూర్ సాకులు చెప్పి పరిహారంలో కోత విధిస్తే సహించేది లేదు. నిర్వాసితుల పక్షాన నిలబడటమే ఉద్యమిస్తామని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పాయం సీతారామయ్య, మండల కార్యదర్శి బాబు బర్రయ్య, కర్నాటి శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు మడకం నాగమణి, బొగ్గ రామారావు బొగ్గ వెంకమ్మ అమ్మాజీ జయ సుధా, మండల నాయకులు నానుపల్లి వెంకటేశ్వరరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, మడెం బాబురావు, ఆవుల ఉపేంద్ర, మురళి, కొన్నవరం టౌన్ శాఖ సెక్రెటరీ కొండ ఈశ్వర్, తెలగాని నాగరాజు బొగ్గ సుబ్బయ్య తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్య కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, అది వేలాది గిరిజన, గిరిజనేతర కుటుంబాల మనుగడకు సంబంధించినది. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది
- 😭🙏1
- 😭🙏1
- ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- cm revanth reddy nasthurpally ki ravas daniki erpatlu2
- Post by SHOT NEWS1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏1
- అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.1