ముగిసిన ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 94 వేల మంది ఓట్లు తొలగింపు...అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 94 వేల మంది పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు తొలగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 26 లక్షల మూడు వేల మంది సర్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్ లు బిఎల్వో లకు అందజేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎన్యూమరేషన్ ఫామ్ లు స్వీకరించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను రేపటి నుంచి స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.
ముగిసిన ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 94 వేల మంది ఓట్లు తొలగింపు...అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 94 వేల మంది పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు తొలగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 26 లక్షల మూడు వేల మంది సర్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్ లు బిఎల్వో లకు అందజేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎన్యూమరేషన్ ఫామ్ లు స్వీకరించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను రేపటి నుంచి స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.
- ముగిసిన ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ...ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 లక్షల 94 వేల మంది ఓట్లు తొలగింపు...అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో భారీగా ఓట్లు తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 94 వేల మంది పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే అవకాశాలున్నాయి. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లు తొలగిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29 లక్షల 97 వేల మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 26 లక్షల మూడు వేల మంది సర్ ప్రక్రియలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫామ్ లు బిఎల్వో లకు అందజేశారు. ఈరోజు అర్ధరాత్రి వరకు ఎన్యూమరేషన్ ఫామ్ లు స్వీకరించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను రేపటి నుంచి స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది.1
- ముక్కిస లచ్చవ్వ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ముక్కిసా లచ్చవ్వ ఇటీవల మృతి చెందగా, ఈరోజు మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస్ గుప్తా, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, ఎలా శేఖర్ బాబు, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, జగన్ రెడ్డి, జగన్ తదితరులు పాల్గొన్నారు.1
- కాసేపటి క్రితం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకడం ప్రారంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కాసేపటి క్రితం గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకడం ప్రారంభించింది. మత్తడి దూకే ప్రదేశానికి సందర్శకులు ఎవరు కూడా వెళ్లకూడదని సిరిసిల్ల డీఎస్పీ కత్రోజ్ నాగేంద్ర చారి, ఎల్లారెడ్డిపేట సి ఐ వెంకటేష్ లు హెచ్చరికలు జారీ చేశారు.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.1
- ఈశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: సింగర్ మంగ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని మంగ్లీ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు మంగ్లీకి ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న మంగ్లీ, ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులు, అభిమానులు ఆమెను ఆసక్తిగా గమనించారు.2
- సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక చట్టాలు , హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు CITU - రైతు - వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుందని మండిపడ్డారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు అన్యాయం చేస్తుందని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేకుంటే కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల చట్టాలు హక్కులను రక్షించుకోవడం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జిల్లా కార్యదర్శి కోడం రమణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , ఎలిగేటి రాజశేఖర్ , గీస బిక్షపతి , దాసరి రూప , ఆడెపు రజిత , బూర శ్రీనివాస్ , మల్యాల నరసయ్య , శ్రీరామ్ సదానందం , సిరిమల్ల సత్యం , గోవిందు లక్ష్మణ్ , కోల శ్రీనివాస్ , బేజుగం సురేష్ , స్వర్గం శేఖర్ , సావణ పెళ్లి రాములు , గిరిబాబు , మల్లయ్య , ప్రభాకర్ , నరేందర్ , రాజెల్లయ్య , శ్రీధర్ , కమలాకర్ , రమేష్ , శంకర్ , బాలయ్య , లచ్చయ్య , సురేష్ , రవీందర్ , శ్రీనివాస్ , పోచమల్లు వివిధ రంగాల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా. *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ కి వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు.* *పర్యాటకులు పోలీస్ వారి సూచనలు, హెచ్చరికలు తప్పనిసరిగా పాటించాలి.* *మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ.* తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. *పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.* ఎస్పీ గారి వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.4
- మెట్ పల్లి లో ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలు...ఇద్దరు పాపలు, ఒక బాబు జననం జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మెట్పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట గ్రామానికి చెందిన జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు వివాహమైన తర్వాత ఇది మొదటి సంతానం. రాజ లక్ష్మికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్ పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఒకే ప్రసవంలో ముగ్గురు పసిపాపలు జన్మించారు.పుట్టిన వారిలో ఒక బాబు,ఇద్దరు పాపలు ఉన్నారు. బాబు బరువు: 1.8 కేజీలు మొదటి పాప బరువు: 1.5 కేజీలు,రెండో పాప బరువు: 1.4 కేజీలు,ప్రస్తుతం తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.ముగ్గురు చిన్నారులు తక్కువ బరువుతో జన్మించడంతో,పిల్లల నిపుణుల (Pediatrician) ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.మొదటి సంతానంలోనే ఒకేసారి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో జంగిటి రాజ లక్ష్మి - నరేందర్ దంపతులకు స్థానికులు,బంధువులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.1
- క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో... కార్మిక చట్టాల పరిరక్షణకై మరో పోరాటం.. టేకు మల్ల సమ్మయ్య ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక, రైతు సంఘాల పిలుపుమేరకు కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద ఏఐటియుసి, టి యు సి ఐ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు, కార్మిక వ్యతిరేక చట్టాల కాపీలను దగ్ధం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోయడ సృజన కుమార్ మాట్లాడుతూ.... కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ,వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి వాణిజ్య ఒప్పందాలను చేస్తుందని*, దేశానికి వెన్నుముక రైతు అని చెప్పినటువంటి కేంద్రం, నేడు రైతుకి గిట్టుబాటు ధర లేకుండా, సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా, విత్తనాలు అధిక రేట్లు పెంచుతూ, యూరియా రేట్లు రెట్టింపు చేస్తూ, ఆరు కాలం పంట పండించే రైతుకు గిట్టు గిట్టుబాటు ధర కల్పించకుండా మధ్య దళారీలు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వారు ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజులు నుండి 200 రోజులకు పెంచాలని, రోజువారీ కూలీ 700 ఇవ్వాలని ఒకవైపు ఆందోళన చేస్తుంటే ఉన్న పథకాన్ని రద్దుచేసి రాంజీ పథకం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు*. *విద్యుత్ సవరణ 2025 చట్టం రద్దు చేయాలని, పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని చట్టం చేయాలని, రుణమాఫీ, పంటల బీమా అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, స్వేచ్ఛ వాణిజ్య* *ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, సిపిఐ నగర సహాయక కార్యదర్శి పైడిపల్లి రాజు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కిమ్మసారపు నరసయ్య , బొంతల ఎల్లయ్య, దాసరి అనిల్, టి యు సి నాయకులు ఎస్ కమలాకర్ ,మునీధర్, శ్రీపతి ప్రసాదులు పాల్గొన్నారు2