నేటి నుండి విద్యా వారోత్సవాలను విజయవంతం చేయండి మండల విద్యాశాఖ అధికారి యన్ రాజేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి యన్. రాజేశ్వరరావు తెలిపారు. సోమవారం నుండి 17వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుంబూరు నందు సమ్మర్ క్యాంపు ప్రారంభించుటతో మొదలుకొని 17 వరకు పాఠశాలల్లో పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ క్లాసుల ప్రారంభించుట, బడిబాట కార్యక్రమాలు నిర్వహించుట, పుస్తక ప్రదర్శనలు చేయుట, సర్పంచ్ లకు విద్యా కార్యక్రమాలపై వర్కషాప్, మొదలగు కార్యక్రమాలు నిర్వహించుట జరుగునని తెలిపారు.అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచి అందంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుండి 25వ తేదీ వరకు పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుంబూరు నందు మండలంలోని అన్ని పాఠశాలల ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు ఉదయం 08:00 గంటల నుండి 12:00 గంటల వరకు వేసవి శిబిరం ఏర్పాటు చేయనైనదని తెలిపారు. శిబిరంలో యోగా, ధ్యానం, డ్రాయింగ్, ఇండోర్ గేమ్స్,కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి అంశాలను నేర్పడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరగు విద్యార్థులకు స్నాక్స్ అందజేయడం జరుగుతుందని,తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ క్యాంపుకు పంపించి, సద్వినియోగం చేసుకొని వారి మానసిక వికాసానికి దోహదపడగలరని ఎం.ఈ.ఓ తెలియజేశారు.
నేటి నుండి విద్యా వారోత్సవాలను విజయవంతం చేయండి మండల విద్యాశాఖ అధికారి యన్ రాజేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి యన్. రాజేశ్వరరావు తెలిపారు. సోమవారం నుండి 17వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుంబూరు నందు సమ్మర్ క్యాంపు ప్రారంభించుటతో మొదలుకొని 17 వరకు పాఠశాలల్లో పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ క్లాసుల ప్రారంభించుట, బడిబాట కార్యక్రమాలు నిర్వహించుట, పుస్తక ప్రదర్శనలు చేయుట, సర్పంచ్ లకు విద్యా కార్యక్రమాలపై వర్కషాప్, మొదలగు కార్యక్రమాలు నిర్వహించుట జరుగునని తెలిపారు.అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచి అందంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుండి 25వ తేదీ వరకు పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుంబూరు నందు మండలంలోని అన్ని పాఠశాలల ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థులకు ఉదయం 08:00 గంటల నుండి 12:00 గంటల వరకు వేసవి శిబిరం ఏర్పాటు చేయనైనదని తెలిపారు. శిబిరంలో యోగా, ధ్యానం, డ్రాయింగ్, ఇండోర్ గేమ్స్,కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి అంశాలను నేర్పడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరగు విద్యార్థులకు స్నాక్స్ అందజేయడం జరుగుతుందని,తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ క్యాంపుకు పంపించి, సద్వినియోగం చేసుకొని వారి మానసిక వికాసానికి దోహదపడగలరని ఎం.ఈ.ఓ తెలియజేశారు.
- తెలంగాణలో తాజాగా జరిగిన సర్వే ఎస్టీ జనాభా గురించి కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఎస్టీ తెగలలో లంబాడీలు/బంజారాలు అతిపెద్ద వర్గంగా ఉన్నారని తేలింది. వీరి సంస్కృతి, సంప్రదాయాలు, జానపద నృత్యాలు తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందాయి.1
- ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.1
- అన్నపురెడ్డిపల్లిలో అకాల వర్షం బీభత్సం - డ్రైనేజీ లేక ఇళ్లలోకి చేరిన వరద నీరు అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నివాస గృహాల్లోకి, చిరు వ్యాపారుల దుకాణాల్లోకి చేరి నిత్యావసర వస్తువులు, సామగ్రి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. క్షేత్రస్థాయిలో పర్యటించిన కాంగ్రెస్పార్టీ యువజన అధ్యక్షులు వేముల నరేష్ బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. నీట మునిగిన ఇళ్లను, పాడైపోయిన సామాగ్రిని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలు మరియు విమర్శలు: అధికారుల నిర్లక్ష్యం సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు పనులు చేపట్టిన సమయంలో, ప్రత్యామ్నాయ డ్రైనేజీ మార్గాలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. అస్తవ్యస్త అభివృద్ధి "అభివృద్ధి పనులు చేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెంట్రల్ లైటింగ్ పేరుతో డ్రైనేజీ నిర్మాణం లేనపుడు రోడ్లు నిర్మించడం సరికాదు" అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వరద వల్ల నష్టపోయిన పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి. శాశ్వత పరిష్కారం నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునర్నిర్మించాలి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. "కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం." — వేముల నరేష్ 1
- ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.1
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకురాలు అద్దంకి నాగమణి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీతక్క, అద్దంకి దయాకర్ వంటి ప్రజా నాయకులపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కవితకు కష్టపడి పైకి వచ్చిన వారి విలువ తెలియదని నాగమణి ఎద్దేవా చేశారు.1
- కూటమి ప్రభుత్వం పెందుర్తి పెద్ద చెరువు గట్టును సుందరంగా తీర్చిదిద్ది, నడకకు అనుకూలంగా మార్చింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్ ఈ ట్రాక్పై ఆనందంగా షికారు చేస్తున్నారు.1
- రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.1
- భద్రాచలంలో తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభ జరిగింది. నాయకులు, అభిమానులు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన సేవలను, ముఖ్యంగా అపర భగీరథుడిగా ఆయన కృషిని కొనియాడారు.1