కృష్ణాజిల్లా శివారు నియోజకవర్గాలకు త్రాగునీరు, సాగునీరు అందించడానికై సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం కృష్ణాజిల్లా శివారు నియోజకవర్గాలకు త్రాగునీరు, సాగునీరు అందించడానికై సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ ఇతర నాయకులతో పాటు పాల్గొని జిల్లాలోని పలు సమస్యలను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేలాగా చూద్దామని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలోని శివారు నియోజకవర్గాలైన అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడలోని కొన్ని మండలాలకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పట్టిసీమ కాలువకు ఇంకా ఎక్కువ మోటార్లను పెట్టి నీటి సామర్థ్యాన్ని పెంచి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, విద్య మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబుని కలిసి సమస్యను వివరిద్దామని రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేసినారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలంతా కష్టపడి ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మంచిని తెలియజేసి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయభేరి మోగించే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని రాజేంద్రప్రసాద్ అన్నారు.
కృష్ణాజిల్లా శివారు నియోజకవర్గాలకు త్రాగునీరు, సాగునీరు అందించడానికై సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం కృష్ణాజిల్లా శివారు నియోజకవర్గాలకు త్రాగునీరు, సాగునీరు అందించడానికై సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి కృష్ణాజిల్లా తెదేపా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ ఇతర నాయకులతో పాటు పాల్గొని జిల్లాలోని పలు సమస్యలను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేలాగా చూద్దామని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలోని శివారు నియోజకవర్గాలైన అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడలోని కొన్ని మండలాలకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పట్టిసీమ కాలువకు ఇంకా ఎక్కువ మోటార్లను పెట్టి నీటి సామర్థ్యాన్ని పెంచి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, విద్య మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబుని కలిసి సమస్యను వివరిద్దామని రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేసినారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలంతా కష్టపడి ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మంచిని తెలియజేసి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయభేరి మోగించే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని రాజేంద్రప్రసాద్ అన్నారు.
- హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు *హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* - జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు* రాజోలు, ఆగస్ట్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. ఈ మేరకు గురువారం జిల్లా కలక్టర్ను, జిల్లా ఎస్పీని కలసిన రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్ పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానడు అద్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘ రాజోలు మండల అద్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అద్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అద్యక్షులు మందపాటి మధు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యనిర్వక సభ్యులు పుల్లెళ్ళ ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు 17 ఇసుక ట్రాక్టర్ లు పట్టుకున్నారు.పెద్దమండవ,గందసిరి గ్రామాల్లోని మున్నేరు నుంచి కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.ఇసుక ట్రాక్టర్ లను పోలీసులు తనిఖీ చేయగా వాటికి ఎలాంటి అనుమతి లేనట్లు గుర్తించి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులపై ముదిగొండ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా సిఐ మురళి మాట్లాడుతూ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- ఖమ్మంలో దంచి కొట్టిన వాన.వర్షంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి వాన దంచికొట్టింది. ఈ సీజన్లో అత్యధిక వర్షం రెండవసారి కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ వర్షం వల్ల రోజువారీ పనులకు ఆటంకం కలిగినా ప్రజలందరూ వర్షం రాకతో ఉత్సాహంగా ఉన్నారు.1
- రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.1
- పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో ప్రమాద భరితంగా మారిన విద్యుత్ స్తంభం పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా మారింది. పెడన మెయిన్ రోడ్ లోని సంత మార్కెట్ సమీపం డాక్టర్ అశోక్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు డివైడర్ పై ఉన్న విద్యుత్ లైట్ స్తంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. లారీ రివర్స్ చేస్తా ఉండగా స్తంభానికి తాకడం వల్ల స్తంభం పాక్షికంగా దెబ్బతిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రతిక్షణం వందలాది వాహనాలు వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ స్తంభం కూలితే ఘోర ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు పెడన పోలీస్ శాఖ అధికారులుస్పందించి యుద్ధ ప్రాతిపదికన కోలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభంకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య,వైద్యానికి పెద్దపీట వేశామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టెక్నీకల్ విద్య కోసం ఒక ATC ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందని ఆయన తెలిపారు.రెండున్నర సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు.వచ్చే నెల నుంచి అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు..1
- *💥బైక్ను తప్పించబోయి ఘోర ప్రమాదం* కేరళంలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడొచ్చిన బైక్ని తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోతోంది *బస్ డ్రైవర్ అతివేగంతో పాటు..... బైక్ నడిపే వ్యక్తి నిర్లక్ష్యం*1
- RIP రామకృష్ణ....😔🙏 కొన్ని కారణాలు వలన ఫైర్ ఆక్సిడెంట్ చేత బాధపడుతున్న రామకృష్ణ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం మాకు తోచిన సహాయాన్ని అందించాము. ఆ వీడియోని చూసి అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన ఇద్దరు సోదరులు. రవి గారు 5000 నరేంద్ర గారు 2000 అందజేశారు. మేము హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 11 గంటలకు బాడీలో పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన తుది శ్వాసను విడిచారు.. మీ ఆత్మకు శాంతి కలగాలని టీం క్యాపో తరపున కోరుకుంటున్నాము..1