మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ &రాంపూర్ సర్పంచ్ నిర్మల శ్రీశైలం యాదవ్ తలకొండపల్లి మండలంరాంపూర్ గ్రామానికి చెందిన రొయ్యల శాంతమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మధ్యాహ్నం మరణించడం జరిగింది.ఈ విషయం రాంపూర్ గ్రామ సర్పంచ్ మరియు మోహన్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ మరియు ఉప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మరణించిన వ్యక్తి కుటుంబానికి మనోధైర్యం చెబుతూ 3000రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.మరియు రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్ స్థానిక ఎన్నికలలో భాగంగా వారు ఇచ్చిన మాట ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 2000రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. మొత్తంగా 5000రూపాయలు మరణించిన వ్యక్తి కుటుంబానికి అందజేసి ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్. ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు, మాజీ ఎంపిటిసి కటికల భీమమ్మ-యాదయ్య మాజీ సర్పంచ్ D మణెమ్మ-యాదయ్య, మాజీ టెంపుల్ చైర్మన్ జానయ్య, గ్రామ పెద్దలు ఎండి షర్పు,ఎంఢీ సలీం, దోరిబాయి జంగయ్య, చిలుకం శేఖర్, రొయ్యల మహేష్, రొయ్యల చిన్నయ్య, బోదాసు నర్సింహా, కుమ్మరి నాగేష్,మొక్తల నర్సింహా చిలుకం చింటూ, తిక్కల శివ తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ &రాంపూర్ సర్పంచ్ నిర్మల శ్రీశైలం యాదవ్ తలకొండపల్లి మండలంరాంపూర్ గ్రామానికి చెందిన రొయ్యల శాంతమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మధ్యాహ్నం మరణించడం జరిగింది.ఈ విషయం రాంపూర్ గ్రామ సర్పంచ్ మరియు మోహన్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ మరియు ఉప్పుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మరణించిన వ్యక్తి కుటుంబానికి మనోధైర్యం చెబుతూ 3000రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.మరియు రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్ స్థానిక ఎన్నికలలో భాగంగా వారు ఇచ్చిన మాట ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 2000రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. మొత్తంగా 5000రూపాయలు మరణించిన వ్యక్తి కుటుంబానికి అందజేసి ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్. ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు, మాజీ ఎంపిటిసి కటికల భీమమ్మ-యాదయ్య మాజీ సర్పంచ్ D మణెమ్మ-యాదయ్య, మాజీ టెంపుల్ చైర్మన్ జానయ్య, గ్రామ పెద్దలు ఎండి షర్పు,ఎంఢీ సలీం, దోరిబాయి జంగయ్య, చిలుకం శేఖర్, రొయ్యల మహేష్, రొయ్యల చిన్నయ్య, బోదాసు నర్సింహా, కుమ్మరి నాగేష్,మొక్తల నర్సింహా చిలుకం చింటూ, తిక్కల శివ తదితరులు పాల్గొన్నారు.
- పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం....... - ఇదేమిటి అని అడిగితే బూతు మాటలతో ఎదురుదాడి...... - ఇట్లనే చేస్తే హాల్ టికెట్ ఇవ్వను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి...... వెల్దండ: మండల కేంద్రాల్లోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు వారం రోజుల నుండి ఉడికి ఉడకని పురువుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం,బుధవారం హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి పై బైఠాయించి ప్రిన్సిపాల్ డాం డాం అంటూ ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ స్వర్ణ రత్నం ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతూ, అడిగితే పురుగులను తీసేసి తినండి అంటున్నారని, సమస్య ఎవరికైన చెప్పిన మమ్మల్ని టార్గెట్ చేసేవారని తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేదని, ఎందుకు మేడం అంటే పాఠశాల లో మౌలిక వసతుల కోసమని చెప్పేది కానీ ఆ డబ్బులతో ఏమీ చేయకుండా సొంతంగా ఖర్చులకు ఉపయోగించుకునేదని తెలిపారు. ఫెస్టివల్ పార్టీ కానీ, ఫ్రెషర్ పార్టీ కానీ ప్రిన్సిపల్ మైక్ లోనే దుర్భాషలాడేదని, పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురవుతున్నామని, మా ఆరోగ్యాలతో ప్రిన్సిపల్ చెలగాటం ఆడుతున్నారని,ఈ ప్రిన్సిపల్ మాకొద్దని, వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తేనే మేము పాఠశాల వెళ్తామన్నారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కార్తీక్ కుమార్, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎస్సై కురుమూర్తి హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు ఆగ్రహం.......... పురుగుల అన్నం తినలేక గురుకుల పాఠశాల విద్యార్థినీలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని దళిత సంఘాల నాయకులు జంగిలి నిరంజన్, పోలే అశోక్, జంగిలి ఆనంద్, సామెల్, కొయ్యల పుల్లయ్య, గోరటి సుధాకర్, గోరటి సంజీవ, జంగిల్ ప్రవీణ్, ఏకుల వెంకటేష్, దుళ్ల పెద్దయ్య లతో పాటు మరి కొంతమంది నాయకులు ఆగ్రం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్నారని, వారికి పురుగుల అన్నం ఎట్లా పెడతారని, ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అలీ, పంచాయతీ కార్యదర్శి గిరి, ఆయా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.6
- నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థిను లు ఆందోళన చేస్తుండగా నలుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుపాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ విద్యార్థినులతో చర్చలు జరిపిన ఎమ్మార్వో, పోలీసులు1
- కాకునూరు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల ప్రభను ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ప్రభను ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున వరకు అగ్నిగుండాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగనున్నది.అనంతరం నిప్పుకణుకలపై నడుస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, హారతులు, నాదస్వరాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates BioAsia 2026 in Hyderabad1
- every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into1
- హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం4
- ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో బోయ ఆంజనేయులు అనే వ్యక్తి కుమారుడు సురేందర్ కు గతంలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం మరోసారి గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఖర్చు 12 లక్షల రూపాయల వరకు అవుతుందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్న 1 ఎకరం పొలాన్ని తాకట్టు పెట్టి వైద్యం అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకొచ్చి వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు.1
- కేశంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని కొందరు అనుమతి లేకుండా జేసీబీతో చెట్లు తొలగించారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన వనాన్ని ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే పనులు జరిపారని తెలిపారు. ఘటనపై పంచాయతీ కార్యదర్శి బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.1