Shuru
Apke Nagar Ki App…
గ్యాస్ కష్టాలు.. మూతపడే దిశగా విశాఖలోని హోటళ్లు! పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గి విశాఖ హోటల్ రంగం సంక్షోభంలో పడింది. దేశవ్యాప్తంగా 20% హోటళ్లు మూతపడగా, విశాఖలో 2 రోజుల్లో ఇదే పరిస్థితి రావచ్చని అసోసియేషన్ తెలిపింది. 4 రోజుల క్రితం రూ.1300 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1700 దాటింది. నగరంలోని 1000 హోటళ్లకు నెలకు 65 వేల సిలిండర్లు అవసరం కాగా, 45 వేలు మాత్రమే వస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ను అరికట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే హోటళ్లు మూసివేయడం ఖాయమని యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Duppada Anandarao
గ్యాస్ కష్టాలు.. మూతపడే దిశగా విశాఖలోని హోటళ్లు! పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గి విశాఖ హోటల్ రంగం సంక్షోభంలో పడింది. దేశవ్యాప్తంగా 20% హోటళ్లు మూతపడగా, విశాఖలో 2 రోజుల్లో ఇదే పరిస్థితి రావచ్చని అసోసియేషన్ తెలిపింది. 4 రోజుల క్రితం రూ.1300 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1700 దాటింది. నగరంలోని 1000 హోటళ్లకు నెలకు 65 వేల సిలిండర్లు అవసరం కాగా, 45 వేలు మాత్రమే వస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ను అరికట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే హోటళ్లు మూసివేయడం ఖాయమని యజమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన శేఖర్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు.సర్పంచ్ రామభుక్త, వార్డ్ మెంబర్లు, 100 కుటుంబాలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఎంజిఆర్ నియోజకవర్గం చేసిన అభివృద్ధి చూసి పార్టీలో చేరామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు.1
- రామభద్రపురంలో యాక్సిడెంట్.. క్షతగాత్రుల వివరాలు1
- మార్చి11శ్రీకాకుళంజిల్లాఆమదాలవలసపట్టణంలోఆముదాలవలస పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిర్వహిస్తున్న గుడ్ మార్నింగ్ విత్ ఆముదాలవలస కార్యక్రమంలో భాగంగా ఆముదాలవలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ బుధ వారం ఉదయం మున్సిపాలిటీ పరి ధిలోని పలు వార్డులను ప్రత్యక్షంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉదయం నుంచే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.4
- పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం ఆమిటి జంక్షన్లో అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం నుండి ఒడిశా గుమడ గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అనిల్ జైన్ గా గుర్తించారు. భార్య జ్యోతి జైన్, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- డుంబ్రిగూడ మండలంలోని చాపరాయిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. డుంబ్రిగూడకు చెందిన రామారావు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా ఆటో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం అరకులోయ ఏరియా ఆసుపత్రికి అందించారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం. అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది. అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది. వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.1
- Post by Shyam1
- గ్రామ స్థాయి నుంచి జనసేనను బలోపేతం చేయాలి1