Shuru
Apke Nagar Ki App…
మాజీ ఉప సర్పంచ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బజార్ హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామ మాజీ ఉప సర్పంచ్ ప్రకాష్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారిని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
AlluriMahesh
మాజీ ఉప సర్పంచ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బజార్ హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామ మాజీ ఉప సర్పంచ్ ప్రకాష్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారిని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
More news from Adilabad and nearby areas
- నెరడిగొండ : మండలంలోని తేజాపూర్ గ్రామంలో జరుగుతున్న వేదాంత విజ్ఞాన మహా సభలు,సాధు సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా శివానంద భారతి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం చేస్తామని కోరుకొని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని మొట్టమొదటగా కలిసి తెలియజేయగానే ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి ఈయొక్క సమ్మేళనానికి అండగా నిలిచారని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని ఘనంగా సన్మానించి అభినందన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. శివానంద స్వామి కలిసి సాకారం అందించాలని కోరారు. కానీ నా సాకారం కాదు దేవుడి ఆశీర్వాదంతోనే మీతో ఒకడిగా మీలో ఒకడిగా ఉంటానన్నారు. ఋషులు ఎన్నో తపస్సులు చేసి ధర్మాన్ని కాపాడుతున్నారని వారి మార్గదర్శనమీ మనకు నిదర్శనమని మనం ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- జన్నారం మండలంలోని తాళ్లపెట్ రేంజ్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో అనేక పక్షులు కనువిందు చేస్తున్నాయని వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డా.వెంకట్ ఎనగందుల తెలిపారు. మంగళవారం ఆయన మల్యాల బీట్ లో ఓరియంటల్ గోల్డెన్ ఒరియోల్, స్ట్రీక్ త్రోటేడ్ వుడ్ పీకర్, కామన్ కింగ్ ఫిషర్, ఎల్లో త్రోటెడ్ ప్యారో, ఆరెంజ్ హేడెడ్ త్రష్, టికెట్స్ బ్లూ ఫ్లై క్యాచర్ లాంటి పక్షులను తన కెమేరాలలో బంధించారు.1
- కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో రైల్వే అధికారులు కొలనూరును సందర్శించినప్పుడు స్వయంగా వారితో కలిసి ఆన్సైట్ పరిశీలన నిర్వహించి, ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. మొదట రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే మంజూరు ఇచ్చి, ఓదేలుకు సాధ్యం కాదని తెలిపినా.. ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు వివరించారు. ముఖ్య అంశాలు: నిరంతర పోరాటం: రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కొలనూరు ఆర్ఓబీని రైల్వే శాఖ స్వంత ఖర్చులతో నిర్మించడానికి అంగీకరించింది. ఓదేలుపై హామీ: కొలనూరు తరహాలోనే ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం: ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కొలనూరు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వంశీకృష్ణ, త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.1
- कोमुरम भीम असिफाबाद जिला//असिफाबाद शहर के बीच में बंदरों का आतंक कॉलोनी के लोग डरे हुए हैं क्योंकि बंदर लोगों के घरों में घुस रहे हैं। पहले भी बच्चों और लोगों पर हमला करके उन्हें घायल करने की घटनाएं हुई हैं। कॉलोनी के लोग संबंधित अधिकारियों से कार्रवाई करने की रिक्वेस्ट कर रहे हैं।1
- రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.1
- పత్రికా ప్రకటన తేది :10.03.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమాన్ని ఆశిష్ సంగ్వాన్, IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు , గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి (FMD) అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. "టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు; ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం , బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం , పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని తెలిపారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు , పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధకశాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య ,పశుసంవర్ధక అధికారి, కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- నెరడిగొండ : మండల అంగన్ వాడి అసోసియేషన్ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్ వాడిల తరపున అసెంబ్లీలో ప్రస్తావించాలని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అంగన్ వాడిలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 1. ప్రి ప్రైమరిని అంగన్ వాడిల ద్వారానే నడిపించాలని. 2. కనీస వేతనం రూ. 26,000/- చెల్లించాలని, 3. రిటైర్మెంట్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష చెల్లించాలని డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు.1