logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహానగరాన్ని జల్లెడ పట్టి మైనర్ బాలికను కాపాడిన గద్వాల పోలీసులు పోలీసింగ్ అంటే కేవలం టెక్నాలజీ కాదు అది నిబద్ధత, పట్టుదల, బాధ్యత. ఈ సత్యాన్ని మరోసారి నిరూపించిన గద్వాల పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేకున్నా టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా, గద్వాల పట్టణంలో మాయమైన మైనర్ బాలికను మహానగరమైన హైదరాబాద్‌లో క్షేమంగా గుర్తించి రక్షించడం జరిగింది. .........<<<<<<>>>>....... గత గురువారం (09-04-2026) గద్వాల పట్టణంలో తల్లి మాటలకు అలిగి కూతురు ఇంటి నుండి వెళ్లిపోఇన (ఒ మైనర్ బాలిక) ఎంతో చాక చక్యంగా పట్టుకొని తల్లిదండ్రులు ఆవేదనను తీర్చిన ఘనత గద్వాల పోలీసులకు దక్కింది. వివరాల్లోకి వెళితే, మా అమ్మాయి కనిపించడం లేదని అమ్మాయి తల్లిదండ్రులు గద్వాల పోలీసులను ఆశ్రయించడం, ఇదే ఈ కేసుకు ప్రారంభం. కానీ అక్కడినుంచి ఇది ఒక సాధారణ మిస్సింగ్ కేసుగా కాకుండా, “మిషన్ రెస్క్యూ”గా మారింది. జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ గారి దిశానిర్దేశంతో వెంటనే స్పెషల్ టీం రంగంలోకి దిగింది. సీఐ టంగుటూరి శ్రీను నాయకత్వంలో ఎస్సై కళ్యాణ్ కుమార్, పి.సి.లు చంద్రయ్య, కిరణ్ కుమార్, రామకృష్ణ ల బృందం ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఆచూకీ కోసం పరిగెత్తింది. మొదట ఎలాంటి ఆధారాలు లేకపోయినా, గద్వాల బస్సు డ్రైవర్ చెప్పిన చిన్న ఆధారంతో పెద్ద క్లూగా మలచడం — అదే నిజమైన పోలీసింగ్. అక్కడి నుంచి మహానగరం హైదరాబాద్‌లో మొదలైన ఆపరేషన్ ఒక యుద్ధంలా మారింది. మొబైల్ ట్రేస్ లేదు… డిజిటల్ ఆధారాలు లేవు… ఎక్కడ ఉందో తెలియదు… అయినా వెనక్కి తగ్గని పోలీస్ బృందం ప్రతి వీధిని, ప్రతి బస్టాండ్‌ను, ప్రతి మూలను వెతికింది. నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, ఒకె లక్ష్యంగా “బాలికను సురక్షితంగా కనుగొనాలి”. హైదరాబాద్ లోకల్ పోలీసుల సహకారంతో వందలాది సీసీ కెమెరాలను గంటల తరబడి పరిశీలిస్తూ, చిన్న చిన్న కదలికలను కూడా వదలకుండా విశ్లేషిస్తూ చివరకు గమ్యం చేరుకున్నారు. ఆ బాలిక అఫ్జల్ గంజ్ బస్టాండ్ పరిసరాల్లో కనిపించగానే, పోలీస్ బృందం మెరుపువేగంతో స్పందించి అక్కడికి చేరుకుని బాలికను క్షేమంగా అదుపులోకి తీసుకుంది. ఈ విజయానికి కారణం టెక్నాలజీ కాదు… పోలీసుల అచంచల సంకల్పం. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పెషల్ టీంను అభినందిస్తూ, వారి కృషి పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. మహానగరంలో కూడా తమ ప్రజలను కాపాడే శక్తి తమకు ఉందని వారు ఘనంగా నిరూపించారు. ఈ ఘటనతో గద్వాల పోసులపై ప్రజలకు నమ్మకం మరింత బలపడింది.

6 hrs ago
user_Elluru Varaprasad
Elluru Varaprasad
Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
6 hrs ago
57e8f190-b329-49a0-afd6-0c588857237e

మహానగరాన్ని జల్లెడ పట్టి మైనర్ బాలికను కాపాడిన గద్వాల పోలీసులు పోలీసింగ్ అంటే కేవలం టెక్నాలజీ కాదు అది నిబద్ధత, పట్టుదల, బాధ్యత. ఈ సత్యాన్ని మరోసారి నిరూపించిన గద్వాల పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేకున్నా టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా, గద్వాల పట్టణంలో మాయమైన మైనర్ బాలికను మహానగరమైన హైదరాబాద్‌లో క్షేమంగా గుర్తించి రక్షించడం జరిగింది. .........<<<<<<>>>>....... గత గురువారం (09-04-2026) గద్వాల పట్టణంలో తల్లి మాటలకు అలిగి కూతురు ఇంటి నుండి వెళ్లిపోఇన (ఒ మైనర్ బాలిక) ఎంతో చాక చక్యంగా పట్టుకొని తల్లిదండ్రులు ఆవేదనను తీర్చిన ఘనత గద్వాల పోలీసులకు దక్కింది. వివరాల్లోకి వెళితే, మా అమ్మాయి కనిపించడం లేదని అమ్మాయి తల్లిదండ్రులు గద్వాల పోలీసులను ఆశ్రయించడం, ఇదే ఈ కేసుకు ప్రారంభం. కానీ అక్కడినుంచి ఇది ఒక సాధారణ మిస్సింగ్ కేసుగా కాకుండా, “మిషన్ రెస్క్యూ”గా మారింది. జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ గారి దిశానిర్దేశంతో వెంటనే స్పెషల్ టీం రంగంలోకి దిగింది. సీఐ టంగుటూరి శ్రీను నాయకత్వంలో ఎస్సై కళ్యాణ్ కుమార్, పి.సి.లు చంద్రయ్య, కిరణ్ కుమార్, రామకృష్ణ ల బృందం ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా ఆచూకీ కోసం పరిగెత్తింది. మొదట ఎలాంటి ఆధారాలు లేకపోయినా, గద్వాల బస్సు డ్రైవర్ చెప్పిన చిన్న ఆధారంతో పెద్ద క్లూగా మలచడం — అదే నిజమైన పోలీసింగ్. అక్కడి నుంచి మహానగరం హైదరాబాద్‌లో మొదలైన ఆపరేషన్ ఒక యుద్ధంలా మారింది. మొబైల్ ట్రేస్ లేదు… డిజిటల్ ఆధారాలు లేవు… ఎక్కడ ఉందో తెలియదు… అయినా వెనక్కి తగ్గని పోలీస్ బృందం ప్రతి వీధిని, ప్రతి బస్టాండ్‌ను, ప్రతి మూలను వెతికింది. నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, ఒకె లక్ష్యంగా “బాలికను సురక్షితంగా కనుగొనాలి”. హైదరాబాద్ లోకల్ పోలీసుల సహకారంతో వందలాది సీసీ కెమెరాలను గంటల తరబడి పరిశీలిస్తూ, చిన్న చిన్న కదలికలను కూడా వదలకుండా విశ్లేషిస్తూ చివరకు గమ్యం చేరుకున్నారు. ఆ బాలిక అఫ్జల్ గంజ్ బస్టాండ్ పరిసరాల్లో కనిపించగానే, పోలీస్ బృందం మెరుపువేగంతో స్పందించి అక్కడికి చేరుకుని బాలికను క్షేమంగా అదుపులోకి తీసుకుంది. ఈ విజయానికి కారణం టెక్నాలజీ కాదు… పోలీసుల అచంచల సంకల్పం. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పెషల్ టీంను అభినందిస్తూ, వారి కృషి పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. మహానగరంలో కూడా తమ ప్రజలను కాపాడే శక్తి తమకు ఉందని వారు ఘనంగా నిరూపించారు. ఈ ఘటనతో గద్వాల పోసులపై ప్రజలకు నమ్మకం మరింత బలపడింది.

More news from తెలంగాణ and nearby areas
  • వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది
    1
    వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    10 hrs ago
  • బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు
    3
    బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    10 hrs ago
  • బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ
    1
    బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..
    1
    పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    13 hrs ago
  • బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో  మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం పరిగి మండల పరిధిలోని కాలాపూర్ రాపోలు గ్రామ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం లాక్కుంటుందని ధర్నాకు దిగడంతో దీనికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేసేదిలేక కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి దారుర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు మద్దతు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపాలని హెచ్చరించారు
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం పరిగి మండల పరిధిలోని కాలాపూర్ రాపోలు గ్రామ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం లాక్కుంటుందని ధర్నాకు దిగడంతో దీనికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేసేదిలేక కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి దారుర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు మద్దతు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపాలని హెచ్చరించారు
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    11 hrs ago
  • మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    4
    మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.
    1
    ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.