ఈ రోజు శనివారం 13 Dec 2025 ఉదయం 9 గంటలకు, మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర సమగర మొచి కుల సంఘము పెద్దలు, *తెలంగాణ రాష్ట్ర సమగర మోచి Cobblers (కోబ్లెర్స్) అసోసియేషన్ తరపున* లెదర్ ఆర్టీజన్స్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. LIDCAP పునరుద్ధరణ, బోర్డును ఏర్పాటు చేసి 1200 కోట్ల బడ్జెట్ కేటాయించి చైర్మన్, డైరెక్టర్లను నియమించి గచ్చిబౌలి లో ఇతరులకు కేటాయించిన పెట్రోల్ బంక్ లీజు రద్దు, MD ని తొలగించి చర్మకారులకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలో వెంటనే రెండు మెగా లెదర్ పార్కులను ప్రారంభించి ట్రైనింగ్ చేసిన మాస్టర్ ఆర్టిజన్ తో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే *సబ్సిడీ కింద మొబైల్ ఫుట్వేర్ వెహికల్స్(Van)* లను ఇవాలని కోరడం జరిగింది. దీనికి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు సానుకూలంగా స్పందిస్తూ లీజు రద్దు చేసామని,MD ని తాత్కాలికంగా నియమించామని రాష్ట్రం లో మెగా లెదర్ పార్కులను ఏర్పాటు చేస్తామని ఫీచర్ సిటి లో కూడా లెదర్ ఇండస్ట్రీ తయారీ ఉత్పత్తులకు మాల్స్ ఏర్పాటు చేస్తామని త్వరలో మీకు ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని మన తెలంగాణలో లెదర్ ఇండస్ట్రీ పైన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హామిల్పూర్ రవీందర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ నోమురాజు గారు తదితరులు పాల్గొన్నారు. త్వరలో సమగర మోచి Cobblers అసోసియేషన్, రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మన వివిధ జిల్లాల్లో మన కులవృతి పై ఆధారపడి పనిచేస్తునవారితో ఒక మెంబర్షిప్ ( Membership) చేసి వారందరితో భారీఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, మాయొక్క ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలని మనవి. 🙏 రాష్ట్ర కోర్ కమిటీ.
ఈ రోజు శనివారం 13 Dec 2025 ఉదయం 9 గంటలకు, మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర సమగర మొచి కుల సంఘము పెద్దలు, *తెలంగాణ రాష్ట్ర సమగర మోచి Cobblers (కోబ్లెర్స్) అసోసియేషన్ తరపున* లెదర్ ఆర్టీజన్స్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. LIDCAP పునరుద్ధరణ, బోర్డును ఏర్పాటు చేసి 1200 కోట్ల బడ్జెట్ కేటాయించి చైర్మన్, డైరెక్టర్లను నియమించి గచ్చిబౌలి లో ఇతరులకు కేటాయించిన పెట్రోల్ బంక్ లీజు రద్దు, MD ని తొలగించి చర్మకారులకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలో వెంటనే రెండు మెగా లెదర్ పార్కులను ప్రారంభించి ట్రైనింగ్ చేసిన మాస్టర్ ఆర్టిజన్ తో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే *సబ్సిడీ కింద మొబైల్ ఫుట్వేర్ వెహికల్స్(Van)* లను ఇవాలని కోరడం జరిగింది. దీనికి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు సానుకూలంగా స్పందిస్తూ లీజు రద్దు చేసామని,MD ని తాత్కాలికంగా నియమించామని రాష్ట్రం లో మెగా లెదర్ పార్కులను ఏర్పాటు చేస్తామని ఫీచర్ సిటి లో కూడా లెదర్ ఇండస్ట్రీ తయారీ ఉత్పత్తులకు మాల్స్ ఏర్పాటు చేస్తామని త్వరలో మీకు ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని మన తెలంగాణలో లెదర్ ఇండస్ట్రీ పైన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హామిల్పూర్ రవీందర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ నోమురాజు గారు తదితరులు పాల్గొన్నారు. త్వరలో సమగర మోచి Cobblers అసోసియేషన్, రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మన వివిధ జిల్లాల్లో మన కులవృతి పై ఆధారపడి పనిచేస్తునవారితో ఒక మెంబర్షిప్ ( Membership) చేసి వారందరితో భారీఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, మాయొక్క ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలని మనవి. 🙏 రాష్ట్ర కోర్ కమిటీ.
- User10633Balkonda, Nizamabad🙏on 16 December
- పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు1
- శివంపేట్ మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు పైప్లైన్ పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పెంజర్ల మమత నర్సింహులు ఆధ్వర్యంలో ఈ పనులను కొంతన్పల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకట్రాం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివంపేట్ మండలం PACS తాజా మాజీ చైర్మన్ కూడా పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.1
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్ఎస్యూ నుండి ఆర్ఎస్ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.1
- వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) రిజిస్ట్రార్ గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్.విజయలక్ష్మి గారిని యూనివర్సిటీ దర్బార్ హాలులో ఉన్న వారి ఛాంబర్ లో కలిసి పూలబోకే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నాయకులు జాతీయ అధ్యక్షులు డా.సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కొమ్ము శేఖర్ మాదిగ,రాష్ట్ర సీనియర్ నాయకులు వీరపాకుల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ,ఓయూ ఉపాధ్యక్షులు కోల హరీష్ మాదిగ, ఓయూ నాయకులు కనకపూడి మహేంద్ర మాదిగ,పోతుగంటి ఉదయ్ కిరణ్ మాదిగ,ధార సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.1
- టీమిండియా తదుపరి కెప్టెన్ సంజూ శాంసన్? మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు! టీ20 ప్రపంచకప్లో భారత్ సాధించిన అద్భుత విజయం తర్వాత, జట్టు భవిష్యత్తు నాయకత్వంపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. వార్తలోని ముఖ్యాంశాలు: కైఫ్ జోస్యం: సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 జట్టుకు నాయకత్వం వహించే అన్ని అర్హతలు సంజూ శాంసన్కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్లో వీరవిహారం: ఈ మెగా టోర్నీలో సంజూ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించారు. కీలక ఇన్నింగ్స్: సెమీ ఫైనల్ మరియు ఫైనల్ వంటి హై-ప్రెషర్ మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. నమ్మకమైన ఆటగాడు: సంజూ ప్రదర్శనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.1
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేరామాయంపేట మున్సిపల్ పాలకవర్గం సమావేశం బుధవారం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని పలురు అధికారులు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పార్టీలకతీతంగా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు. వేసవికాలంలో మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం సీసీ కెమెరాలు మల్లె చెరువు సుందరి కరణకు పాటుపడతామన్నారు. గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు1
- శివంపేట మండలం పరిధిలోని మక్దుంపూర్ గ్రామం 4వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న పాత గోడలను కూలగొట్టే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొని పనులను పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు1