logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిజం రాశాడు అని జర్నలిస్ట్ కుటుంబం పై దాడి చేశారు! గీతం జూనియర్ కాలేజీ సంస్థ వివాదం వైరల్!అనంతపురంలో గీతం జూనియర్ కాలేజీకి సంబంధించిన అక్రమాలపై కథనాలు రాసిన పాత్రికేయుడు లక్ష్మీనారాయణపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నిజం బయటపెట్టాడనే కారణంతోనే అతన్ని టార్గెట్ చేసి, ఇంటికెళ్లి కుటుంబాన్ని బెదిరించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.తప్పు ఉందని భావిస్తే చట్టపరంగా పోరాడాల్సింది పోయి, దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక జర్నలిస్టుపై దాడి అంటే… నిజం మీద దాడి చేసినట్టే.ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

12 hrs ago
user_Duppada Anandarao
Duppada Anandarao
Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

నిజం రాశాడు అని జర్నలిస్ట్ కుటుంబం పై దాడి చేశారు! గీతం జూనియర్ కాలేజీ సంస్థ వివాదం వైరల్!అనంతపురంలో గీతం జూనియర్ కాలేజీకి సంబంధించిన అక్రమాలపై కథనాలు రాసిన పాత్రికేయుడు లక్ష్మీనారాయణపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నిజం బయటపెట్టాడనే కారణంతోనే అతన్ని టార్గెట్ చేసి, ఇంటికెళ్లి కుటుంబాన్ని బెదిరించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.తప్పు ఉందని భావిస్తే చట్టపరంగా పోరాడాల్సింది పోయి, దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక జర్నలిస్టుపై దాడి అంటే… నిజం మీద దాడి చేసినట్టే.ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.
    1
    రఘురామకృష్ణ జోక్యంపై ఆగ్రహం – మాల, మాదిగల గౌరవానికి భంగం కలిగిస్తే వదిలిపెట్టం: మంద కృష్ణ మాదిగ
ఆకివీడు/భీమవరం: ఆకివీడు వ్యవహారంలో రఘురామకృష్ణ జోక్యం చేసుకుంటే ఊరుకోమని, మాల, మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యలనైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. దళితుల గౌరవం, హక్కుల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
ఆకివీడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన, మాల, మాదిగలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజంలో దళితుల గౌరవాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
దళిత సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరాయి.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య కారణంగా తాను ఎన్నికల ప్రచారానికి హాజరు కాలేకపోయానని, చివరి నాలుగు రోజులు ప్రచారంలో పాల్గొంటే కనీసం నాలుగు వార్డుల్లో విజయం సాధించేవాళ్లమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఇటీవల నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. వివరాల ప్రకారం, వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో చివరి దశ కీలకమైందని, అదే సమయంలో తన అనారోగ్యం కారణంగా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయానని అజయ్ కుమార్ తెలిపారు. ప్రచారం చివరి రోజుల్లో నాయకత్వం, సమన్వయం కీలక పాత్ర పోషిస్తుందని, ఆ లోటు పార్టీకి ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను ఆరోగ్యంగా ఉంటే చివరి నాలుగు రోజులు ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొనేవాడిని. అప్పుడు పరిస్థితి మారేది. కనీసం నాలుగు వార్డుల్లో మన పార్టీ విజయం సాధించేది,” అని అన్నారు. అలాగే పార్టీ శ్రేణులు చేసిన కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు సాగాలని సూచించారు. వైరా మున్సిపాలిటీ ఫలితాలపై పార్టీ లోపల విశ్లేషణ జరుగుతోందని, ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి సరిదిద్దుకుంటామని ఆయన తెలిపారు. స్థానిక స్థాయిలో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడం, కేడర్‌ను సమన్వయం చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో భాగంగా నాయకుల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
    1
    వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య కారణంగా తాను ఎన్నికల ప్రచారానికి హాజరు కాలేకపోయానని, చివరి నాలుగు రోజులు ప్రచారంలో పాల్గొంటే కనీసం నాలుగు వార్డుల్లో విజయం సాధించేవాళ్లమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఇటీవల నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.
వివరాల ప్రకారం, వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో చివరి దశ కీలకమైందని, అదే సమయంలో తన అనారోగ్యం కారణంగా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయానని అజయ్ కుమార్ తెలిపారు. ప్రచారం చివరి రోజుల్లో నాయకత్వం, సమన్వయం కీలక పాత్ర పోషిస్తుందని, ఆ లోటు పార్టీకి ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నేను ఆరోగ్యంగా ఉంటే చివరి నాలుగు రోజులు ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొనేవాడిని. అప్పుడు పరిస్థితి మారేది. కనీసం నాలుగు వార్డుల్లో మన పార్టీ విజయం సాధించేది,” అని అన్నారు. అలాగే పార్టీ శ్రేణులు చేసిన కృషిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు సాగాలని సూచించారు.
వైరా మున్సిపాలిటీ ఫలితాలపై పార్టీ లోపల విశ్లేషణ జరుగుతోందని, ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించి సరిదిద్దుకుంటామని ఆయన తెలిపారు. స్థానిక స్థాయిలో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడం, కేడర్‌ను సమన్వయం చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో భాగంగా నాయకుల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
    user_Sai Lakshman
    Sai Lakshman
    ఎంకూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఇలికియా.. * రాష్ట్రవ్యాప్తంగా 9వ తేదీనే రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. * ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఏ. కొండూరు మండలం వెస్ట్ మాధవరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. * సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 702మంది రైతులకు గ్రామసభలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని తెలిపిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా.. * సీఎం పర్యటనను దిగ్విజయం చేసేందుకు అధికార యంత్రాంగం సమిష్టి కృషితో పనిచేయాలని ఆదేశించిన-కలెక్టర్ జి. లక్ష్మి శా,జేసీ ఇలికియా.. * ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో ఏ.కుమార్, సీఐ గిరిబాబు, ఎస్సై. గంధం. మహాలక్ష్మణడు వివిధ శాఖల అధికారులు..
    1
    సభా ప్రాంగణాన్ని, హెలిప్యాడ్ స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఇలికియా..
* రాష్ట్రవ్యాప్తంగా 9వ తేదీనే రాజముద్రతో ముద్రించిన  పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
* ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఏ. కొండూరు మండలం వెస్ట్ మాధవరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని  రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్న  సీఎం చంద్రబాబు..
* సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 702మంది రైతులకు గ్రామసభలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారని తెలిపిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశా..
* సీఎం పర్యటనను దిగ్విజయం చేసేందుకు అధికార యంత్రాంగం సమిష్టి కృషితో పనిచేయాలని ఆదేశించిన-కలెక్టర్ జి. లక్ష్మి శా,జేసీ ఇలికియా..
* ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో ఏ.కుమార్, సీఐ గిరిబాబు, ఎస్సై. గంధం. మహాలక్ష్మణడు వివిధ శాఖల అధికారులు..
    user_చల్లా రవీంద్ర బాబు
    చల్లా రవీంద్ర బాబు
    Engineer ఎన్టీఆర్•
    6 hrs ago
  • సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి చౌరస్తా వద్ద ఈ రోజు నిర్వహించిన రైతుల ధర్నాలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో అమలు చేస్తున్న గ్రేడ్‌ల విధానం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎన్నో ఆశలతో, అప్పులు చేసి, ఎండను వానను లెక్కచేయకుండా పంట పండిస్తారని, కానీ ధాన్యం అమ్ముకునే సమయంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు నాయకులు తెలిపారు. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, మిల్లర్ల నిర్లక్ష్యం, గ్రేడ్‌ల పేరుతో కోతలు విధించడం రైతులను మరింత ఆర్థికంగా దెబ్బతీస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి నిలిపివేయడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని, రైతులు రాత్రింబవళ్లు ధాన్యం దగ్గరే కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాగునీరు, టెంట్లు, హమాలీల సౌకర్యాలు కూడా సరైన విధంగా లేవని విమర్శించారు. తేమ, రంగు, గ్రేడ్ పేర్లతో ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అదే ధాన్యాన్ని తర్వాత మిల్లర్లు తీసుకుంటున్న పరిస్థితి రైతుల్లో అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, గ్రేడ్‌ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే మంగళవారం భారీ సంఖ్యలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
    1
    సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి చౌరస్తా వద్ద ఈ రోజు నిర్వహించిన రైతుల ధర్నాలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో అమలు చేస్తున్న గ్రేడ్‌ల విధానం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులు ఎన్నో ఆశలతో, అప్పులు చేసి, ఎండను వానను లెక్కచేయకుండా పంట పండిస్తారని, కానీ ధాన్యం అమ్ముకునే సమయంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు నాయకులు తెలిపారు. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, మిల్లర్ల నిర్లక్ష్యం, గ్రేడ్‌ల పేరుతో కోతలు విధించడం రైతులను మరింత ఆర్థికంగా దెబ్బతీస్తోందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి నిలిపివేయడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని, రైతులు రాత్రింబవళ్లు ధాన్యం దగ్గరే కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాగునీరు, టెంట్లు, హమాలీల సౌకర్యాలు కూడా సరైన విధంగా లేవని విమర్శించారు.
తేమ, రంగు, గ్రేడ్ పేర్లతో ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అదే ధాన్యాన్ని తర్వాత మిల్లర్లు తీసుకుంటున్న పరిస్థితి రైతుల్లో అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, గ్రేడ్‌ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేకపోతే వచ్చే మంగళవారం భారీ సంఖ్యలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    15 hrs ago
  • గుంటూరు: ప్రత్తిపాడు మండలం గోట్టిపాడు గ్రామంలో బారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు వరిగడ్డివాములు ఓక లారీ దగ్థం దగ్ధమైంది.వరిగడ్డివాములు గరికపాటి లక్షమయ్య GLR Buolls.. సబందించినవి.షుమారు 25లక్షలు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
    1
    గుంటూరు:
ప్రత్తిపాడు మండలం
గోట్టిపాడు గ్రామంలో బారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
నాలుగు వరిగడ్డివాములు
ఓక లారీ దగ్థం దగ్ధమైంది.వరిగడ్డివాములు గరికపాటి లక్షమయ్య GLR Buolls.. సబందించినవి.షుమారు 25లక్షలు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అమరావతి మండలంలో ఆదివారం సాయంకాలం వాతావరణం లో మార్పు వచ్చింది. ఆకాశం మబ్బులు కన్నాయి. ఈదురు గాలులు వీస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రోడ్లపై దుమ్ము ధూళి సుడిగాలిలా తిరుగుతూ గాలి వీచింది. వడగాల్పులు రావడంతో ప్రజలు ఇళ్ళకు చేరుకున్నారు. వాహనదారులు ఈదురుగాలులకు ప్రయాణం చేసేందుకు ఇబ్బందులు గురయ్యారు.
    1
    అమరావతి మండలంలో ఆదివారం సాయంకాలం వాతావరణం లో మార్పు వచ్చింది. ఆకాశం మబ్బులు కన్నాయి. ఈదురు గాలులు వీస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. రోడ్లపై దుమ్ము ధూళి సుడిగాలిలా తిరుగుతూ గాలి వీచింది. వడగాల్పులు రావడంతో ప్రజలు ఇళ్ళకు చేరుకున్నారు. వాహనదారులు ఈదురుగాలులకు ప్రయాణం చేసేందుకు ఇబ్బందులు గురయ్యారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    13 hrs ago
  • ఆంధ్రా డ్రై ఫ్రూట్ స్టోర్ గుంటూరు లో.... మూడు బ్రాంచిలలో అందుబాటులో కలదు... గుంటూరు లో ఎక్కడ లభించని క్వాలిటీ డ్రై ఫ్రూట్ ఇక్కడ లభించును....
    1
    ఆంధ్రా డ్రై ఫ్రూట్ స్టోర్ 
గుంటూరు లో.... మూడు బ్రాంచిలలో
అందుబాటులో కలదు...
గుంటూరు లో ఎక్కడ లభించని క్వాలిటీ డ్రై ఫ్రూట్ ఇక్కడ లభించును....
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.