Shuru
Apke Nagar Ki App…
రామయంపేట ఐదో వార్డ్ కౌన్సిలర్ చౌదరి చరిత పరిశుభ్రంపై ఆడిటోరియంలో ప్రసంగం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
మెదక్ న్యూస్
రామయంపేట ఐదో వార్డ్ కౌన్సిలర్ చౌదరి చరిత పరిశుభ్రంపై ఆడిటోరియంలో ప్రసంగం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
More news from తెలంగాణ and nearby areas
- విద్యార్థులు తమలోని భయాన్ని పూర్తిగా విడనాడి పట్టుదల, క్రమశిక్షణతో చదివిపదవ తరగతి ఫలితాలలో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి, రాష్ట్రంలో మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు .పదవ తరగతి పరీక్షలు నిమిత్తం విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్. 9848214166. ఏర్పాటుపదవ తరగతి పరీక్షలు విద్యార్థులు మరియు అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా లో పదవ తరగతి పరీక్షలు ఈ నెల 14.03.2026 నుండి 16.04.2026 వ తేది వరకు నిర్వహణ మొత్తం 68 రెగ్యులర్ సెంటర్ లలో జరగనున్నాయి. మొత్తం 11247 మరియు 100 ప్రైవేట్ అభ్యర్థులు ఈ పరీక్షలకుహాజరవుతున్నారని చెప్పారు. ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా కోరటమైనది.: ఉదయం 09.30 నుండి 12.30/12.50 PM వరకు జరుగుతుంది,విద్యార్థులు వారికీ కేటాయించిన పరీక్షా కేంద్రమును ఒక రోజు ముందుగా సందర్శించి పరీక్షా ప్రారంభపు తేది రోజు పరీక్షా కేంద్రం చేరుకొనుటకు గల అవాంతరాలను/ ఆలస్యాన్ని నివారించడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విద్యార్థులకు జారీ చేయబడిన పరీక్షా హాల్ టికెట్ నందు గానీ, OMR షీట్ నందు గానీ ఏవైన ప్రింటింగ్ పొరపాట్లు ఉంటె సంబందిత ఆధార ప్రతులతో ఇన్విజిలేటర్ లేదా చీఫ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. పరీక్షా కేంద్రంలోని పరీక్షా నిర్వహణ సిబ్బందికి సూచనలు.పరీక్షా కేంద్రం నకు కేటాయించబడిన సిబ్బంది అందరు గుర్తింపు కార్డ్లను ధరించవలెను. పరీక్షా కేంద్రంలో పరీక్షా నిర్వహణకు కేటాయించబడిన సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం నిషేధించబడిందని చెప్పారు. పరీక్షా కేంద్రంలోని ముఖ్య పరీక్షా పర్యవేక్షకుని అనుమతిలేనిదే ఎవ్వరు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదని వెల్లడించారు. పరీక్షా కేంద్రంనకు చుట్టుపక్కల 100 మీటర్ల వరకు 163 B.N.S.S సెక్షన్ అమలులో ఉన్నందున జనం సమూహాలుగా గుమిగూడి ఉండుట నిషేధంఅని చెప్పారు.ఆయా పరీక్షా తేదిలలో ఉదయం 8.00 నుండి సాయంత్రంశ 01.00 గంటల వరకు జీరాక్స్ సెంటర్లు మూసి వుంచవలెను. పరీక్షా కేంద్రం లోకి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు ఆఫీసర్, ఇన్విజిలేటర్, మెడికల్ సిబ్బంది, అటెండర్, వాటర్ బాయ్స్, అభ్యర్థులు మరియు ఇతర పరీక్షా నిర్వహణ సిబ్బంది ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్, పేజర్లు & క్యాలక్యులేటర్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రావడం నిషేధం. అని తెలిపారు. కేంద్రంలో గుర్తించినట్లయితే సంబందికులపై ప్రభుత్వ పరిక్షల మాల్ ప్రాక్టీసు నిరోధక చట్టం 25/1997 ప్రకారం క్రమ శిక్షణ చర్యలు చేపట్టబడును. అని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం నందు ఏదైనా అత్యవసర సమాచారం తెలియజేయుటకు ఆయా పరీక్షా కేంద్రములకు ఆయా తేదిలలో విధులు కేటాయించబడిన పోలీస్ సిబ్బంది యొక్క ఫోన్ ను మాత్రమే వినియోగించవలెను. వివరించారు. ఇట్టి వినియోగానికి కూడా' కాల్ రిజిస్టర్ నిర్వహించి ఇన్కమింగ్ మరియు ఔట్గోయింగ్ కాల్స్ ను విధిగా రిజిస్టర్ ఇంతకముందే సరఫరా చేయబడిన పరిక్షల నిర్వహణ-శిక్షణా-కరదీపికలోని సూచనలను పాటిస్తూ సజావుగా పరిక్షల సహకరించవలసినదిగా కోరారు.1
- కామారెడ్డి: 'కిడ్నీ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి' కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి అడిషనల్ వైద్యాధికారి వెంకటేశ్వర్లు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిడ్నీ పనితీరుపై ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కిడ్నీ పనితీరును ఆయన వివరించారు. కార్యక్రమంలో డయాలసిస్ సెంటర్ మేనేజర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది ఉన్నారు.1
- గజ్వేల్, సిద్దిపేట జిల్లా 13 మార్చి 2026 : ప్రజా తెలంగాణ న్యూస్/ రామాయణ రచయిత్రి, తొలి తెలుగు కవియిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని ఆమె విగ్రహానికి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్ మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే 14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలుగు సాహితీ వనంలో మొల్లమాంబ అజరామరమైన ముద్ర వేశారని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ, తన ప్రతిభతో రామాయణాన్ని సరళమైన తెలుగులో అందించిన ఆమె స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళా లోకానికి ఆమె ఒక మార్గదర్శి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షులు మోహన్నగారి రాజు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, జంగం రమేష్ గౌడ్, చిట్కుల శివారెడ్డి, శేఖర్, కుమ్మర సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.4
- పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్ డెవలప్ అయితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది.1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్1
- జగిత్యాల : 👉 పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి 👉 జిల్లా మొత్తం మీద 68 పరీక్ష కేంద్రాలు 12,964 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం జగిత్యాల జిల్లాలో 10వ పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, జగిత్యాల జిల్లాలో మొత్తం 12,964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందుకుగాను 68మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు 5 గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, ఇన్విజిలేటర్ల నియామకంతోపాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వివరించారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి వైద్య సహకారం, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతీ పరీక్షకు మధ్యన ఉన్న విరామం రోజుల్లో మరుసటి పరీక్షకు సంబంధించి, విద్యార్థులు ఎలాంటి సందేహాలున్నాకూడ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించడం కూడా జరిగిందని తెలిపారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.1
- ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామ అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యేమైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, సర్పంచులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నోడల్ అధికారి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ లుజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంబించారు. అనంతరంతెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే.. తో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. పట్టణ ,గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్కర కార్యక్రమం ఇది అని అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే స్వభావాన్ని కలిగి ఉండాలన్నారు. 99 రోజుల్లో అనేక కార్యక్రమాల చేపడుతునట్లు చెప్పారు. సుబిక్షమైన పట్టణ ,పల్లెల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అబివృద్ధి , ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం నిరతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, జీరో విద్యుత్,సన్నబియ్యం,మెడికల్ కాలేజీ,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం లాంటి అనేక పథకాలు చేపట్టామన్నారు.అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తీర్చి, పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతను కాపాడాలని,రోడ్డు ప్రమాదాల.వల్ల రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి,డ్రగ్స్,సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నోడల్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టణ,గ్రామీణ ప్రజా ప్రతినిధుల పదవి చిన్నదైన బాధ్యత పెద్దదన్నారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా అవసరాలను తీర్చాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..పట్టణ,గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కారం చూపించాలన్నారు . అంతకు ముందు సమాచార పౌర సంబంధాల శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల ఫోటోల ఎగ్జిబిషన్ ను అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తిలకించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. #comment #follow #subscribe #news #like1
- కామారెడ్డి: 'ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శం కావాలి' ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆకాంక్షించారు. గురువారం కామారెడ్డిలో సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. '99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక'లో భాగంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామాల బాగు కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యతనిస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.1
- ఫార్మా, ఐటి లాగే ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం1