Shuru
Apke Nagar Ki App…
లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు. కామారెడ్డి జిల్లాలోని దొంగలి మండల కేంద్రంలోని లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు.
Dantulwar Sopan D
లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు. కామారెడ్డి జిల్లాలోని దొంగలి మండల కేంద్రంలోని లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు.
More news from తెలంగాణ and nearby areas
- లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు. కామారెడ్డి జిల్లాలోని దొంగలి మండల కేంద్రంలోని లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు.1
- మాల మహానాడు ఆధ్వర్యంలో బోధన్లో నిరసన, అమర ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం, అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు.. దళిత సంఘ నాయకులు ఆగ్రహం బోధన్, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమర ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయనపై తప్పుడు ప్రచారానికి దారితీసే విధంగా పుస్తకాన్ని రచించి విడుదలకు ప్రయత్నించడం దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసే చర్యలని అన్నారు. అంబేద్కర్ కృషి, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని అవమానించే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు.అమర ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో మాల మహానాడు నాయకులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు, ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు దళిత సమాజం ఐక్యంగా ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, బోధన్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నాయకులు, పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.4
- ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం బాన్సువాడ, గురువారం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, వినాయకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. మండపం పరిసరాలు భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతూ, గణేశుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. గురువారం నాడు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నాగులగామ వందన గోపీనాథ్ గుప్త, రాహుల్ ఆటోమొబైల్, మోటమర్రి సంధ్యరాణి, నాగరాజు గుప్త, త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ వారి చేతుల మీదుగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ, ప్రతిరోజూ భక్తి భావంతో నిత్య అన్నదానాలు నిర్వహిస్తూ వినాయకుని కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. గణేశుని ఆటపాటలు, భజనలతో కాలనీ అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయిందని తెలిపారు.4
- నిజామాబాద్లో అర్ధరాత్రి బుల్లెట్ బైక్ హల్చల్.. శబ్ద కాలుష్యానికి కారణమైన బైక్ సీజ్! నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ అధిక శబ్దంతో బుల్లెట్ బైక్ నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన బుల్లెట్ బైక్కు అధిక శబ్దం చేసే సైలెన్సర్ను అమర్చుకొని, అర్ధరాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని, పబ్లిక్ న్యూసెన్స్ మరియు శబ్ద కాలుష్యానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ స్పందిస్తూ, అధిక శబ్దం చేసే లేదా నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన సైలెన్సర్లను వాహనాలకు అమర్చుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చుకున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని కమిషనర్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వాహనాలు నడపాలని పోలీస్ శాఖ సూచించింది. శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టేందుకు నిజామాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.1
- ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు గంగారం పిలుపు ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలి సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపు గడ్కోల్లో కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న పాలక వర్గాల విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాటాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గడ్కోల్లో గురువారం మూడవ రోజు కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని పెంచుతూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని పోటు రంగారావు విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తదితర విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల చిరు వ్యాపారులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాలపై అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. రైతుల సమస్యలపై కూడా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు హక్కులు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణ తరగతుల్లో పలు అంశాలపై బోధన రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా మూడవ రోజు ‘భూగోళ చరిత్ర’ అంశాన్ని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు బోధించగా, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ అంశంపై జీ. భార్గవ్ బోధించారు. కార్యక్రమంలో సెక్రటేరియట్ సభ్యులు కెచ్చల రంగయ్య, కట్ట రమా, వి. ప్రభాకర్, వి. కృష్ణ, చిన్న చంద్రన్న, ఎం. కృష్ణ, సూర్యం, హన్మేశ్, ఎస్.ఎల్. పద్మతో పాటు రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, బి. రాము, జి. రామయ్య, సి.వై. పుల్లయ్య, నందిరామయ్య, జిల్లా నాయకులు ఆర్. రమేష్, బి. దేవరం, ఆర్. దామోదర్, బి. బాబన్న, కిషోర్, రమేష్, రమ, సత్తెమ్మ, పుష్ప, జమున, లావణ్య తదితరులు పాల్గొన్నారు.2
- బాసర మండల కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు..అధికారులు... నిర్మల్ జిల్లా // బాసర 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు : *తహసీల్దార్ పవన్ చంద్ర ఝకాటే...* 13 నెలల సాయుధ పోరాటం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేసిన రోజు : *ఎంపిడిఓ దేవేందర్* *ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు.. ప్రజా పాలన స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దాం. రాజ్యాంగ విలువలను కాపాడుదాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం. : *సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్* బాసర లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.. ఆయా ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు పాఠశాల ల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు.. నాయకులు...1
- చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.1
- సిరికొండలో తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ సిరికొండలో తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే సాయంత్రం ప్రతి ఇంటిలో ‘ఆశీర్వాద దీపం’ వెలిగించి ప్రధానికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో పాల్గొనాలని సిరికొండ మండల ప్రజలకు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుర్రం సంజీవరెడ్డి, నక్క రాజేశ్వర్, చింతకుంట రామస్వామి, తలకట్ల గంగారెడ్డి, ధర్పల్లి బాబురావు, చౌటుపల్లి ప్రభాకర్, లింబ గౌడ్, బందేల ధర్మపురి, రంజిత్ రెడ్డి, బచ్చు మారుతి, జంగం గంగాధర్, రాకేష్, దాసు, గ్యామా గంగాదాస్, దాసరి లింబాద్రి, సాయ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1