Shuru
Apke Nagar Ki App…
ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు., పట్టణంలో సందడి చేసిన మహిళామణులు పవర్ హౌజ్ కాలనీలో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కౌశిక లత మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆషాఢ మాస గోరింటాకు వేడుకల్లో మహిళామణులు పాల్గొనడం అభినందనీయమన్నారు.
Telangana reporter
ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు., పట్టణంలో సందడి చేసిన మహిళామణులు పవర్ హౌజ్ కాలనీలో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కౌశిక లత మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆషాఢ మాస గోరింటాకు వేడుకల్లో మహిళామణులు పాల్గొనడం అభినందనీయమన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.1
- ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ మద్దతు | హైదరాబాద్ | ఆగస్టు 04: తెలంగాణ రక్షణ సేన నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ నిరంతరం అండగా నిలిచి, వారి డిమాండ్లు నెరవేరే వరకు పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి గణేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- సామాజిక న్యాయం మాకు నినాదం కాదు అది మా విధానం. జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్ర కేవలం కవితమ్మ ఒక్కతే బడుగు బలహీన వర్గాల గొంతుకగాఉంది. అరోవ తేదీన జరిగే సమాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేద్దాం. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన అసెంబ్లీ సమావేశం ఈరోజు నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని ఎర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశానికి హజరైన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ ఆద్వర్యంలో ఈనెల 6వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కు విజయవంతం చెయ్యాలని కోరారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ సామాజిక న్యాయం మా పార్టీ నినాదం కాదు అది మా విధానం అని ప్రకటించిన గొప్ప నాయకురాలు అని, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టంగా చెబుతోంది. ఇప్పటివరకు మనల్ని పాలించిన పాలకుల వివక్ష కారణంగా ఇప్పటికీ సమాజంలోని అనేక వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని సామాజిక న్యాయం అంటే కేవలం సంక్షేమ పథకాలు ప్రకటించడం కాదు. అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, భూమి, ఆరోగ్యం, ఇలా అన్ని వర్గాల ప్రజలతో సమానంగా నాణ్యమైన జీవన విధానాన్ని అందించడంలో ఈ పాలకులు వివక్ష చుపించినారు. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి. కానీ రిజర్వేషన్ల అమలులో కానీ సంక్షేమ నిధుల పారదర్శక వినియోగించాడంలో కానీ అనాగరిక వర్గాల ప్రజల కోసం చట్టాల సమర్థవంతంగా అమలు చేయడంలో కానీ పూర్తిగా విఫలం కావడంతోనే సమాజం ఇప్పటికీ ఇల్లు లేని పేదలు, చదువు లేని వర్గాలు, కనీసం రొడ్డు కరెంటు లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి అంటే అది పూర్తిగా పాలకుల వైఫల్యం అని వారు అన్నారు. అందుకే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ సామాజిక న్యాయం మా విధానం అని ప్రకటించి సమాజం వివక్షకు గురైన ప్రజల కోసం వారు తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించారు పాంచజన్యంలో ప్రదానంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగ పడేవిధంగా సమాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అని రాజకీయ నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణను కవితమ్మ ఈనెల అరోవ తేదీన సరూర్నగర్ ప్రకటించాబోతున్నారు. అందుకే కరీంనగర్ నియోజకవర్గం నుండి కూడ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, కవితమ్మ అభిమానులు పెద్దఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలోకరింనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజ్, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాలి పెళ్లి రత్నాకర్, రంగరవేణి లక్ష్మణ్, యండి రాజీ, పూసల పవన్, గర్షకుర్తి విద్యాసాగర్, భాసవేణి రాజేందర్, ఎండి హుస్సేన్, ఉమార్, మడిపల్లి వినీత్, పూసాల రణధీర్ నూతి సాయిచరణ్, మహిళ విభాగం నాయకురాలు పిన్నింటి సంగీత రెడ్డి, జంగా అపర్ణ, కృష్ణవేణి, కొరిమి పద్మ, పల్లె శారద తదితరులు పాల్గొన్నారు.1
- ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ సర్వీస్ రావాలి: ఎమ్మెల్యే సూచన ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే అటవీశాఖ అధికారులలో ఫ్రెండ్లీ సర్వీస్ రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలుప్ చేశారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో అడవులలో ఉండే ఆదివాసులతో పాటు ప్రజలతో మంచిగా వ్యవహరించే తీరును నేర్చుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్పంచులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తుంటారని, వారికి మర్యాదనిస్తూ అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు. అటవీశాఖ శాఖ అధికారుల పనితీరుతో పాటు వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చి ప్రజల మద్దతు పొందాలని ఆయన కోరారు.1
- ఛైర్మన్తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్గ్రేడ్, మెడికల్ ఫిట్నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.1
- వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం... 55 శాతం పనులు పూర్తయినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.2
- బంకీపూర్ ఉప ఎన్నికల్లో ఓటమి బిజెపి కి గుణపాఠం., CPI ml మాస్ లైన్ ప్రజాపంథా నేత జూపాక శ్రీనివాస్ బంకిపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురైన ఓటమి దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పేర్కొన్నారు.1
- ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన మంగళవారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. శిశువుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం ఏటూరునాగారం సీహెచ్సీ ఆసుపత్రిని పరిశీలించి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సీజనల్ వ్యాధులు, వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఎస్డీసీ ప్రతాప్, బీడబ్ల్యూఓ ప్రేమలత, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్, ఆత్మ కమిటీ సభ్యుడు రఘు,స్థానిక సర్పంచ్ శ్రీలత, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1