"ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కు డాక్టరేట్" కాగజ్ నగర్ : కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న ఇట్నూరి శారద ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇటీవల పిహెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందినట్లు ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి తెలిపారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న కె.ప్రేమలత పర్యవేక్షణలో "డిజైన్, సింథసిస్ అండ్ కంప్యుటేషనల్ స్టడీస్ ఆఫ్ ఇండోల్ - ఆంటి క్యాన్సర్ ఏజెంట్స్" అనే అంశంపై పరిశోధన పూర్తి చేయగా ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం శారదకు డాక్టరేట్ ప్రకటించింది.ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఇ శారదను ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి. లక్ష్మీనరసింహం అకాడమిక్ కోఆర్డినేటర్ డి. జనార్ధన్ అధ్యాపకులు ఎం రాజేశ్వర్, ఆర్ కృష్ణవేణి, డాక్టర్ వి దేవేందర్, బి రోజ్ మేరీ శాంభవి, సానియా పాల్గొన్నారు.
"ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కు డాక్టరేట్" కాగజ్ నగర్ : కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న ఇట్నూరి శారద ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇటీవల పిహెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందినట్లు ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి తెలిపారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం లో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న కె.ప్రేమలత పర్యవేక్షణలో "డిజైన్, సింథసిస్ అండ్ కంప్యుటేషనల్ స్టడీస్ ఆఫ్ ఇండోల్ - ఆంటి క్యాన్సర్ ఏజెంట్స్" అనే అంశంపై పరిశోధన పూర్తి చేయగా ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం శారదకు డాక్టరేట్ ప్రకటించింది.ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఇ శారదను ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి. లక్ష్మీనరసింహం అకాడమిక్ కోఆర్డినేటర్ డి. జనార్ధన్ అధ్యాపకులు ఎం రాజేశ్వర్, ఆర్ కృష్ణవేణి, డాక్టర్ వి దేవేందర్, బి రోజ్ మేరీ శాంభవి, సానియా పాల్గొన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- Post by Ravi Poreddy1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- నాను మహారాజ్1
- మడికొండ టెక్స్టైల్ పార్క్లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జనగామ జిల్లా చిల్పూర్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83,12,000 చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. టెంపుల్ సిటీ కారిడార్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సత్య ప్రసాద్, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, అధికారులు పాల్గొన్నారు.2