సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి బీసీ రాజ్యాధికార యాత్ర హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి బీసీ రాజ్యాధికార యాత్ర ప్రారంభం కానుంది. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు వంటి అంశాలను ప్రజా చర్చలోకి తీసుకురావడమే యాత్ర లక్ష్యంగా పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊడుగుల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ— “బీసీల సమస్యలు కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడే అంశాలుగా మిగలకూడదు. జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం, సమాన అవకాశాలపై స్పష్టమైన చర్చ జరగాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అదే హక్కుతో బీసీల హక్కులు, అవకాశాలపై మా పార్టీ ప్రజల మధ్య చర్చను కొనసాగిస్తుంది.” “అధికారం అంటే కేవలం పదవి కాదు—ప్రజల సమస్యలపై నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం. బీసీ యువత విద్య, నైపుణ్యం, ఉపాధి, రాజకీయ అవగాహనతో ముందుకు రావాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల కోసం గొంతు వినిపించాలి” అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు, యువత మరియు ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. — ఊడుగుల ఐలయ్య యాదవ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తెలంగాణ రాజ్యాధికార పార్టీ
సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి బీసీ రాజ్యాధికార యాత్ర హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి బీసీ రాజ్యాధికార యాత్ర ప్రారంభం కానుంది. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు వంటి అంశాలను ప్రజా చర్చలోకి తీసుకురావడమే యాత్ర లక్ష్యంగా పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊడుగుల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ— “బీసీల సమస్యలు కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడే అంశాలుగా మిగలకూడదు. జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, నిర్ణయ ప్రక్రియలో భాగస్వామ్యం, సమాన అవకాశాలపై స్పష్టమైన చర్చ జరగాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అదే హక్కుతో బీసీల హక్కులు, అవకాశాలపై మా పార్టీ ప్రజల మధ్య చర్చను కొనసాగిస్తుంది.” “అధికారం అంటే కేవలం పదవి కాదు—ప్రజల సమస్యలపై నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం. బీసీ యువత విద్య, నైపుణ్యం, ఉపాధి, రాజకీయ అవగాహనతో ముందుకు రావాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో హక్కుల కోసం గొంతు వినిపించాలి” అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు, యువత మరియు ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. — ఊడుగుల ఐలయ్య యాదవ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తెలంగాణ రాజ్యాధికార పార్టీ
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- మేడే కాలనీలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలు.. స్కూల్ ఎదుట అధ్వానంగా ఉన్న పరిస్థితులపై సర్పంచ్ పరిశీలన... సారపాక: మేడే కాలనీలోని పాఠశాల ఎదుట అధ్వానంగా ఉన్న డ్రైనేజీ, రహదారి సమస్యలను సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు, స్థానికులు రాకపోకలు సాగించే ప్రాంతంలో డ్రైనేజీ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. రహదారి పరిస్థితిని కూడా పరిశీలించిన ఆయన సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థల హద్దులకు సంబంధించిన విషయంలో సర్పంచ్, కొందరు స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పాఠశాల ఎదుట ఉన్న స్థలం తమ పరిధిలోకి వస్తుందనే విషయంలో ఇరువర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ సమస్యతో మురుగునీరు సక్రమంగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, రహదారి సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొన్నారు. పాఠశాల పరిసరాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే స్థల హద్దుల విషయంలో తలెత్తిన వివాదానికి సంబంధించి సంబంధిత రికార్డులను పరిశీలించి, అధికారుల సమక్షంలో హద్దులను నిర్ధారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమస్యపై అధికారులు స్పందించి పాఠశాల పరిసరాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరుతున్నారు.4
- భద్రాచలానికి మూడో వంతెన పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్గిరి రైల్వే లైన్కు కృతజ్ఞతగా మోదీ చిత్రపటానికి పాలాభిషేకం భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల రైల్వే కలను సాకారం చేసే దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాండురంగాపురం–భద్రాచలం–మల్కాన్గిరి 173.61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ను మంజూరు చేయడాన్ని* స్వాగతిస్తూ భద్రాచలంలో బీజేపీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.* ముఖ్య అతిథిగా పాల్గొన్న *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి* మాట్లాడుతూ.. భద్రాచలం ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న రైల్వే కనెక్టివిటీ కోసం గతంలో *పాండురంగాపురం–సారపాక వరకు సుమారు 8 కి.మీ. రైల్వే లైన్ను* కోరుకున్నామని, అయితే మోదీ ప్రభుత్వం *పాండురంగాపురం నుంచి భద్రాచలం మీదుగా మల్కాన్గిరి వరకు 2864 కోట్లతో 2031లోగా పూర్తి చేసేలా 173.61 కి.మీ. రైల్వే లైన్ను మంజూరు చేయడం* గొప్ప విషయమన్నారు. ఈ ప్రాజెక్టులో *భద్రాచలం వద్ద గోదావరిపై మూడో రైల్వే వంతెన నిర్మాణం* జరగడం ద్వారా భద్రాచలం నేరుగా రైల్వే నెట్వర్క్తో అనుసంధానం కానుందని తెలిపారు. ఇది *దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం* ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచడంతో పాటు, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల *విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అభివృద్ధికి* ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి *భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసి, ఎలాంటి జాప్యం లేకుండా రైల్వే శాఖకు భూమిని అప్పగించాలని* బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో *బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్, కందుల రాంకిషోర్, పసుమర్తి సతీష్, అట్లూరి రఘురామ్, ములిశెట్టి రాంమోహన్ రావు, ముత్యాల శ్రీనివాస్, కండ్రపు త్రినాథ్ రెడ్డి, నూప రమేష్, రామెళ్ళ రాజశేఖర్, పెద్ది జగపతి బాబు, నిడదవోలు నాగబాబు, తాటిపాముల ఐలయ్య, ముత్యాల చంద్రశేఖర్, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ములిశెట్టి నిఖిల్, షేర్ శ్రీను, జీవా, మాలోత్ సాయి, కారం చిన్నయ్య, కోర్స గంగరాజు, సోలం చంటిబాబు* తదితరులు పాల్గొన్నారు.1
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- భూ వివాదం లో ఎస్ ఐ తలదూర్చారంటు దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ కుటుంబం ధర్నా.. మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు తూర్పు తండా కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి కి చెందిన కుటుంబం ధర్నా దిగింది.. దంతాల పల్లి ఎస్ ఐ రవి కుమార్ మా భూమి విషయం లో కలుగ చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.. మాకు న్యాయం చేయాలనీ లేనట్టాయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలనీ బాధిత కుటుంబం వేడుకుంటుంది..1
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్స్టాగ్రామ్లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.1