Shuru
Apke Nagar Ki App…
Shyam
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- దేవీపట్నం మండలంలో ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి పరిశీలించారు. గురువారం దామనపల్లి ఆశ్రమ స్కూల్, శరభవరం గిరిజన సంక్షేమ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధుతులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాల రిజిస్టర్లు పరిశీలించారు.1
- *International Fleet Review &Milan -2026 "అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో "ఎంపీ కలిశెట్టి* రామకృష్ణ బీచ్, విశాఖపట్నం, తేది. 19.02.2026. ⭐ విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు గౌరవ అతిథిగా ఈరోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ& మిలాన్-2006 నౌకదళ విన్యాసాలలో పాల్గొన్నారు. ⭐ గౌరవ ఎంపీ గారు IFR గురించి మాట్లాడుతూ గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు విశాఖపట్నం రెండోసారి వేదిక కావడం, నిన్న గౌరవనీయులు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 70కి పైగా స్వదేశీ, విదేశీ యుద్దానౌకలను సమీక్షించడం మన దేశానికీ,రాష్ట్రానికి గర్వకారణం అని హర్షాన్ని వ్యక్తపరుస్తూ.......... ⭐ సుమారు 50కి పైగా దేశాల నౌకదళాలు పాల్గొన్న ఈ IFR-2026లో రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే వేదిక కావడం, అలాగే విదేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక బలోపేతం చేస్తూ సముద్ర భద్రత, విపత్తుల నిర్వహణపై ఉమ్మడి వ్యూహాలను రూపొందించే బహుళ- దేశ నౌకాదళ విన్యాసాలకు వేదిక మన విశాఖపట్నం కావటం అభినందనీయమని, ఈ కార్యక్రమం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క "మహాసాగర్" విజన్ ను సాకారం చేస్తుందని, ముఖ్యంగా "మేక్ ఇన్ ఇండియా " సామర్థ్యన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేడుకకు హాజరవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ & నౌకాదళ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపిన విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు.1
- విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆసుపత్రులన్నీ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి మరియు ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి ఆసుపత్రి వ్యర్ధాల నిర్వహణా కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్ణీత సమయంలోగా తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలో రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులను ఉపయోగించి ఇంజక్షన్ సూదులు, పత్తి, గ్లౌవ్స్, శరీర వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న సుమారు 496 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పశుసంవర్ధక ఆసుపత్రుల నుంచి కూడా క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. సేకరించిన వ్యర్థాలను 48 గంటల గడువులోగా తరలించాలని, ఎక్కడా బయట కనిపించకూడదని స్పష్టం చేశారు. అంతేకాక, ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను 'బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్'లో ప్రతిరోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే నోటీసులు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటి నుంచీ బయో మెడికల్ వ్యర్ధాలను సైతం సేకరించి, సరైన పద్దతిలో వాటిని తరలించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అలాగే వ్యర్ధాలను బయట పడేసే ఆసుపత్రులపై నిఘా పెట్టాలని కోరారు.1
- మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగివేమన జయంతి ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం గారు యోగివేమన చిత్రపటానికి పుష్పమాలను తో అలంకరించారు. సంస్కృత పండితులు బౌరోతు శంకర రావు మాట్లాడుతూ 17వ శతాబ్దానికి చెందిన యోగివేమన చెప్పిన పద్యాలు అక్షర సత్యాలు. విశ్వ మానవాళికి వేమన చెప్పిన పద్యాలు వేదాలతో సమానము. వాడుకు భాషలో అందరి కి అర్థమయ్యే రీతిలో పద్యాలు చెప్పారు. వేమన శతకంలో కొన్ని పద్యాలు మాత్రమే మనకు ఎరుక . వేమన స్ఫూర్తితో శంకర శతకాన్ని రచించానని 2025 జూన్ నెల నుండి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు శంకర శతక పద్యాలు ప్రార్థనలో రోజుకు ఒక పద్యాన్ని విద్యార్థులతో చదివించ దానికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు ఉపాధ్యాయులు వేమన గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు1
- 🙏🙏1
- ఆముదాలవలస ఫిబ్రవరి 19: గ్రామీణ స్థాయిలో ప్రతి పౌరుడికి తన హక్కులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వారిని సాధికారత దిశగా నడిపించడమే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. గాజులకొల్లవలసలో గ్రామ స్థాయిలో పౌరుల సాధికారతపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హత ఉన్న ఏ ఒక్క వ్యక్తికీ సంక్షేమ పథకాలు అందకుండా పోకూడదని, నిరాకరించబడిన సందర్భాల్లో తక్షణమే సంబంధిత శాఖలతో సంప్రదించి వారికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు రేషన్ కార్డు, ఆధార్, సదరం వంటి కీలక పత్రాలు పొందేందుకు సామాన్యులకు అవసరమైన సహాయం అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని హరిబాబు ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ శాఖల ప్రయోజనాలను ప్రజల ముంగిటకే చేర్చడంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎఫ్ఐ-ఎల్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీరామ్ శ్రీనివాసరావు, జిల్లా రిసోర్స్ పర్సన్ బి. రామ్ ప్రసాద్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ శైలజ, న్యాయవాది జి. ఇందిరా ప్రసాద్, ఇతర అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.1
- Post by Shyam1