Shuru
Apke Nagar Ki App…
నల్లజర్ల మండలం అనంతపల్లి ఘోర రోడ్డు ప్రమాదం. * ముగ్గురి మృతి, మరొకరి పరిస్థితి విషమం నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Alluri DurgaPrasad
నల్లజర్ల మండలం అనంతపల్లి ఘోర రోడ్డు ప్రమాదం. * ముగ్గురి మృతి, మరొకరి పరిస్థితి విషమం నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.1
- Post by Meenakshi1
- వృద్ధులు, బాటసారులకు తక్షణ శాంతి – మే 31 వరకు నిరంతరాయ సేవలు 📍 అనపర్తి నియోజకవర్గం | 22 ఏప్రిల్ 2026 ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికమవుతున్న ఈ సమయంలో ప్రజలకు తక్షణ ఉపశమనం అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, బాటసారులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ వంటి శీతల పానీయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. “మజ్జిగ సేవించడం ద్వారా శరీరానికి చల్లదనం లభించడమే కాకుండా, వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు,” అని ఆయన వివరించారు. ఈ చలివేంద్రం ద్వారా ఏప్రిల్ 22 నుండి మే 31 వరకు సుమారు రూ.1.30 లక్షల వ్యయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన స్థానిక వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి స్వయంగా బాటసారులకు మజ్జిగను పంపిణీ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by V Ramarao1
- ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న ₹1.25 కోట్ల విలువైన 250 కిలోల గంజాయిని వై. రామవరం పోలీసులు కొమరవరం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని 10 మందిలో ఐదుగురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ 158 కిలోల గంజాయి కేసులో నిందితులుగా ఉన్న వీరిపై రంపచోడవరం డివిజన్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచామని డీఎస్పీ అష్రఫ్ తెలిపారు.1
- 🙏😭1
- పిఠాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు కేటాయించిన పట్టా భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడాన్ని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇంచార్జ్,రాష్ట్ర పిఎసి సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలోని పట్టా భూముల వద్ద బాధితులతో కలిసి ఆమె నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో పిఠాపురం పట్టణ పరిధిలోని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన స్థలంలో సుమారు 20 ఎకరాల భూమిని తెలంగాణకు చెందిన ఒక ప్రైవేటు పాఠశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. పట్టాలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా,ఇప్పటికీ ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేయకపోగా, ఉన్న భూమిని లాక్కోవడం పేదల పొట్ట కొట్టడమేనని విమర్శించారు. పట్టాదారులందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని, పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, పేదలకు ఇచ్చిన పట్టా భూములను వారికే అప్పగించి,తక్షణమే ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, పేదల హక్కులను కాలరాసే ఏ చర్యలనైనా ప్రజల పక్షాన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తేం దత్తుడు, చెల్లూరి లోవరాజు, ఖండవల్లి చిన్న లోవరాజు లబ్ధిదారులు మరియు పట్టాదారులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.2
- Post by V Ramarao1