వయోవృద్ధుల డే కేర్ సెంటర్ “ ప్రణామ్ ” ను పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి అనిత రామచంద్రన్ జగిత్యాల : జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహణలో బైపాస్ రోడ్డు లో ఉన్న వయోవృద్ధుల డే కేర్ సెంటర్ “ ప్రణామ్ ” ను రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి అనిత రామచంద్రన్ శుక్రవారం జిల్లా సంక్షేమం శాఖ అధికారి రాజ్ కుమార్ కాంబ్లె తో కలిసి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. డే కేర్ సెంటర్ లో వసతులను, పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా శ్రీమతి అనితా రామచంద్రన్ కు డే కేర్ లో వసతులను, నిర్వహణా తీరును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యనిర్వాహక సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్బంగా ఆమె సంతృప్తి వ్యక్తం చేసి, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను వారికి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారి భాస్కర్, ఉద్యోగులు కొండయ్య, చంద్రమోహన్ ఉన్నారు.
వయోవృద్ధుల డే కేర్ సెంటర్ “ ప్రణామ్ ” ను పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి అనిత రామచంద్రన్ జగిత్యాల : జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహణలో బైపాస్ రోడ్డు లో ఉన్న వయోవృద్ధుల డే కేర్ సెంటర్
“ ప్రణామ్ ” ను రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి అనిత రామచంద్రన్ శుక్రవారం జిల్లా సంక్షేమం శాఖ అధికారి రాజ్ కుమార్ కాంబ్లె తో కలిసి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు.
డే కేర్ సెంటర్ లో వసతులను, పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా శ్రీమతి అనితా రామచంద్రన్ కు డే కేర్ లో వసతులను, నిర్వహణా తీరును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యనిర్వాహక సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ వివరించారు.
ఈ సందర్బంగా ఆమె సంతృప్తి వ్యక్తం చేసి, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను వారికి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారి భాస్కర్, ఉద్యోగులు కొండయ్య, చంద్రమోహన్ ఉన్నారు.
- జగిత్యాల : జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహణలో బైపాస్ రోడ్డు లో ఉన్న వయోవృద్ధుల డే కేర్ సెంటర్ “ ప్రణామ్ ” ను రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ మరియు ట్రాన్స్ జెండర్ సాధికారత సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి అనిత రామచంద్రన్ శుక్రవారం జిల్లా సంక్షేమం శాఖ అధికారి రాజ్ కుమార్ కాంబ్లె తో కలిసి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. డే కేర్ సెంటర్ లో వసతులను, పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా శ్రీమతి అనితా రామచంద్రన్ కు డే కేర్ లో వసతులను, నిర్వహణా తీరును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యనిర్వాహక సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్బంగా ఆమె సంతృప్తి వ్యక్తం చేసి, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను వారికి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారి భాస్కర్, ఉద్యోగులు కొండయ్య, చంద్రమోహన్ ఉన్నారు.4
- జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఈఓ ఎస్ అంజనారెడ్డి తో కలసి ఆవిష్కరించారు.ఈ నెల 10-05-2026 ఆదివారం నుండి 12-05-2026 మంగళవారం వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా యజ్ఞశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక హోమాలు నిర్వహించబడతాయి. అలాగే ఉత్సవ మూర్తికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక అభిషేకం, ఊంజళ్ సేవ ఘనంగా జరుగుతాయి.దీక్షామండపంలో హనుమాన్ దీక్షాస్వాములకు విరమణ కార్యక్రమం నిర్వహించబడునని అదేవిధంగా భక్తుల కోసం సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొండగట్టు అంజన్న ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుల దినసరి వేతనం రూ 295 నుండి 495 కు కొరగానే పెంచినందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హన్మంతరావు కు ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది అని మరియు ఇంకా 5 పారిశుద్ధ్య కార్మికుల పోస్టులు మంజూరు చేయించమాని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్ .అంజనారెడ్డి ,మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తిని మల్లీశ్వరి -శ్రీనివాస్ గౌడ్ ,సర్పంచ్ ఆదిరెడ్డి, సిఐ నీలం రవి, స్థానాచారి కపిందర్ ,ప్రధాన అర్చక రామకృష్ణ, ఉపప్రధాన అర్చక చిరంజివి,ఏ ఈఓ హరిహర్నాథ్,సూపర్ డెంట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.1
- RAJASHEKAR5
- 29 చట్టాలను నిలిపివేసి బిజెపి ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసింది ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు జగిత్యాల జిల్లా కోరుట్ల, మే డే స్ఫూర్తితో హక్కులు, సంక్షేమం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోరుట్ల పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్, ఎఐటియుసి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా 141,వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరుణ పతాకలు ఎగురవేసి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1886 మే 01,న అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో వేలాది మంది కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులు తడిసిన నెత్తుటి గుడ్డలే మేడే స్ఫూర్తి అన్నారు. నాటినుండి పోరాడి సాధించుకున్న కార్మిక వర్గపు 29 చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిలిపివేసి, పెట్టుబడుదారులకు, ప్రైవేటు శక్తులకు అనుకూలంగా అయిదు లేబర్ కోడులను తీసుకొచ్చిందన్నారు. దీని పరిణామం వల్ల కార్మికులు, ఉద్యోగులు భద్రత కోల్పోయి, చట్టాలు అమలు కాకుండా నిర్వీర్యం అయిపోయాయని, ప్రశ్నించే హక్కు లేకుండా ఉంటుందని, అలాంటి లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏన్నం రాధ,.అందే వంశీకృష్ణ, తిప్పర్తి రమేష్, మొయినుద్దీన్, రామిల్ల రాంబాబు, షేక్ చాంద్ పాషా, గుండేటి పోశెట్టి, కొక్కుల గంగాధర్, సాంబార్ మహేష్, మున్సిపల్ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, కార్మిక వీధులలో అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగ మే డే ఉత్సవాలు నిర్వహించారు.1
- జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో గురువారం రాత్రి గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్తంభం మధ్యకు విరిగిపడగా, విద్యుత్ తీగలు తెగి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. దీంతో గ్రామానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో ఉండిపోయారు. ఘటన జరిగిన వెంటనే గ్రామస్థులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తెగిపడిన విద్యుత్ తీగలతో ప్రమాదం పొంచి ఉండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో అవస్థలు ప్రస్తుతం మండుటెండలు మండిపోతున్న వేళ కరెంటు నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. తాగునీటి సరఫరాకు, వ్యవసాయ పనులకు, గృహ అవసరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విరిగిన స్తంభాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎండల్లో ప్రజల ఇక్కట్లు మరింత పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.1
- దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 1360 మంది భక్తులు హనుమాన్ మాల దీక్షను స్వీకరించారు. రాబోయే పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వారు శుక్రవారం దేవాలయంలోని మండపంలో హనుమాన్ దీక్షను స్వీకరించారు ఈ సందర్భంగా వారికి వేద పండితులు హనుమాన్ దీక్ష నియమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు తెలిసింది. ఈ రోడ్డు ప్రమాదం విషయం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారీకి తెలియడంతో బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలివెళ్లారు. రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బీఆర్ఎస్ నేత రాంమోహన్ సొదరుని కుటుంబ సభ్యులు మృతి చెందిన విషయం తెలియగానే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. శంషాబాద్ ఏసీపి నాగభూషణం ను వివరాలు అడిగి తెలిసుకున్నారు. కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. సిరిసిల్ల వాసులు మృతి పట్ల కేటీఆర్ దిగ్బాంతిని వ్యక్తం చేశారు.1
- జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.1