Shuru
Apke Nagar Ki App…
వంశధారలో తక్కువ నీటితో భక్తుల ఇక్కట్లు జలుమూరు: జలుమూరు మండలం శ్రీముఖలింగంలో బుధవారం జరిగిన చక్ర తీర్థ స్నానాల కార్యక్రమంలో వంశధార నదిలో నీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఏడాది ఇదే రోజున గొట్ట బ్యారేజ్ నుండి సంపూర్ణంగా నీటిని విడిచిపెట్టేవారు. అయితే ఈ ఏడాది అరకొరగా నీటిని విడుదల చేయడంతో, భక్తుల తాకిడితో వంశధార నదిలోని నీరు బురదమయంగా మారింది. దీంతో స్నానాలు చేసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Dr.Gangu Manmadharao
వంశధారలో తక్కువ నీటితో భక్తుల ఇక్కట్లు జలుమూరు: జలుమూరు మండలం శ్రీముఖలింగంలో బుధవారం జరిగిన చక్ర తీర్థ స్నానాల కార్యక్రమంలో వంశధార నదిలో నీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఏడాది ఇదే రోజున గొట్ట బ్యారేజ్ నుండి సంపూర్ణంగా నీటిని విడిచిపెట్టేవారు. అయితే ఈ ఏడాది అరకొరగా నీటిని విడుదల చేయడంతో, భక్తుల తాకిడితో వంశధార నదిలోని నీరు బురదమయంగా మారింది. దీంతో స్నానాలు చేసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లా పోలీసు పత్రికా ప్రకటన. ** శ్రీకాకుళం (జలుమూరు), ఫిబ్రవరి 18: జలుమూరు మండలం పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానాలు బుధవారం వంశధార నదిలో పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా పూర్తయ్యాయి. భక్తుల భారీ రద్దీ ఉంటుందని ముందస్తు అంచనాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సుమారు 1000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు,రోప్ పార్టీలు, రిజర్వ్ పార్టీలు, హోంగార్డు,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లో పాల్గొన్నాయి. పార్వతీ పరమేశ్వర స్వామివారి నంది వాహనం ఆలయం నుండి వంశధార నది మిర్యాపల్లి రేవుకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల మార్గంలో పటిష్టమైన రోప్ పార్టీల సహకారంతో, భక్తులు రద్దీ నియంత్రణ చేపట్టారు. నదిలో భక్తుల రద్దీని అరికట్టే దిశగా స్వామి వారు పుణ్యస్నానాల కోసం నాలుగు వరుసల బారికేడ్లు ఏర్పాటు చేసి,ప్రత్యేక విభజన ఏర్పాట్లు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో భక్తుల రాకపోకలు, ట్రాఫిక్, ఉత్సవ విగ్రహాల మార్గం తదితర అంశాలను జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేసి, భక్తులు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ నియంత్రణ, ఆకతాయిలపై కట్టడి, గ్రామ ప్రవేశ-నిష్క్రమణ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులు సమన్వయం, సమయస్ఫూర్తితో విధులు నిర్వహించారు. స్వామివారి పుణ్యస్నానాలు పూర్తయ్యి తిరిగి ఆలయానికి సురక్షితంగా చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. చక్రతీర్థ స్నానాలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యులైన అదనపు ఎస్పీలు కె.వి. రమణ, పి. శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది అందరి కృషి అభినందనీయం అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. భక్తులు,ప్రజలు అందించిన సహకారానికి జిల్లా పోలీసు శాఖ తరపున జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.2
- టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయం విగ్రహాల పునప్రతిష్ట కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజ అలంకరణ సహస్ర కుంకుమార్చన మహా హోమాలు చండీ హోమాలు పూర్ణ హుతినిర్వహించారు. భక్తుల్లో అమ్మవారందరినీ ప్రత్యేకంగా దర్శించుకున్నారు అనంతరం మహానసమారాధన కార్యక్రమం నిర్వహించారు.3
- టెక్కలికి 15 కోట్ల వ్యయంతో 50 పడగల ఆయుష్ హాస్పటల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ల చిత్రపటాలకు టిడిపి శ్రేణులు బుధవారం పాలాభిషేకం చేశారు. టెక్కలి అన్నా క్యాంటీన్ జంక్షన్లో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు మాట్లాడుతూ టెక్కలి అభివృద్ధికి కృషి చేస్తున్న అచ్చన్న నాయుడికి టెక్కలి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.1
- విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆసుపత్రులన్నీ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి మరియు ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి ఆసుపత్రి వ్యర్ధాల నిర్వహణా కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్ణీత సమయంలోగా తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలో రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులను ఉపయోగించి ఇంజక్షన్ సూదులు, పత్తి, గ్లౌవ్స్, శరీర వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న సుమారు 496 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పశుసంవర్ధక ఆసుపత్రుల నుంచి కూడా క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. సేకరించిన వ్యర్థాలను 48 గంటల గడువులోగా తరలించాలని, ఎక్కడా బయట కనిపించకూడదని స్పష్టం చేశారు. అంతేకాక, ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను 'బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్'లో ప్రతిరోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే నోటీసులు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటి నుంచీ బయో మెడికల్ వ్యర్ధాలను సైతం సేకరించి, సరైన పద్దతిలో వాటిని తరలించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అలాగే వ్యర్ధాలను బయట పడేసే ఆసుపత్రులపై నిఘా పెట్టాలని కోరారు.1
- ప్రేమ, పెళ్ళి పేరుతో బాలికను తీసుకొనిపోయి మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 🎯 *బాలికను మోసం చేసిన నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ * 🎯 *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ* 🎯 *బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషనులో 2024 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని ఫిబ్రవరి 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కుమార్తె (మైనరు బాలిక) కనపడటం లేదని తేది.22.05.2024న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భోగాపురం ఎస్ఐ పి.సూర్యకుమారి గర్ల్ మిస్సింగ్ క్రింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ బాలికను కనిపెట్టి తన నుండి స్టేట్మెంట్ నమోదుచేసిన భోగాపురం పోలీసులు. భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖపట్నం మరియు హైదరాబాదు తిప్పి శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తే.25.07.2024దిన పోక్సో సెక్షన్స్ క్రింద కేసును ఆల్టర్ చేశారన్నారు. అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.5,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.సూర్యకుమారి, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు వి.సత్యనారాయణ, ఎపిపి జి.సత్యంలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన 6నెలల కాలంలో 17 పోక్సో కేసులలో నిందితులకు కఠిన కారాగార శిక్ష పడిందని, జిల్లా ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,1
- చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు' ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ చక్ర తీర్థ స్నానాలను ఆచరించారు. సుమారు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు సమాచారం.1
- వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీఆర్ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.1
- జలుమూరు: జలుమూరు మండలం శ్రీముఖలింగంలో బుధవారం జరిగిన చక్ర తీర్థ స్నానాల కార్యక్రమంలో వంశధార నదిలో నీరు పూర్తిస్థాయిలో లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఏడాది ఇదే రోజున గొట్ట బ్యారేజ్ నుండి సంపూర్ణంగా నీటిని విడిచిపెట్టేవారు. అయితే ఈ ఏడాది అరకొరగా నీటిని విడుదల చేయడంతో, భక్తుల తాకిడితో వంశధార నదిలోని నీరు బురదమయంగా మారింది. దీంతో స్నానాలు చేసేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.1