*సర్పంచ్ పై దాడి అమానుషం...* - *అన్ని గుర్తు పెట్టుకుంటాం* - *సర్పంచ్ ను పరామర్శించిన కృష్ణచైతన్య* - *ఎస్పీ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు* ( న్యూస్, శ్రీకాకుళం) పంచాయతీ పరిధిలో శానిటేషన్ పనులు చేయిస్తున్న జలుమూరు మండలం టెక్కలిపాడు సర్పంచ్ ధర్మాన బువ్వాజీపై టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం అమానుషం అని వైకాపా యువ నాయకుడు, పోలాకి జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు రిమ్స్ లో చికిత్స పొందుతున్న బువ్వాజీని బుధవారం ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా ఎస్పీ గారిని నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు బాధితులకు తగు న్యాయం చేసి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని కోరారు .ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో టెక్కలిపాడు పంచాయతీలో సర్పంచ్ బువ్వాజి శానిటేషన్ పనులు నిర్వహిస్తుండగా టిడిపి నాయకులు వాటిని అడ్డుకోవడమే కాకుండా ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. తాము అధికారంలో ఉండగా సర్పంచ్ బువ్వాజి ఎలా శానిటేషన్ పనులు చేయిస్తాడని టిడిపి నాయకులు ప్రశ్నించడం చూస్తుంటే నరసన్నపేట నియోజకవర్గంలో రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రోత్బలంతోనే బువాజీపై టిడిపి నాయకులు దాడి చేశారని ఆరోపించారు. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి టిడిపి నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీటన్నిటికీ వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రతి చర్యకి తప్పదని హెచ్చరించారు. దీనిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులైన టిడిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణచైతన్య డిమాండ్ చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామని తాము అధికారంలోకి వచ్చాక లెక్క సమం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి దాడులను చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇప్పటికైనా టిడిపి నాయకులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీలు వాన గోపి ఆరంగి మురళిధర్ జెడ్పీటీసీ చింతు రామారావు , రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దామ మన్మధరావు , రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్ రావు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్ మోహన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురుగుబెల్లి వెంకట రమణి, మండల అధ్యక్షులు కనుసు సీతారాం, మండల బీసీ సెల్ అధ్యక్షులు పొన్నాడ విజయ్ కుమార్ మండల ప్రచార కమిటీ అధ్యక్షులు, మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బోది ఈశ్వరరావు, మండల యూత్ అధ్యక్షులు బుద్దల రాజశేఖర్ జిల్లా యూత్ కార్యదర్శి పాగోటి గోవింద మండల ఉప అధ్యక్షులు నేతింటి రాజేశ్వరరావు, పాగోటి రాజప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి ముద్దాడ గోవింద ,మండల కార్యదర్శి వాన గోవింద , మండల యూత్ ఉప అధ్యక్షులు తోట భార్గవ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి కనపల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
*సర్పంచ్ పై దాడి అమానుషం...* - *అన్ని గుర్తు పెట్టుకుంటాం* - *సర్పంచ్ ను పరామర్శించిన కృష్ణచైతన్య* - *ఎస్పీ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు* ( న్యూస్, శ్రీకాకుళం) పంచాయతీ పరిధిలో శానిటేషన్ పనులు చేయిస్తున్న జలుమూరు మండలం టెక్కలిపాడు సర్పంచ్ ధర్మాన బువ్వాజీపై టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం అమానుషం అని వైకాపా యువ నాయకుడు, పోలాకి జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు రిమ్స్ లో చికిత్స పొందుతున్న బువ్వాజీని బుధవారం ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా ఎస్పీ గారిని నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు బాధితులకు తగు న్యాయం
చేసి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని కోరారు .ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ పండగ సమీపిస్తున్న నేపథ్యంలో టెక్కలిపాడు పంచాయతీలో సర్పంచ్ బువ్వాజి శానిటేషన్ పనులు నిర్వహిస్తుండగా టిడిపి నాయకులు వాటిని అడ్డుకోవడమే కాకుండా ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. తాము అధికారంలో ఉండగా సర్పంచ్ బువ్వాజి ఎలా శానిటేషన్ పనులు చేయిస్తాడని టిడిపి నాయకులు ప్రశ్నించడం చూస్తుంటే నరసన్నపేట నియోజకవర్గంలో రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుందో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యే ప్రోత్బలంతోనే బువాజీపై టిడిపి నాయకులు దాడి చేశారని ఆరోపించారు. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి టిడిపి నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీటన్నిటికీ వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రతి చర్యకి తప్పదని హెచ్చరించారు. దీనిపై
పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులైన టిడిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణచైతన్య డిమాండ్ చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామని తాము అధికారంలోకి వచ్చాక లెక్క సమం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి దాడులను చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇప్పటికైనా టిడిపి నాయకులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీలు వాన గోపి ఆరంగి మురళిధర్ జెడ్పీటీసీ చింతు రామారావు , రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దామ మన్మధరావు , రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్ రావు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు
ధర్మాన జగన్ మోహన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురుగుబెల్లి వెంకట రమణి, మండల అధ్యక్షులు కనుసు సీతారాం, మండల బీసీ సెల్ అధ్యక్షులు పొన్నాడ విజయ్ కుమార్ మండల ప్రచార కమిటీ అధ్యక్షులు, మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బోది ఈశ్వరరావు, మండల యూత్ అధ్యక్షులు బుద్దల రాజశేఖర్ జిల్లా యూత్ కార్యదర్శి పాగోటి గోవింద మండల ఉప అధ్యక్షులు నేతింటి రాజేశ్వరరావు, పాగోటి రాజప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి ముద్దాడ గోవింద ,మండల కార్యదర్శి వాన గోవింద , మండల యూత్ ఉప అధ్యక్షులు తోట భార్గవ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి కనపల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
- ycp ra puka1
- రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్లో ఈనెల 10న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, తద్వారా 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు1
- గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం సహకార సంఘాల సొసైటీ సీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2019 నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని, మెడికల్ అలవెన్స్, గ్రాడ్యుటివ్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు.1
- హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్ఫోన్లు విడుదల చేయడానికి ఎస్ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్ఐని పట్టుకున్నారు.1
- Post by Ravi Poreddy1
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- 🙏🙏1
- ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రిసిపుల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కు గురువారం సాయంత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన కోర్టు ప్రాంగణం కి చేరుకుని అక్కడివారిని కాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టులో బాంబుని కనిపెట్టే పనిలో పడ్డారు.1
- గుంటూరు/ గుంటూరు కలెక్టరేట్ గుంటూరు కలెక్టరేట్ బంగ్లా ప్రధాన రహదారికి ఎట్టకేలకు మహర్దశ పట్టింది. ఐటీసీ మెడికల్ క్లబ్ సమీపంలో గురువారం తారు రోడ్డు మరమ్మతు పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. గతంలో గుంతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ఈ పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ సౌకర్యం కూడా సరిగ్గా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.1