నిరవధిక సమ్మె చేపట్టిన తెలంగాణ విద్యుత్ ఆర్టీసన్ ఉద్యోగులు...పాలకులు మారిన తమ బతుకులు మారడం లేదని ఉద్యోగుల ఆందోళన తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిసన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా కరీంనగర్ లోని ట్రాన్స్ కో ఎస్ఈ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరాహారదీక్ష తో ధర్నా చేశారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు. టీజీఎన్ఫీడిసీఎల్, టీజిఎస్పీడీసీఎల్ లో అన్ మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేయాలని, 2026 పిఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ, ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్నవారిని ఆర్టిసన్ గా గుర్తించాలని కోరారు. విద్యుత్ సంస్థలు బ్రిటిష్ కాలం నాటి విధానాలే కొనసాగుతున్నాయని పాలకులు, ప్రభుత్వాలు మారిన తమ బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు G.O.No.11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిరవధిక సమ్మె చేపట్టిన తెలంగాణ విద్యుత్ ఆర్టీసన్ ఉద్యోగులు...పాలకులు మారిన తమ బతుకులు మారడం లేదని ఉద్యోగుల ఆందోళన తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిసన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా కరీంనగర్ లోని ట్రాన్స్ కో ఎస్ఈ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరాహారదీక్ష తో ధర్నా చేశారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్ల కార్డులు ప్రదర్శించారు. టీజీఎన్ఫీడిసీఎల్, టీజిఎస్పీడీసీఎల్ లో అన్ మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేయాలని, 2026 పిఆర్సీ
అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ, ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్నవారిని ఆర్టిసన్ గా గుర్తించాలని కోరారు. విద్యుత్ సంస్థలు బ్రిటిష్ కాలం నాటి విధానాలే కొనసాగుతున్నాయని పాలకులు, ప్రభుత్వాలు మారిన తమ బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు G.O.No.11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల శిశువు మృతి కలకలం సృష్టించింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష పురిటి నొప్పులతో శనివారం ఆస్పత్రుల్లో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల బాబు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన తర్వాత డాక్టర్లు సరిగా పట్టించుకోకపోవడం వల్లే పసి బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ అయిన తర్వాత వెళ్ళిన డాక్టరు సోమవారం వచ్చి చూశాడని ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని, పుట్టినప్పటి నుంచే బాబు హెల్దీగా లేడని అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.4
- కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి టోర్నమెంట్ నిర్వహణ కొరకు చేపట్టిన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలలో, పట్టణం లలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి సీఎం కప్ వంటి టోర్నమెంట్లను నిర్వహించి క్రీడా అభివృద్ధికి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా కృషి చేశారు. నేడు అనేక చోట్ల ఈ క్రీడా ప్రాంగణాలు ఆదరణకు దూరమై వాటి స్వరూపాలను కోల్పోయాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిర్వహించాల్సిన పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాలను బాగుపరిచి ప్రజల వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యువత, విద్యార్థులు వారి వార్షిక పరీక్షలు ముగించుకొని వేసవి సెలవుల్లో ఉండనున్నారు కాబట్టి యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా గౌరవ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆశయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆలోచనల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 మున్సిపాలిటీలు 12 మండలాల వారిగా దాదాపు 25 వందల మంది క్రీడాకారులు పాల్గొనేలా ఈనెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు కెసిఆర్ కప్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందులో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 39 వార్డుల నుండి వచ్చే క్రీడాకారుల మధ్య టోర్నమెంట్ నిర్వహించడం కోసం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి టోర్నమెంట్ నిర్వహణకు అనుగుణంగా వివిధ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ పాల్గొనాలని ఇలాంటి టోర్నమెంట్లను ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రతి రెండు వార్డులకు ఒక జట్టును ఎంపిక చేసి ఆ క్రికెట్ జట్ల మధ్య పోటీ నిర్వహించి సిరిసిల్ల పురపాలక సంఘం నుండి విజేతలుగా నిలిచిన జట్టు జిల్లా స్థాయిలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు పంపించడం జరుగుతుందని ఇందులో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని క్రికెట్ క్రీడాకారులు పాల్గొని జిల్లా స్థాయిలో కేసీఆర్ కప్ ను గెలుచుకునేలా వారి ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు .1
- ములుగు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పూర్తిగా చట్ట విరుద్ధమని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో గోపాలరావు హెచ్చరించారు.కలెక్టరేట్లో నిర్వహించిన “సురక్షిత మాతృత్వం – లింగ నిర్ధారణ నిరోధక చట్టం” పై వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ పరీక్షలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత ఆసుపత్రుల అనుమతులు రద్దు చేయడమే కాక, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.1
- Post by Tagore1
- ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజీ ప్రభు ఉపాధ్యక్షులు భూమని ప్రశాంత్ డాకాని భానుచంద్రం జనరల్ సెక్రటరీ డాకాని నర్సింగ్ రావు జాయింట్ సెక్రటరీ చిన్నోల్లా రామచంద్రం సెక్రటరీ సైదామోల్లా లింగం క్యాషీర్ గుండ్ర రామచంద్రం ఆధ్వర్యంలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూజీ గా ప్రసిద్ధి చెందిన ఆయన దళిత వర్గాల హక్కుల కోసం సామాజిక న్యాయం పోరాడారు. సుమారు ముపై ఏండ్ల పైగా రాజకీయ ప్రస్థానం సమర్ధవంతంగా నిర్వహించి దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు.అదేవిధంగా చదువుకునే రోజుల్లో నే కుల వివక్షతను ఎదురుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్లు శివల నీలం గుండ్ర నరసింహులు చల్ల శ్రీనివాస్ భూమిని రాములు గజ్వేల్ గుండ్ర యాదగిరి సాయిలు సోము యాదగిరి గజ్వేల్ స్వామి ఈదొల్ల కృష్ణ రవి క్యాసారం రాజు సైదుమొల్ల లింగం మాజీ ఆటో ప్రెసిడెంట్ బద్రి యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- గారేపల్లి, ఏప్రిల్ 8: గారేపల్లి-మహాదేవపూర్ జాతీయ రహదారిపై చిన్నవాగు సమీపంలో కోడి వ్యర్థాలను విచ్చలవిడిగా పారబోస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చికెన్ వ్యాపార నిర్వహకులు నిర్లక్ష్యంగా ఈ వ్యర్థాలను పారబోస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ వ్యర్థాల నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగా హైవేపై ప్రయాణించే వాహనదారులు, సమీప రైతులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పరిస్థితి మరింత విషమిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి హానికరంగా మారుతున్న ఈ చర్యలపై అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖలు తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేటలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమను పూర్తిస్థాయిలో పర్మినెంట్ చేయాలనే డిమాండ్తో నిరవధిక సమ్మెకు దిగారు. రిజల్ట్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది. కాంట్రాక్ట్ విధానంలో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ నుంచి పర్మినెంట్గా మార్పు ప్రక్రియను పారదర్శకంగా, విద్యార్హతలకు అనుగుణంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు, తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.2
- సింగరేణిలో మెడికల్ బోర్డును రద్దు చేసే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మీడియా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకు 3 మెడికల్ బోర్డులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకు మాత్రమే రెండు మెడికల్ బోర్డు నిర్వహించిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో మెడికల్ బోర్డులో అవకతవకులు జరిగాయని, దానిపై విజిలెన్స్ అధికారులచే విచారణ చేపడుతామన్నారు. దాన్ని సాకుగా తీసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మెడికల్ బోర్డులు నిర్వహించి అన్ ఫిట్ అయిన వారి వారసులకు నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర సాయిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు బీఆర్ఎస్ రానున్న రోజుల్లో నిరసనలు చేపడుందని తెలిపారు.1